తంగి సత్యనారాయణ
Tangi Satyanarayana తంగి సత్యనారాయణ | |||
![]() తంగి సత్యనారాయణ విగ్రహం | |||
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభాపతి
| |||
పదవీ కాలము 1983 - 1984 | |||
ముందు | అగరాల ఈశ్వరరెడ్డి | ||
---|---|---|---|
తరువాత | నిశ్శంకరరావు వెంకటరత్నం | ||
నియోజకవర్గము | శ్రీకాకుళం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1931 , సెప్టెంబరు 8 శ్రీకాకుళం జిల్లా | ||
మరణం | అక్టోబరు 25 , 2009 కిల్లిపాలెం, శ్రీకాకుళం జిల్లా | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం | ||
మతం | హిందూ |
తంగి సత్యనారాయణ (1931 - 2009) శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాసనసభ్యుడు.
శ్రీకాకుళం జిల్లా నుండి ఈయనొక్కడే సభాపతిగా చేశాడు . చాలా మంచి స్వభావము కలవాడు . వెలమ కులములో పుట్టి, న్యాయవాదిగా ఎదిగి రాజకీయాలలో అత్యున్నత పదవి అయిన శాసనసభ సభాపతిగా ఎన్నికయ్యాడు . రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకరు తంగి సత్యనారాయణ (78) : శ్రీకాకుళం రూరల్ మండలంలో కిల్లిపాలెం లో 1931 సెప్టెంబరు 8న జన్మించిన సత్యనారాయణకు భార్య ఆదిలక్ష్మి, నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. గార సమితికి ప్రప్రథమ అధ్యక్షునిగా 1959-64లో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1967-72 మధ్య స్వతంత్ర పార్టీ తరఫున శాసనసభ్యునిగా చేశాడు. 1972లో కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందాడు. తిరిగి 1983 లో రెండోసారి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడాదిన్నర పాటు శాసనసభ సభాపతిగా వ్యవహరించాడు. 1984 లో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెలరోజుల పాటు రెవెన్యూ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తించాడు. తిరిగి 1986 లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. మళ్లీ 2008 లో తంగి సత్యనారాయణ కాంగ్రెసులో చేరాడు. రెండుసార్లు బార్ అసోసియేషన్కు అధ్యక్షుడుగా ఎన్నికైన ఈయన క్రిమినల్ లాయర్గా జిల్లాలో మంచి ఖ్యాతి నార్జించాడు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోథులు గౌతు లచ్చన్న, ఎన్.జి.రంగాలకు సహచరునిగా రాజకీయాల్లో కొనసాగాడు. ఎ.ఐ.సి.సి. సభ్యుడుగా కాంగ్రెసు పార్టీలో కొనసాగేడు.
తంగి సత్యనారాయణ - శ్రీకాకుళంలోని తన నివాసంలో అక్టోబరు 25, 2009, ఆదివారం ఉదయం కన్నుమూశాడు. అన్నవాహికలో ఏర్పడిన క్యాన్సర్తో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయనకు హైదరాబాదులో శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారు.
- ఈయన 1967, 1983 సంవత్సరాలలో శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.
- ఈయన 1983-84 మధ్య (18.01.1983 నుండి 28.08.1984 వరకు) ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి పదవిని సమర్ధవంతంగా నిర్వర్తించాడు.[1]
- నందమూరి తారక రామారావు పదవీచ్యుతుడైన పిదప ఈయన నాదెండ్ల భాస్కరరావుతో చేతులు కలిపి కొద్దికాలం రెవిన్యూ మంత్రిగా పనిచేశాడు.[2]
- సత్యనారాయణ అక్టోబరు 25, 2009 తేదీన తన సొంత ఊరు కిల్లిపాలెం లో పరమపదించాడు.[2]
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ http://legislativebodiesinindia.nic.in/STATISTICAL/AP.htm
- ↑ 2.0 2.1 "Former speaker Satyanaryana dies". Times of India. 2009-10-26. Retrieved 2009-10-28.
ఇతర లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు
- 1931 జననాలు
- 2009 మరణాలు
- శ్రీకాకుళం జిల్లా రాజకీయ నాయకులు
- శ్రీకాకుళం జిల్లా న్యాయవాదులు
- శ్రీకాకుళం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు