2009 నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు2009 భారత సాధారణ ఎన్నికలతో పాటు 2009 ఏప్రిల్లో జరిగాయి. రాష్ట్రంలో రెండు దశల్లో (ఏప్రిల్ 16, ఏప్రిల్ 23) లో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఏప్రిల్ 16 న ప్రకటించారు. అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ మెజారిటీ తగ్గినప్పటికీ అధికారాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, అప్పటి ముఖ్యమంత్రివై.యస్. రాజశేఖరరెడ్డినే తిరిగి తన నాయకుడిగా ఎన్నుకుంది. అతనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు.
2004 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, శాసనసభ లోని 294 సీట్లలో 185 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఎన్నికల కూటమి లోని భాగస్వాములు లెఫ్ట్ ఫ్రంట్, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మంచి ఫలితాలు సాధించాయి. అవి 15, 26 స్థానాలను గెలుచుకోవడాంతో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) సంఖ్యను 226కి చేరింది.[3] కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.[4]
ఊహించినట్లుగానే, ప్రభుత్వం 5 సంవత్సరాల పూర్తి పదవీకాలం కొనసాగింది. శాసనసభ పదవీకాలం 2009 మే 30 న ముగిసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయించింది. ఎన్నికలు ఒకే దశలో జరిగాయి.[5]
2008 లోక్సభ విశ్వాస తీర్మానం తర్వాత, రాష్ట్రంలోనూ కాంగ్రెస్కు లెఫ్ట్ ఫ్రంట్ మద్దతు ఉపసంహరించుకుంది. తెలుగుదేశం పార్టీ (టిడిపి), టిఆర్ఎస్ జాతీయ థర్డ్ ఫ్రంట్లో భాగంగా వామపక్షాలతో కలిసాయి. ఆంధ్రప్రదేశ్లో, ఈ కూటమి తమను తాము "అవినీతి కాంగ్రెస్", "మతతత్వ బిజెపి" లకు వ్యతిరేకంగా "మహాకూటమి" అని వర్ణించుకుంది.[6]
అయితే, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాక, ఓట్ల లెక్కింపు చేపట్టే లోపే, టీఆర్ఎస్ ఎన్డీయేకి మిత్రపక్షంగా మారిపోయింది.[7]