జె. వి. రమణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 84: | పంక్తి 84: | ||
* [[ఆర్య]] (2004) |
* [[ఆర్య]] (2004) |
||
==మరణం== |
==మరణం== |
||
వీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ [[2016]], [[జూన్ 22]]వ తేదీన [[విజయనగరం]]లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.<ref>[http://epaper.sakshi.com/849688/Hyderabad-Main/23-06-2016#page/2/2 జె.వి.రమణమూర్తి కన్నుమూత]</ref> |
|||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
00:25, 23 జూన్ 2016 నాటి కూర్పు
జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి | |
---|---|
జననం | జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి మే 20, 1933 విజయ నగరం జిల్లా |
మరణం | జూన్ 22, 2016 విజయనగరం |
మరణ కారణం | క్యాన్సర్ |
వృత్తి | తెలుగు సినిమా నటుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కన్యాశుల్కం లో పాత్ర |
జె. వి. రమణమూర్తి గా ప్రసిద్ధులైన జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి సుప్రసిద్ధ రంగస్థల మరియు సినిమా నటుడు. వీరు జె.వి.సోమయాజులు తమ్ముడు. యితడు విజయనగరం జిల్లా లో మే 20, 1933 లో జన్మించారు. తన పాఠశాల జీవితం నుంచే నటనా ప్రస్థానం ప్రారంభించారు. ఇంటర్ యూనివర్శిటీ పోటీలలో ఆత్రేయ యొక్క "విశ్వశాంతి" అవార్డును పొందారు. "ఎవరు దొంగ", "కప్పలు" , "కీర్తిశేషులు", "కాళరాత్రి", "ఫాణి" మరియు "కాటమరాజు కథ" వంటి నాటకాలలో నటించారు. తనకు గుర్తింపు తెచ్చిన పాత్ర గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం లో గిరీశం. చలన చిత్ర పరిశ్రమలో ఎం.ఎల్.ఏ. (1957) సినిమాతో నటనా ప్రస్థానం ప్రారంభించి 150 చిత్రాల వరకు నటించారు.
నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కరాలను అందజేస్తుంది. నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషకం తో ఘనంగా సత్కరిస్తున్నారు. 2015 సంవత్సరానికి గాను జె. వి. రమణమూర్తి (సాంఘిక నాటకం) గారికి అందజేశారు. 2016 జనవరి 27న ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరిగింది[1].
చిత్ర సమాహారం
1950వ దశాబ్దం
- ఎం.ఎల్.ఏ. (1957)
- అత్తా ఒకింటి కోడలే (1958)
- మంచి మనసుకు మంచి రోజులు (1958)
- పెళ్ళి మీద పెళ్ళి (1959)
- శభాష్ రాముడు (1959)
1960వ దశాబ్దం
- బావామరదళ్లు (1960)
- బాటసారి (1961) - మాధవి అన్నయ్య
1970వ దశాబ్దం
- అమాయకురాలు (1971)
- కటకటాల రుద్రయ్య (1978)
- దొంగల దోపిడి (1978)
- మరో చరిత్ర (1978)
- సిరి సిరి మువ్వ (1978)
- ఇది కథ కాదు (1979)
- గుప్పెడు మనసు (1979)
- గోరింటాకు (1979)
1980వ దశాబ్దం
- మొగుడు కావాలి (1980)
- శుభోదయం (1980)
- సప్తపది (1980)
- అమృతకలశం (1981)
- ఆకలి రాజ్యం (1981)
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- శుభలేఖ (1982) - జగన్నాథం
- ఆనంద భైరవి (1984)
- కాంచనగంగ (1984)
- డేంజర్ లైట్ (1985)
- శ్రీ దత్త దర్శనం (1985)
- సిరివెన్నెల (1986)
- నాకు పెళ్ళాం కావాలి (1987)
1990వ దశాబ్దం
- ఏడు కొండలస్వామి (1991)
- కర్తవ్యం (1991) - ప్రిన్సిపాల్ రామకృష్ణ
- కొబ్బరి బొండాం (1991)
2000వ దశాబ్దం
- ఆర్య (2004)
మరణం
వీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2016, జూన్ 22వ తేదీన విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.[2]
బయటి లింకులు
- ↑ http://www.andhrajyothy.com/Pages/PhotoAlbum?GllryID=19522 తిరుపతిలో నంది నాటకోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
- ↑ జె.వి.రమణమూర్తి కన్నుమూత