2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
Jump to navigation
Jump to search
| |||||||
|
2004 సంవత్సరంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో రాష్ట్రంలో అంతకు ముందున్న 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ పరాజయాన్ని చవిచూడింది. ఎన్నికల అనంతరం డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఈ ఎన్నికల పోలింగ్ రెండు దశల్లో ఏప్రిల్ 20, 26 తేదీల్లో జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, కమ్యూనిస్టులు, మజ్లిస్ పార్టీలు ఎన్నికలలో పొత్తులు పెట్టుకొని ఒక కూటమిగా ఏర్పడ్డారు. తెలుగు దేశం, బి.జె.పి. పార్టీలు ఒక కూటమిగా పోటీ చేశారు.
పార్టీల వారీగా ఫలితాలు[మార్చు]
గెలిచినవారిలో ఒకరి "సి.పి.ఐ. ఎమ్-ఎల్., న్యూ డెమోక్రసీ"కి చెందిన అభ్యర్ధి.
కొన్ని గణాంకాలు[మార్చు]
ఎన్నికలలో పాల్గొన్న పార్టీలు[మార్చు]
- జాతీయ పార్టీలు
- భారతీయ జనతా పార్టీ
- బహుజన సమాజ పార్టీ
- భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.)
- భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఎమ్.)
- భారత జాతీయ కాంగ్రెస్
- రాష్ట్ర పార్టీలు
- తెలుగు దేశం పార్టీ
- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (రిజిష్టర్ కానిది)
- తెలంగాణ రాష్ట్ర సమితి (రిజిష్టర్ కానిది)
- తెలంగాణ ప్రజా పార్టీ (రిజిష్టర్ కానిది)
- మజ్లిస్
- మజ్లిస్ బచావో తెహరీక్
ఈ పార్టీల అభ్యర్ధులే కాకుండా అనేక స్వతంత్ర అభ్యర్ధులు ఎన్నికల రంగంలో ఉన్నారు.
నియోజక వర్గ లెక్కలు[మార్చు]
మొత్తం నియోజక వర్గాలు | 294 |
సాధారణ | 240 |
యస్.సీ. | 39 |
యస్.టీ. | 15 |
నియోజక వర్గం Vs అభ్యర్థుల సంఖ్య[మార్చు]
ఏకగ్రీవం | 0 |
ఇద్దరు పోటీపడిన నియోజక వర్గాలు | 14 |
ముగ్గురు పోటీపడిన నియాజక వర్గాలు | 19 |
నలుగురు పోటీపడిన నియోజక వర్గాలు | 47 |
ఐదుగురు పోటీపడిన నియోజక వర్గాలు | 53 |
ఆరు నుండి పది మంది పోటీపడిన నియోజక వర్గాలు | 129 |
పదకొండు నుండి పదయిదు మంది పోటీ పడ్డ నియోజక వర్గాలు | 29 |
పదిహేను లేదా ఆ పైన | 3 |
- మొత్తం పోటీపడ్డ అభ్యర్థులు - 1896
- సరాసరి ఒక్కో నియోజక వర్గానికి - 6 చొప్పున
- ఏదేనీ నియోజక వర్గంలో గరిష్ఠ అభ్యర్థుల సంఖ్య - 16