తమ్మినేని సీతారాం
తమ్మినేని సీతారాం | |||
![]() తమ్మినేని సీతారాం | |||
2వ సభాధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ శాసనసభ
| |||
---|---|---|---|
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం మే 2019 | |||
గవర్నరు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
ముందు | కోడెల శివప్రసాదరావు | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం మే 2019 | |||
ముందు | కూన రవికుమార్ | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం | |||
పదవీ కాలము 1983 – 1989 | |||
ముందు | పైడి శ్రీరామమూర్తి | ||
తరువాత | పైడి శ్రీరామమూర్తి | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం | |||
పదవీ కాలము 1994 – 2004 | |||
ముందు | పైడి శ్రీరామమూర్తి | ||
తరువాత | బొడ్డేపల్లి సత్యవతి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తొగరాం , శ్రీకాకుళం జిల్లా | జూన్ 10, 1955||
రాజకీయ పార్టీ | వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | శ్రీరామమూర్తి ఇందుమతి | ||
బంధువులు | కూన రవికుమార్ | ||
నివాసము | ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా | ||
మతం | హిందూ |
తమ్మినేని సీతారాం ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి శాసనసభ సభ్యునిగా గెలుపొంది స్పీకర్ గా ఎన్నికయ్యాడు.[1] మొదటగా తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశాడు. తర్వాత ప్రజా రాజ్యం పార్టీలో కొంతకాలం పనిచేశాడు.
జీవిత విశేషాలు[మార్చు]
తమ్మినేసి సీతారాం శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అతను ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో తమ్మినేని శ్రీరామమూర్తి, ఇందుమతి దంపతులకు జన్మించాడు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల నందు విద్యాభ్యాసం చేసాడు. 1980లో తన 18వ యేటనే ఆముదాలవలస సుగర్ ఫ్యాక్టరీ డైరక్టర్ గా పనిచేసాడు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించాక ఆ పార్టీలో చేరి ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనాడు. తొమ్మిదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసాడు. 18 శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రభుత్వ విప్ గా ఐదేళ్ళు, శాప్ డైరక్టరుగా మూడేళ్ళు ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా మూడుసార్లు పనిచేసాడు.[2]
ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావముతో తమ్మినేని సీతారాం ఆ పార్టీలో చేరి ఎన్నికల్లో ఓడిపోయాడు. తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన 'ఆపరేషన్ స్వగృహ' పిలుపు మేరకు గత ఎన్నికల్లో తెదేపాకు వదలి ప్రజారాజ్యం పార్టీలో చేరిన పలువురు నేతలు ఒక్కొక్కరుగా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. తమ్మినేని సీతారాం కూడా ప్రజారాజ్యం పార్టీని వదలి 2009 ఆగస్టు 15 న తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలం అంటూ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని తమ్మినేని సీతారాం తప్పపట్టాడు. విభజన విషయంలో బాబు కీలకపాత్ర పోషించడంపై సీతారాం నిప్పులు చెరిగాడు. బాబు వైఖరికి నిరసనగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశాడు. విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావాన్ని ప్రకటించాడు.అతను 2013 ఆగస్టు 29 న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి చేరాడు[3]. 2014 ఎన్నికల్లో ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుండి వై.ఎస్.అర్ పార్టీ తరుపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన రవికుమార్ పై పోటీ చేశారు కానీ ఓడిపోయాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో వై.ఎస్.అర్ పార్టీ తరుపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన రవికుమార్ పై విజయం సాధించాడు.
మూలాలు[మార్చు]
- ↑ Samdani MN (7 June 2019). "Tammineni Sitaram to be Andhra Pradesh assembly speaker".
- ↑ వై.సి.పి లో చేరిన తమ్మినేసి సీతారాం
- ↑ "Ex-minister Tammineni Sitaram joins YSR Congress". దక్కన్ క్రానికల్. Retrieved 29 August 2013.[permanent dead link]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు
- శ్రీకాకుళం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- జీవిస్తున్న ప్రజలు
- శ్రీకాకుళం జిల్లా రాజకీయ నాయకులు
- శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2019)
- 1955 జననాలు