పద్మాసనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మాసనం.

పద్మాసనము (సంస్కృతం: पद्मसन) యోగాలో ఒక విధమైన ఆసనము. రెండు రేకులుగల పద్మాన్ని పోలి ఉండటం వల్ల దీనికి పద్మాసనమని పేరువచ్చింది.పద్మాసనము వేయలేనివారు, అర్ధ పద్మాసనం వేసుకొనవచ్చును.

పద్ధతి[మార్చు]

  • మొదట రెండు కాళ్ళు చాపి నేలపై ఉంచాలి.
  • తరువాత ఎడమ కాలును కుడి తొడపై, కుడి కాలును ఎడమ తొడపై ఉంచాలి.
  • రెండు చేతులను మోకాళ్ళపై ఉంచాలి. చూపుడు వేలును బొటన వేలుకి నడుమ ఆనించి మిగతా మూడు వేళ్ళను ముందుకు చాపి ఉంచితే చిన్ముద్ర అవుతుంది.
  • ఈ ఆసనంలో ఉన్నప్పుడు భ్రూమధ్య దృష్టిగాని, నాసాగ్ర దృష్టి గాని ఉండాలి.
  • ధ్యానంలో ఉన్నప్పుడు హృదయస్థానంలో మనస్సును ఏకాగ్రం చేయవచ్చు.

ఉపయోగాలు[మార్చు]

పద్మాసనము ప్రాణాయామం, ధ్యానం చేయుటకు చాలా ఉపయోగకరమైనది. కుండలినీ శక్తిని జాగృతము చేసి పైకిలేపడానికి ఈ ఆసనం తోర్పడుతుంది[1]. శారీరక ఫలితాలు:

  • తొడబాగములోని అనవసర కొవ్వు కరుగుతుంది.
  • వెన్నెముక బలపడుతుంది.
  • శ్వాస సంబంధిత వ్యాధులు క్రమక్రమముగా నిదానిస్తాయి.

మానసిక ఫలితాలు: ద్యానానికి ఇది అనుకూలమైన ఆసనం. ఏకాగ్రత కుదురుతుంది. బుద్ధి తీక్షణత పెరుగుతుంది. ఆయుః ప్రమాణము పెరుగుతుంది.

మూలాలు[మార్చు]

  1. "పద్మాసనము వలన కలిగే ఫలితాలు ఇవే..!! - Dharuvu.com". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-02.
"https://te.wikipedia.org/w/index.php?title=పద్మాసనం&oldid=4102176" నుండి వెలికితీశారు