Coordinates: 16°23′56″N 78°38′13″E / 16.3990°N 78.6370°E / 16.3990; 78.6370

అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా)

వికీపీడియా నుండి
(అచ్చంపేట (మహబూబ్ నగర్ జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అచ్చంపేట
రెవెన్యూ గ్రామం
అచ్చంపేట is located in Telangana
అచ్చంపేట
అచ్చంపేట
భారతదేశం పటంలో తెలంగాణాలో స్థానం
అచ్చంపేట is located in India
అచ్చంపేట
అచ్చంపేట
అచ్చంపేట (India)
Coordinates: 16°23′56″N 78°38′13″E / 16.3990°N 78.6370°E / 16.3990; 78.6370
దేశంభారతదేశం
Stateతెలంగాణ
జిల్లానాగర్‌కర్నూల్
Elevation
78.73 మీ (258.30 అ.)
Population
 (2011)[1]
 • Total20,721
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
509375
టెలిఫోన్ కోడ్08541
ISO 3166 codeIN-TG
Vehicle registrationTS
సమీప విమానాశ్రయంహైదరాబాద్
లోక్‌సభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
శాసనసభ నియోజకవర్గంఅచ్చంపేట

అచ్చంపేట, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలానికి చెందిన గ్రామం,[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] 2013 జూన్ 25న అచ్చంపేట పురపాలకసంఘంగా ఏర్పడింది.[3] ఈ పట్టణం నల్లమల అడవులకు సమీపంలో ఉంది. హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణా పరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగి ఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణం అభివృద్ధిలో ఉంది. బస్సు డిపో కూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి. వైద్య పరంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది.

చరిత్ర[మార్చు]

ఈ ప్రాంతాన్ని పరిపాలించిన దేవినేని అచ్చమ్మ దొరసాని ఈ పట్టణాన్ని ఏర్పరిచింది కాబట్టి ఆమె పేరుమీదుగా ఇది అచ్చంపేట అయిందని కొందరు చరిత్రకారుల భావన. ఐతే18వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అలంపూరు బిజ్జల పాలక వంశానికి చెందని అచ్చమ్మ స్థాపించిందనీ, ఆమె పేరుమీదుగా అచ్చంపేట అయిందని కొందరు చరిత్రకారులు చెప్తారు. దేవినేని అచ్చమ్మ దొరసాని గ్రామాన్ని నెలకొల్పినట్టు పేర్కొనే శాసనం ఒకటి ఉమామహేశ్వరంలో లభిస్తోంది.[4]

పరిపాలన[మార్చు]

గ్రామంలో 1898లో మునసబు ఆఫీసు, 1939లో తహశ్శీలు ఆఫీసు ఏర్పడ్డాయి. దీనితో 1939లోనే తాలూకా కేంద్రమైంది.[4]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం - 28384, గ్రామీణ జనాభా 40504.

విద్యాసంస్థలు[మార్చు]

  • ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
  • ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
  • త్రివేణి జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
  • ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
  • ప్రగతి డిగ్రీ కళాశాల
  • తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97), ఫోను నెం:08541-272040

పర్యాటక ప్రదేశాలు[మార్చు]

ఉమామహేశ్వరాలయం
  • ఉమామహేశ్వరాలయం. (శ్రీశైలం ఉత్తర ద్వారం)
  • మల్లెలతీర్థం: శ్రీశైలం వెళ్ళేదారిలో వటవర్లపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉంటుంది.
  • లోద్ది మల్లయ్య స్వామి దేవాలయం.
  • సలేశ్వరం: తెలంగాణా అమరనాథ్‌గా పిలవబడుతుంది. ప్రత్యేకమైన ఉత్సవాల రోజుల్లో మాత్రమే ఇక్కడికి ప్రజలు వస్తుంటారు.
  • ఫరహాబాద్ దృశ్య కేంద్రం: నల్లమల్ల అడవుల్లోనుండి కృష్ణానది సౌందర్యాన్ని చూడటానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఒక ప్రదేశం.
  • మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం
  • అక్కమహాదేవి గుహలు
  • శ్రీ సాయిబాబా మందిరం:అవతారమూర్తిగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్న శ్రీ సాయిబాబా మందిరం, ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరంగా పేరుగాంచింది.

నీటిపారుదల భూమి[మార్చు]

2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[5]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.
  2. 2.0 2.1 "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. "Basic Information of Municipality, Atchampet Municipality". atchampetmunicipality.telangana.gov.in. Retrieved 12 April 2021.
  4. 4.0 4.1 లింగమూర్తి, కపిలవాయి (1992). పాలమూరు జిల్లా ఆలయాలు. 17.
  5. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79

బయటి లింకులు[మార్చు]