Coordinates: 27°02′15″N 88°15′47″E / 27.03750°N 88.26306°E / 27.03750; 88.26306

డార్జిలింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Darjeeling
Town
Left to right from top: Darjeeling with Kangchenjunga, the world's third-highest mountain, rising behind it; a Darjeeling Himalayan Railway train steaming to the main train station; a tea garden, or tea plantation
పటం
Interactive map of Darjeeling
Coordinates: 27°02′15″N 88°15′47″E / 27.03750°N 88.26306°E / 27.03750; 88.26306
CountryIndia
StateWest Bengal
DistrictDarjeeling
SettledLeased in 1835 from Tsugphud Namgyal, the Chogyal of the Kingdom of Sikkim, and annexed in 1849.[1][2][3] Municipality, 1 July 1850.[4][5]
Founded byBritish East India Company, during Company rule in India[6][7]
Government
 • BodyDarjeeling Municipality
 • ChairmanAmar Singh Rai
Area
 • Total7.43 km2 (2.87 sq mi)
Elevation2,045 మీ (6,709 అ.)
Population
 • Total1,18,805
 • Density15,990/km2 (41,400/sq mi)
Languages
 • OfficialBengali and Nepali[12]
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)

డార్జిలింగ్, అనేది భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఉత్తర ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం. ఇధి పురపాలక సంఘం. ఇది సముద్రమట్టానికి 2,045 metres (6,709 ft) సగటు ఎత్తులో తూర్పు హిమాలయాలలో ఉంది.[9] డార్జిలింగ్‌కు పశ్చిమాన నేపాల్ తూర్పున ఉన్న ప్రావిన్స్, తూర్పున భూటాన్ రాజ్యం, ఉత్తరాన భారతదేశం లోని సిక్కిం రాష్ట్రం, ఉత్తరాన చైనాలోని టిబెట్ స్వాధికార ప్రాంతం ఉన్నాయి. దక్షిణ, ఆగ్నేయంలో బంగ్లాదేశ్ ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని చాలా భాగం దక్షిణ నైరుతి దిశలో ఉంది. డార్జిలింగ్ ప్రాంతానికి ఇరుకైన మార్గం ద్వారా అనుసంధానించబడిxది. కాంచన్‌ జంగా, ప్రపంచం లోని మూడవ ఎత్తైన పర్వతం, ఉత్తరాన ఉంది.స్పష్టమైన రోజులలో ఇది ప్రముఖంగా కనిపిస్తుంది.[lower-alpha 6] [14]

19వ శతాబ్దం ప్రారంభంలో, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో, డార్జిలింగ్ బ్రిటీష్ అధికారుల, సైనికుల కుటుంబాలకు వేసవి విడిదికి అనువైన ప్రదేశంగా గుర్తించారు. సిక్కిం రాజ్యం నుండి ఇరుకైన పర్వత శిఖరం లీజుకు తీసుకోబడింది. చివరికి అది బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయబడింది. డార్జిలింగ్ దిగువన ఉన్న పర్వత వాలులలో తేయాకు తోటలు పెంచే ప్రయోగం చాలా విజయవంతమైంది. అడవులను నిర్మూలించటానికి, యూరోపియన్ తరహాలో విహారయాత్రికుల కుటీరాలు నిర్మించడానికి, తేయాకు తోటలలో పని చేయడానికి వేలాదిమంది కార్మికులను ప్రధానంగా నేపాల్ నుండి నియమించారు. విస్తృతమైన అటవీ నిర్మూలన స్థానిక ప్రజలను స్థానభ్రంశం చేసింది. భారతదేశంలో నివసించే బ్రిటిష్ వారి పిల్లల విద్య కోసం డార్జిలింగ్, చుట్టుపక్కల రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పడ్డాయి. 19వ శతాబ్దపు చివరినాటికి, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అనే నోవల నారో-గేజ్ పర్వత రైల్వేద్వారా, వేసవి నివాసితులను పట్టణంలోకి తీసుకువచ్చింది. ప్రపంచానికి ఎగుమతి చేయడానికి తేయాకు సరుకును తీసుకువెళ్లింది.1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, బ్రిటీష్ వారు డార్జిలింగ్‌ను విడిచిపెట్టినప్పుడు, దాని తేయాకు తోటల మైదాన ప్రాంతాలనుండి కాటేజీలను సంపన్న భారతీయులు, పట్టణం వెలుపల ఉన్నభారతీయ వ్యాపార యజమానుల సమూహాలు కొనుగోలు చేశారు.

పట్టణ అసలైన అభివృద్ధిలో పనిచేసిన స్వదేశీ వలస కార్మికుల వారసుల నుండి ఎక్కువగా ఈ రోజు డార్జిలింగ్ జనాభా ఏర్పడింది. వారి సాధారణ భాష నేపాలీ భాషకు, భారతదేశ రాష్ట్రసమాఖ్య స్థాయిలలోఅధికారిక గుర్తింపు లభించినప్పటికీ, ఆ గుర్తింపు ఆ భాష మాట్లాడేవారికి అర్ధవంతమైన ఉపాధిని సృష్టించలేదు, లేదా వారిరాజకీయ వ్యవహారాలలో చెప్పుకోదగినంత గొప్పగా మాట్లాడే సామర్థ్యాన్ని పెంచలేదు. తేయాకు పరిశ్రమ, పర్యాటకం పట్టణ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన వనరులు.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అటవీనిర్మూలన పర్యావరణానికి నష్టాన్ని కలిగించింది. పట్టణానికి నీటిని సరఫరా చేసే శాశ్వత నీటి బుగ్గలను ప్రభావితం చేసింది. ఆ సమయంలో సంవత్సరాలుగా డార్జిలింగ్ జనాభా విస్తృతంగా అభివృద్ధి చెందింది. క్రమబద్ధీకరించని నిర్మాణాలు, ట్రాఫిక్ రద్దీ, నీటి కొరత సర్వసాధారణమయ్యాయి. చాలామంది స్థానిక యువకులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. వారి నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాలు లేకపోవడంతో వారు వలస వెళ్ళవలసి వచ్చింది. ఈశాన్య భారతదేశం ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వారిలాగే, వారు కొన్ని భారతీయ నగరాల్లో వివక్ష, జాత్యహంకారానికి గురయ్యారు.

డార్జిలింగ్ సంస్కృతి అత్యంత విశ్వజనీనమైంది. విభిన్న జాతులు తమ చారిత్రక మూలాల నుండి దూరంగా కలిసిపోయి అభివృద్ధి చెందాయి.ఆ ప్రాంత దేశీయవంటకాలలో పులియబెట్టిన ఆహారాలు, పానీయాలు పుష్కలంగా ఉన్నాయి. 19వ శతాబ్దం మధ్యకాలం నుంచి డార్జిలింగ్‌కు పర్యాటకులు తరలి వచ్చారు.1999లో దాని మద్దతు కోసం అంతర్జాతీయ ప్రచారం తర్వాత, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. 2005లో డార్జిలింగ్ తేనీరుకు బ్రాండ్ రక్షణ కోసం, దానిని ఉత్పత్తి చేసే ప్రాంత అభివృద్ధి కోసం ప్రపంచ వాణిజ్య సంస్థ భౌగోళిక సూచనను అందించింది.

చరిత్ర[మార్చు]

డార్జిలింగ్ తూర్పు హిమాలయాల్లో మేచి,తీస్తా నదుల మధ్య ఉంది.18వ శతాబ్దంలో ఇది అనేక దక్షిణాసియా రాష్ట్రాల్లో ఆశయాలు, అభద్రతలను ప్రేరేపించిన సరిహద్దు ప్రాంతంలో భాగంగా ఉంది.[15]శతాబ్దంలో ఎక్కువభాగం, సిక్కిం ఉత్తర రాజ్యం చోగ్యాల్ -పాలకుడు ఈ భూభాగాన్నిస్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాడు.[15] చివరి దశాబ్దాలలో, డార్జిలింగ్‌ను దాని భూభాగంలోకి తీసుకురావడానికి నేపాల్ గూర్ఖా రాజ్యం తూర్పు వైపు విస్తరించింది. [15] దాని సైన్యం తీస్తానది సమీపంలో ఆగిపోయింది. ఆ సమయంలో భూటాన్ రాజ్యం ఉంది. [15] [16] 19వ శతాబ్దం ప్రారంభంలో ఆంగ్లేయ ఈస్టిండియా కంపెనీ డార్జిలింగ్ కొండలపై ఆసక్తి చూపడం ప్రారంభించింది.[17] ఆ సమయంలో డార్జిలింగ్ స్థానిక జనాభాలో ఎక్కువగా లెప్చా, లింబు ప్రజలు ఉన్నారు.[1] ఆంగ్లో-నేపాలీ యుద్ధంలో గుర్ఖాలపై సైన్యం సాధించిన విజయం తర్వాత ప్రాదేశిక విషయాలలోబ్రిటీష్ కంపెనీ జోక్యం ప్రారంభమైంది. 1814-1816 మధ్య జరిగిన యుద్ధాల తరువాత, సుగౌలీ ఒప్పందం, టిటాలియా ఒప్పందం అనే రెండు ఒప్పందాలతో యుద్దం ముగిసింది. దీనిప్రకారం నేపాల్ డార్జిలింగ్ భూభాగాన్ని సిక్కింకు తిరిగి ఇవ్వవలసి వచ్చింది.[15] 1829లో ఇద్దరు ఈస్ట్ ఇండియాకంపెనీ అధికారులు కెప్టెన్ జార్జ్ లాయిడ్, జెడబ్యు గ్రాంట్, నేపాల్, సిక్కిం మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే మార్గంలో, అర్ధచంద్రాకారపు పర్వత శిఖరాన్ని దాటారు. వారు బ్రిటిష్ వారికోసం భారతదేశ మైదానాల వేడి నుండి కోలుకోవడం కోసం ఆశ్రయం పొందటానికి శానిటోరియం లేదా రిసార్ట్ కోసం అద్భుతంగా ఆ ప్రాంతం అనువైందని భావించారు.[15] [18] [19] లాయిడ్ తన అభిప్రాయాన్ని తెలియజేసిన తరువాత, భారత గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్, అతని అభిప్రాయంతో ఏకీభవించాడు. కొద్దిపాటి సరిహద్దు ఉనికిని పర్యవేక్షించడానికి అదనపు సైన్యం కోసం సిఫార్సుచేశాడు. [1]

1835–1857 ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన[మార్చు]

ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ, 1835లో ఈస్ట్ ఇండియా కంపెనీ చోగ్యాల్ నుండి మంజారు దస్తావేజు పద్దతిలో 40 బై 10 కిలోమీటర్ల (24 మీ × 6 మై) భూమిని లీజుకు తీసుకుంది.1838 చివరి నాటికి, ఆర్మీ నుండి సాపర్లు అడవులను నిర్మూలించి, రుతుపవనాల వర్షాల తర్వాత నిర్మాణాలు తీవ్రంగా నిర్మించటానికి ప్రణాళికు రూపుదిద్దారు. మరుసటి సంవత్సరం, ఆర్చిబాల్డ్ కాంప్‌బెల్ అనే వైద్యుడును డార్జిలింగ్‌లో "సూపరింటెండెంట్" గానియమించారు. రెండు ప్రభుత్వభవనాలు, ఒక హోటల్ భవనం, ఒక న్యాయస్థానం భవనం నిర్మించారు. వాటితరువాత బ్రిటీష్ వారి అభిరుచులకు అనుగుణంగా వారి విశ్రాంతి భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

డార్జిలింగ్‌ను ఒక విశ్రాంత విహారప్రాంతంగా మార్చడానికి చెల్లాచెదురుగా ఉన్న స్థానిక జనాభా కంటే ఎక్కువ మంది కార్మికులు అవసరం అని బ్రిటీష్ వారు గుర్తించారు. [1] [3] అందులో భాగంగా బ్రిటీష్ వారు పొరుగురాజ్యాల నుండి ప్రధానంగా నేపాల్, సిక్కిం, భూటాన్ నుండి కార్మికులను ఆకర్షించారు. వారు ఆ సమయంలో ఆ రాజ్యాలలో అసాధారణమైన, భారమైన పన్ను, బలవంతపు కార్మిక నియమాలకు భిన్నంగా, సాధారణ వేతనాలు, బసలను అందించడం ద్వారా, వారు డార్జిలింగ్‌ను ప్రాంతానికి రావటానికి మొగ్గు చూపారు. [3] పదివేలమంది వలస కార్మికులు డార్జిలింగ్ చేరుకున్నారు. [1] [3] ఉత్తర బెంగాల్‌లో డార్జిలింగ్ హిల్ కార్ట్ రోడ్ నిర్మించబడిన చాలాకాలం తర్వాత, హిమాలయ పర్వతాల దిగువన ఉన్న సిలిగురిని డార్జిలింగ్‌కు అనుసంధానం ఏర్పడింది.[20]

1833లో ఈస్టిండియాకంపెనీ చైనాతో తేయాకు వ్యాపారంలో గుత్తాధిపత్యాన్ని కోల్పోయింది. [21] భారతదేశంలో తేయాకుతోటలు పెంచడానికి ఒకప్రణాళిక సిద్ధం చేసుకుంది. [21] 1840లో డార్జిలింగ్‌లో సూపరింటెండెంట్ కాంప్‌బెల్ ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. అది త్వరలోవిజయవంతమైంది.[21]యూరోపియన్ నుండి తోటల పెంపకందార్లు, గుత్తేదార్లు చుట్టుపక్కల ఉన్న కొండప్రాంతాలలో పెద్ద విస్తీర్ణాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని తేయాకు తోటలుగా మార్చారు.[22] కొండల్లో ఉన్న కాలిబాటలు, మార్గాలు అభివృద్ధి చెంది రహదార్లుగా పేర్లు మార్చబడ్డాయి .అవి అన్నీ హిల్ కార్ట్ రోడ్‌కి అనుసంధానించబడ్డాయి. 1840వ దశకంలోడార్జిలింగ్‌ని సందర్శించిన వృక్షశాస్త్రజ్ఞుడు జోసెఫ్ డాల్టన్ హుకర్, ఈ రోడ్లపై బండ్లు, జంతువులు ద్వారా నేపాల్ నుండి పండ్లు, ఇతర ఉత్పత్తులను, టిబెట్ నుండి ఉన్ని, ఉప్పును తెస్తున్నాయని, కార్మికులు దాదాపు ప్రతిచోట నుండి పనికోసం వెతుకుతున్నారని పేర్కొన్నాడు.[23]

కార్మికుల వలసలు పెరుగుతున్నకారణఁగా ఈస్టిండియా కంపెనీ, పొరుగున ఉన్న హిమాలయ రాజ్యాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించాయి. 1849 నాటికి శత్రుత్వం ఒక కొలిక్కి వచ్చింది. క్యాంప్‌బెల్, హుకర్‌లను అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇద్దరినీ హాని లేకుండా విడుదల చేసినప్పటికీ, బ్రిటీష్ వారు సిక్కిం నుండి మెచి, తీస్తా నదుల మధ్య దాదాపు 1,700 చదరపు కిలోమీటర్ల (640 చదరపు మైళ్ళు) భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ సంఘటనను ఉపయోగించుకున్నారు.

డార్జిలింగ్ 1850లో పురపాలక సంఘంగా మారింది [5] 15 సంవత్సరాల వ్యవధిలో, ఈ హిమాలయ ప్రాంతం హిల్ స్టేషన్‌గా మారింది. ఇది భారతదేశం లోని కొండ, సమశీతోష్ణ, ప్రాంతంలో బ్రిటిష్ నిర్వాహకులకు అధికారిక విశ్రాంతి నివాస ప్రాంతంగా మారింది. సిమ్లా (బ్రిటీష్ ఇండియన్ సామ్రాజ్య వేసవి రాజధాని), ఊటీ (మద్రాసు ప్రెసిడెన్సీ వేసవి రాజధాని), నైనిటాల్ (వాయువ్య ప్రావిన్సుల వేసవి రాజధాని) వంటి హిల్ స్టేషన్లు అన్నీ 1819, 1840ల మధ్య స్థాపించబడ్డాయి. ఈస్టిండియా కంపెనీ పాలన భారత ఉపఖండంలోని ఎక్కువ భాగానికి విస్తరించినకాలం, బ్రిటిష్ వారు వాటిని స్థాపించటానికి పక్కా ప్రణాళిక అమలుచేయడంలోనమ్మకంతో చేసారు.[6] [24][25] డార్జిలింగ్ తర్వాత బెంగాల్ ప్రెసిడెన్సీకి వేసవి రాజధానిగామారింది.[7]

1858–1947: బ్రిటిష్ రాజ్[మార్చు]

1850 నుండి 1870 వరకు డార్జిలింగ్‌లోని తేయాకు పరిశ్రమ దాదాపు 8,000 మంది కార్మికులతో 56 తేయాకు తోటలకు పెరిగింది.[26] భద్రతా దళాలు తేయాకు తోటల కార్మికులపై నిశితంగా నిఘా ఉంచాయి. అవసరమైన త్రీవఉత్పత్తిని సాధించటానికి అవసరమైనప్పుడు వారిపై నిఘాను బలవంతంగాఉపయోగించాయి. కార్మికుల అసమాన సాంస్కృతిక జాతి నేపథ్యాలు, తేయాకు తోటల సాధారణంగా మారుమూల ప్రాంతాలు కార్మికుల సమీకరణ లేకపోవడాన్ని నిర్ధారించాయి.[27]20వ శతాబ్దం ప్రారంభంలో 100 తేయాకు తోటలు లక్ష్యంతో 64,000 మంది కార్మికులను నియమించింది.[26] డార్జిలింగ్ తేయాకు తోటలపై ఐదు మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టారు. [27] తేయాకు పరిశ్రమ వలన సంభవించిన విస్తృతమైన అటవీ నిర్మూలనప్రాంతం అటవీనివాసుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. దానితో వారు ఇతర అడవులకు మకాం మార్చటం, కొత్త వలస వృత్తులలో వారిపూర్వనివాసాలలోఉపాధి పొందవలసివచ్చింది. [28] నియమించిన అటవీ నివాసుల మిశ్రమంలో, హిమాలయాల నుండి ఎక్కువమంది కార్మికులు చేరారు.[22]వారు నేపాలీ భాషలో పరస్పరం సంభాషించుకునేవారు.[22]తరువాత భాష వారి ఆచారాలు, సంప్రదాయాలు డార్జిలింగ్ ప్రాంతంలో విలక్షణమైన జాతిని సృష్టించాయి. వారిని భారతీయ గూర్ఖాలు అని పిలిచారు. [22]

19వ శతాబ్దపు చివరి దశాబ్దాల నాటికి, బ్రిటిష్ రాజ్ ప్రావిన్షియల్ అత్యున్నతాధికారం కలిగిన ప్రభుత్వ పరిపాలనా అధికారులు వేసవి కాలంలో పెద్ద సంఖ్యలో హిల్ స్టేషన్‌లకు వెళ్లడం ప్రారంభించారు.[29]మైదానాలతో వాణిజ్యం వలె, హిల్ స్టేషన్లలో వాణిజ్యం బాగా పెరిగింది. [29]1872లో డార్జిలింగ్‌కు రైలు సర్వీస్ ప్రకటించబడింది.1878 నాటికి రైళ్లు బ్రిటీష్ ఇండియన్ సామ్రాజ్యం రాజధాని కలకత్తా నుండి వేసవి నివాసితులను [30] డార్జిలింగ్ కొండల దిగువన ఉన్న సిలిగురికి తీసుకెళ్లాయి. ఆ తర్వాత, హిల్ కార్ట్ రోడ్‌లోని చివరి భాగం, దాదాపు 1,900-metre (6,300 ft), ప్రయాణం చేయడానికి టోంగా గుర్రపు బండ్లు అవసరం ఏర్పడింది.[29] ప్రయాణానికి "ఆల్టింగ్ బ్యారక్స్" లేదా గుర్రాలకు ఆహారం ఇవ్వడం లేదా వాటిని మార్చడం కోసం లాయం వద్ద ఆగే అవసరం ఏర్పడేది.[31] 1880 నాటికి, హిల్ కార్ట్ రోడ్‌లో రైల్వే ట్రాక్‌లు సమలేఖనం చేయబడ్డాయి. [32] ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ జమాల్‌పూర్ లోకోమోటివ్ వర్క్‌షాప్ ఈ మార్గం కోసం ఆవిరి లోకోమోటివ్‌లను నిర్మించడం ప్రారంభించింది.[29] షార్ప్, స్టీవర్ట్, మాంచెస్టర్ కంపెనీలచే తయారు చేయబడిన సూక్ష్మ ఆవిరి యంత్రాలు, రైలును రెండు అడుగుల నారో గేజ్‌పై లాగడానికి ఉపయోగించబడ్డాయి.[29]1881 జులైలో డార్జిలింగ్‌కు మొదటిసారి రైలు సర్వీస్ ప్రారంభించబడింది [29] 2,300-metre (7,500 ft) వద్ద ఘూమ్ రైల్వే స్టేషన్‌లో శిఖరం ఎక్కిన తర్వాత సముద్ర మట్టానికి పైన, రైలు డార్జిలింగ్‌కు చేరింది.[29] ఇప్పుడు కలకత్తా నుండి ఒక రోజు ప్రయాణంలో డార్జిలింగ్ నగరానికి చేరుకోవచ్చు.[29]

డార్జిలింగ్‌లోని సెయింట్ జోసెఫ్ కళాశాల చతుర్భుజం, ఇప్పుడు సెయింట్ జోసెఫ్ స్కూల్ లేదా నార్త్ పాయింట్, 1888లో స్థాపించబడింది

1947లో భారతదేశ విభజన తర్వాత, డార్జిలింగ్ భారతదేశ డొమినియన్‌లోని పశ్చిమ బెంగాల్ కొత్త ప్రావిన్స్‌లో, 1950లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భాగంగా మారింది. [lower-alpha 7] [33] డార్జిలింగ్ నుండి బ్రిటీష్ వారు త్వరగా విడిచివెళ్లారు.[27] మైదాన ప్రాంతాల నుండి వారి నివాస గృహాలను భారతీయ ఉన్నత వర్గాలవారు త్వరగా కొనుగోలు చేశారు. వారు పట్టణంలోని అనేక పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించారు. ఈ చర్యలు భారతీయ గూర్ఖా జనాభాతో సామాజిక, ఆర్థిక ఉద్రిక్తతలను సృష్టించాయి. తరువాతి వారిని మరింత దూరం చేసింది.[27] బ్రిటీష్ వారు ఏర్పాటు చేసిన క్రమానుగత ఆర్థిక వ్యవస్థవల్ల ఏర్పడిన ఆర్థిక అభివృద్ధి లేకపోవడం, 1947 తర్వాత కొన్ని దశాబ్దాలలో కొన్ని అంశాలలో కొనసాగింది [34] ఉద్భవించిన భారతీయ జాతీయవాదం భారతీయ నేపాలీల అస్పష్టమైన స్థితిని ఎత్తిచూపినట్లు అనిపించింది. కొత్తగా స్వతంత్ర దేశంలో. [34] భారతదేశం వివిధ మాట్లాడే భాషల ప్రాంతాలను కలిగిఉన్న రాష్ట్రాలుగా విభజించడం వలన ఈ భాషలను మాట్లాడే విద్యావంతులలో సాపేక్షంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలలో ఉపాధి పొందేందుకు వీలు కల్పించింది. గూర్ఖాల విషయంలో, సమాఖ్య, రాష్ట్ర ప్రభుత్వాలు బెంగాల్ ఉత్తర ప్రాంతాలలో తమ స్వంత నేపాలీ మాట్లాడే రాష్ట్రంకోసం చేసిన అభ్యర్థనలను నిరాకరించాయి.[34] చివరికి, బెంగాల్‌లోని నేపాలీ-మాట్లాడే ప్రాంతాలలో అధికారిక రాష్ట్రం కోసం నేపాలీభాష గుర్తింపు కోసం స్వయంప్రతిపత్తి వత్తిడిలు తగ్గాయి. [35]దీనిని పశ్చిమ బెంగాల్ అధికార భాషా చట్టం, 1961 లో ఆమోదించబడింది.[36]

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారతీయ దశాబ్ది జనాభా గణన ప్రకారం డార్జిలింగ్ పురపాలక సంఘ జనాభా 1,18,805 మంది వ్యక్తులుగా నమోదు చేయబడింది. వీరిలో 59,618 మంది స్త్రీలు కాగా, 59,187 మంది పురుషులు ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 1007 మంది స్త్రీలు లింగ నిష్పత్తి ఉంది.[4] పురపాలక సంఘ జనాభా సాంద్రత కిమీ 2 కి 15,990 వ్యక్తులు (చ. మైలుకు 41,000).[4] జనాభా మొత్తం అక్షరాస్యత రేటు 93.9% గా ఉంది.స్త్రీల అక్షరాస్యత రేటు 91.3%, పురుషులు 96.4% ఉంది.[4] భారత రాజ్యాంగం ద్వారా చారిత్రక ప్రతికూలతలు గుర్తించబడిన ప్రకారం డార్జిలింగ్ పట్టణంలోని షెడ్యూల్డ్ తెగలు జనాభాలో సుమారుగా 22.4%, షెడ్యూల్డ్ కులాలు 7.7% మంది జనాభా ఉన్నారు.[4] పనిలో పాల్గొనేవారి రేటు 34.4%. [4] మురికివాడలలో నివసించే వారి సంఖ్య 25,026 మంది వ్యక్తులు ఉన్నారు. (ఇది జనాభాలో 21.1%). [4]

డార్జిలింగ్ 1947లో డార్జిలింగ్ జిల్లాకు ప్రధాన కార్యాలయంగా మార్చబడిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో "పరిపాలన" పట్టణంగా ప్రారంభమైంది [11] 1961-2011 కాలంలో పట్టణ జనాభా వేగవంతమైన రేటుతో పెరిగింది. [11] పరిపాలనలో నిపుణుల కుటుంబాలు, చిల్లర వర్తకం, సేవా పరిశ్రమలు ఉన్నాయి. [11]

"ఇండియన్ గూర్ఖా "అనేది ఈశాన్య భారతదేశంలోని నేపాలీ-మాట్లాడే ప్రజలను సూచించే పదం. ఇది నేపాల్‌లోని నేపాలీ-మాట్లాడే నివాసుల నుండి భిన్నంగా ఉంటుంది.[37] 2016 నాటికి, డార్జిలింగ్ జనాభా ప్రధానంగా భారతీయ గూర్ఖా జనాభా, తక్కువ సంఖ్యలో లెప్చాలు, భూటియాలు, టిబెటన్లు, బెంగాలీలు, మార్వాడీలు, బీహారీలు ఉన్నారు.[38]

2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో హిందూమతం (66.5%), బౌద్ధమతం (23.9%), క్రైస్తవం (5.1%), ఇస్లాం (3.9%)లను ఆచరించే జనాభా ఉన్నారు.[4] లెప్చాలు ఈ ప్రాంతంలోని ప్రధాన స్థానిక సమాజంగా పరిగణించబడ్డారు. వారి అసలు మతం యానిమిజం యొక్క ఒక రూపం.[38] నేపాలీ జన సమూహం అనేక కులాలు జాతి సమూహాల సంక్లిష్ట మిశ్రమం. వీరిలో గిరిజన జీవాత్మ సంప్రదాయాలతో అనేక మూలాలు ఉన్నాయి.[38] పట్టణ జనాభా వేగవంతమైన పెరుగుదల, విభిన్న జాతులు కలసికట్టుగా ఉండే జీవన పరిస్థితులు డార్జిలింగ్‌లో వారి చారిత్రక మూలాలకు దూరంగా పరిణామం చెందిన సమకాలిక సంస్కృతులను సృష్టించాయి. [38]

2014 అధ్యయనం ప్రకారం, డార్జిలింగ్ చుట్టుపక్కల ఉన్నతేయాకు తోటలలో కార్మికుల అవసర వత్తిడి 1910 నుండి దాదాపు స్థిరంగా ఉన్నప్పటికీ, టీ తోటలలో నేపాలీ మాట్లాడే కార్మికులు, వారి కుటుంబాల జనాభా ప్రాంతం అంతటా పెరిగింది.[39] అదనపు జనాభాకు ఉద్యోగాలు, గృహాల వెతుకులాటలో డార్జిలింగ్‌కు వలసవెళ్లడంతో, 1980లలో గూర్ఖాలాండ్ ఉద్యమం ద్వారా వారి కారణం సమర్థించబడింది. ఇది గణనీయమైన సంఖ్యలో గూర్ఖాయేతర కుటుంబాలు డార్జిలింగ్‌లో తమ ఇళ్లను వదిలి వెళ్ళేలా చేసింది. [39]

సెంచల్ సరస్సు[మార్చు]

ఇది డార్జిలింగ్‌కు ఆగ్నేయంగా 10 కి.మీ దూరంలో ఉంది. ఇది భారతదేశంలోని డార్జిలింగ్ నగరానికి ప్రధాన తాగునీటి వనరు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 Shneiderman & Middleton 2018, p. 6.
  2. Dasgupta 1999, pp. 47–48.
  3. 3.0 3.1 3.2 3.3 Middleton 2021, pp. 85–86.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 Mondal & Roychowdhury 2018, p. 368.
  5. 5.0 5.1 Lamb 1986, p. 71.
  6. 6.0 6.1 Bhattacharya 2022, pp. 319–320.
  7. 7.0 7.1 Bhattacharya 2022, pp. 325–326.
  8. 8.0 8.1 Chhetri & Lepcha 2021, p. 319.
  9. 9.0 9.1 Rahamtulla, Roy & Khasim 2020, p. 157.
  10. Mandal, Dilip (13 May 2022). "Decade without data – Why India is delaying Census when US, UK, China went ahead during Covid". The Print. Archived from the original on 15 August 2022. Retrieved 30 July 2022. In all likelihood, India will not have its decadal census any time soon. The logjam is such that it may lead to a situation where a whole decade goes by without any official data on India and Indians. 2021 was a Census year and the Narendra Modi government decided not to conduct it due to the Covid pandemic. Now, Home Minister Amit Shah has said that the next Census will be an e-survey and carried out by 2024—it will be India's first 'digital Census'.
  11. 11.0 11.1 11.2 11.3 Mondal & Roychowdhury 2018, p. 367.
  12. "Report of the Commissioner for Linguistic Minorities in India: 50th report (delivered to the Lokh Sabha in 2014)" (PDF). National Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. p. 95. Archived from the original (PDF) on 8 July 2016. Retrieved 13 July 2015.
  13. Spate & Learmonth 2017, p. 476.
  14. Bernbaum 2022, p. 32.
  15. 15.0 15.1 15.2 15.3 15.4 15.5 Shneiderman & Middleton 2018, p. 5.
  16. Dozey, E. C. (1922). A Concise History of the Darjeeling District Since 1835, with a complete itinerary of tours in Sikkim and the District. N. Mukherjee. OCLC 62351881.
  17. Dasgupta 1999, p. 47.
  18. Dasgupta 1999, p. 50.
  19. Lamb 1986, p. 69.
  20. Bhattacharya 2022, p. 287.
  21. 21.0 21.1 21.2 Pradhan 2017, pp. 118–119.
  22. 22.0 22.1 22.2 22.3 Shneiderman & Middleton 2018, p. 8.
  23. Sharma, Jayeeta (2018). "Himalayan Darjeeling and Mountain Histories of Labour and Mobility". In Middleton, Townsend; Shneiderman, Sara (eds.). Darjeeling Reconsidered: Histories, Politics, Environments. Oxford University Press. pp. 80–81. ISBN 978-0-19-948355-6.
  24. Gilmour, David (2006). The Ruling Caste: Imperial Lives in the Victorian Raj. Farrar, Straus and Giroux. p. 223. ISBN 978-0-374-28354-4. LCCN 2005044679.
  25. Philip, Kavita (2004). Civilizing Natures: Race, Resources, and Modernity in Colonial South India. Rutgers University Press. p. 29. ISBN 0-8135-3360-0.
  26. 26.0 26.1 Middleton & Shneiderman 2018, p. 8.
  27. 27.0 27.1 27.2 27.3 Zivkovic 2014, p. 9.
  28. Pradhan 2017, p. 125.
  29. 29.0 29.1 29.2 29.3 29.4 29.5 29.6 29.7 Pradhan 2017, pp. 145–146.
  30. "Calcutta (Kalikata)". The Imperial Gazetteer of India. Vol. IX Bomjur to Central India. Published under the Authority of His Majesty's Secretary of State for India in Council, Oxford at the Clarendon Press. 1908. p. 260. Archived from the original on 24 May 2022. Retrieved 9 June 2022. Capital of the Indian Empire, situated in 22° 34' N and 88° 22' E, on the east or left bank of the Hooghly river, within the Twenty-four Parganas District, Bengal
  31. Bengal, Presidency (1868). Annual Report on the Administration of the Bengal Presidency for 1867–68. Bengal Secretariat Press. p. 125. Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022. Material has been collected for two halting Barracks in the Darjeeling hill cart road near Sonadah, the site for which has been cleared.
  32. Roy & Hannam 2013, p. 584.
  33. Steinberg, S. H., ed. (1949). "India". The Statesman's Year-Book: Statistical and Historical Annual of the States of the World for the Year 1949. Macmillan and Co. p. 122. ISBN 978-0-230-27078-7. Archived from the original on 29 September 2021. Retrieved 20 June 2022.
  34. 34.0 34.1 34.2 Scrase, Ganguly-Scrase & Deuchar 2016, pp. 103–104.
  35. Dasgupta 1999, p. 61.
  36. Sen, Jahar (1989). "Appendix 5: The West Bengal Official Language Act, 1961". Darjeeling: A Favoured Retreat. Indus Publishing Company. pp. 107–108. ISBN 81-85182-15-9.
  37. Middleton & Shneiderman 2018, pp. 158–159: "Early Nepali literary stalwarts like Parasmani Pradhan used both the terms Nepali and Gorkha interchangeably... Thus early associations of the Nepalis in India... used the word "Gorkha" to denote Nepalis of Indian origin".
  38. 38.0 38.1 38.2 38.3 Lama & Rai 2016, p. 90.
  39. 39.0 39.1 Besky 2014, p. 84.

గమనికలు[మార్చు]

  1. "In year 2001, the area of Darjeeling Municipality was 10.75 square kilometres (4.15 sq mi) but after the reorganization and bifurcation of wards in 2011, the town now covers an area of 7.43 square kilometres (2.87 sq mi) only."[8]
  2. "The average altitude of Darjeeling Town is 6710 ft (about 2045 m.) However, the highest point in the Darjeeling district is Sandakphu (close to 12,000 ft) which also happens to be the highest altitude point in the whole of West Bengal."[9]
  3. India did not have a decadal census in 2021 because of COVID-19; the next one is a digital census planned for 2024.[10]
  4. "Population of the town experienced a rapid growth in the last fifty years, and Census of India (2011b) estimated the total population of the town is 118,805 persons (Tables 21.1 and 21.2)."[11]
  5. "The density of population in Darjeeling town is 15,990 persons per sq.km as per 2011 census report."[8]
  6. "mist-enshrouded for half the year, on clear days the skyline is climaxed by the magnificent peak of Kangchenjunga".[13]
  7. East Bengal, now Bangladesh, which lies to the south of Darjeeling and extends southwards to the Bay of Bengal, was awarded to Pakistan.

వెలుపలి లంకెలు[మార్చు]