ఉత్తర మధ్య అండమాన్ జిల్లా
ఉత్తర మధ్య అండమాన్ జిల్లా | |
---|---|
నిర్దేశాంకాలు: 12°55′12″N 92°54′00″E / 12.92000°N 92.90000°ECoordinates: 12°55′12″N 92°54′00″E / 12.92000°N 92.90000°E | |
దేశం | ![]() |
రాష్ట్రాలు | అండమాన్ నికోబార్ దీవులు |
రాజధాని | మాయా బందర్ |
కాలమానం | UTC+5:30 (IST) |
జాలస్థలి | northmiddle |
ఉత్తర మధ్య అండమాన్ జిల్లా, బంగాళాఖాతంలోని భారతదేశ కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులకు చెందిన మూడు జిల్లాలలో ఇది ఒకటి. దీని జిల్లా ప్రధాన కార్యాలయం మాయాబందర్ పట్టణంలో ఉంది. ఈ జిల్లా విస్తీర్నం 3251.85 చ.కి.మీ ఉంది
చరిత్ర[మార్చు]
పూర్వపు అండమాన్ జిల్లాను విభజించడం ద్వారా ఈ జిల్లా ఆగష్టు 18, 2006 న సృష్టించబడింది.[1] ఇందులో పూర్వ జిల్లాలోని మాయాబందర్ ఉపవిభాగానికి చెందిన మూడు తాలూకాలు ఉన్నాయి.
భౌగోళికం[మార్చు]
ఉత్తర మధ్య అండమాన్ జిల్లా విస్తీర్నం 3,227 ఛ.కి.మీ 1,246 (చ.మైళ్లుకు సమానం) . [2]
జనాభా[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో 105,597 జనాభా ఉంది, [3] ఇది సమారుగా టోంగా దేశానికి సమానం. [4] ఇది భారతదేశంలో 640 ర్యాంకులలో ఇది 614 వ ర్యాంకును కలిగిఉంది. జిల్లాలో జనాభా సాంద్రత చ.కి.మీ.కు 32 మంది (83 / చ. మై). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు -0.07%. ఉత్తర మధ్య అండమాన్ ప్రతి 1000 మంది పురుషులకు లింగ నిష్పత్తి 925గా ఉంది.అక్షరాస్యత రేటు 84.25%గా ఉంది.జిల్లా జనాభాలో ఎక్కువ శాతం బెంగాలీలు .
చారిత్రక జనాభా వివరాలు[మార్చు]
భారత జనాభా లెక్కల ప్రకారం ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో 1901 నుండి 2011 వరకు జనాభా పెరుగదల, తరుగుదల వివరాలు ఈ దిగువ పట్టికలో వివరించిన ప్రకారం ఉన్నాయి.[5]
వ.సంఖ్య | సంవత్సరం | జనాభా | సంవత్సరానికి
పెరుగుదల శాతం |
సంవత్సరానికి
తరుగుదల శాతం |
---|---|---|---|---|
1 | 1901 | 6,999 | - | - |
2 | 1911 | 6,807 | - | (-) 2.7 |
3 | 1921 | 6,874 | (+) 1.0% | - |
4 | 1931 | 7,417 | (+) 7.9% | - |
5 | 1941 | 8,225 | (+) 10.9% | - |
6 | 1951 | 7,317 | - | (-) 11.0% |
7 | 1961 | 18,901 | (+) 158.3% | - |
8 | 1971 | 35,605 | (+)88.4% | - |
9 | 1981 | 58,716 | (+) 64.9% | - |
10 | 1991 | 84,312 | (+) 43.6% | - |
11 | 2001 | 1,05,613 | (+) 25.3% | - |
12 | 2011 | 1,05,597 | (+) 0.0% | - |
మాట్లాడే భాషలు[మార్చు]
నికోబార్ దీవులలో ఎక్కువగా మాట్లాడే భాష బెంగాలీ. 2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా జనాభాలో 53.79 శాతం బెంగాలీ మొదటి భాషగా మాట్లాడతారు. తరువాత హిందీ (17.06%), తమిళం (6.46%), కురుఖ్ (6.17%), తెలుగు (5.94%), మలయాళం (3.5%) ), నికోబారీస్ (0.57%) , ఇతరులు 4.97% శాతం ఇతర భాషలను మాట్లాడుతారు.[6]
మయన్మార్లోని కైన్ స్టేట్ నుండి వచ్చిన సినో-టిబెటన్ జాతి సమూహానికి చెందిన కరెన్ ప్రజలు, మాయాబందర్, డిగ్లిపూర్ తహసిల్స్లోని ఎనిమిది గ్రామాల్లో సుమారు 2000 మంది ఉన్నారు [7]
మాయాబందర్ తహసిల్[మార్చు]
- వెబ్,
- డియోపూర్,
- లాటావ్,
- లక్నో (బర్మాడెరా),
- కర్మతాంగ్ -9
- కర్మతాంగ్ -10
డిగ్లిపూర్ తహసిల్[మార్చు]
- బోరాంగ్
- చిపోన్
ఆర్థిక వ్యవస్థ[మార్చు]
2010 నాటికి, జిల్లా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు బియ్యం (సుమారు 6500 హెక్టార్లు), కొబ్బరికాయలు (3600 హెక్టార్లు), రబీ పప్పులు (2900 హెక్టార్లు), అరేకా గింజలు (1300 హెక్టార్లు), అరటిపండ్లు (650 హెక్టార్లు). [8]
రెవెన్యూ విభాగాలు[మార్చు]
జిల్లాలో 3 తహసీల్స్, డిగ్లిపూర్, మాయాబందర్, రంగత్ ఉన్నాయి.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Andaman Islands: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1208. ISBN 978-81-230-1617-7.
- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Tonga 105,916 July 2011 est.
- ↑ https://www.censusindia.gov.in/2011census/PCA/A-2_Data_Tables/35%20A-2%20Andaman%20&%20Nicobar%20Islands.pdf