Jump to content

పి. చంద్రారెడ్డి

వికీపీడియా నుండి
పి. చంద్రారెడ్డి
P. Chandra Reddy

పదవీ కాలం
1958  1964
ముందు కోకా సుబ్బారావు
తరువాత పి. సత్యనారాయణ రాజు

పదవీ కాలం
1964  1966

వ్యక్తిగత వివరాలు

జననం (1904-07-01)1904 జూలై 1
మరణం 1976 అక్టోబరు 7

జస్టిస్ పి. చంద్రారెడ్డి లేదా పలగాని చంద్రారెడ్డి (జూలై 1, 1904 - అక్టోబర్ 7, 1976) హైకోర్టు న్యాయమూర్తి. నెల్లూరులోని వి.ఆర్. ఉన్నత పాఠశాలలో చదివి తర్వాత మద్రాసులోని పచ్చియప్ప కళాశాలలో ఉన్నత విద్యనభ్యసించారు.

1928 ఆగస్టు 13 తేదీన మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టాడు. సివిల్, క్రిమినల్ కేసులు రెంటినీ వాదించేవాడు. 1949 జూలై 16 అదే కోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. తరువాత ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమించబడి, తదనంతరం ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు.

చంద్రారెడ్డి ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఆపద్ధర్మ గవర్నరుగా కొద్దికాలం పనిచేశాడు. 1964 డిసెంబరు 23 తేదీన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. 1966 జనవరి 7 తేదీన పదవీ విరమణ చేశారు.

చంద్రారెడ్డి అక్టోబర్ 7 1976 తేదీన పరమపదించాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. HON'BLE SRI JUSTICE P.CHANDRA REDDI Archived 2008-09-30 at the Wayback Machine (High Court of Andhra Pradesh, Hyderabad, 20 September 2008)
  2. Sixth Assembly First SessionFirst Meeting Archived 2011-07-16 at the Wayback Machine (Tamil Nadu Legislative Assembly, 21 September 2008)
  3. Past Governors (Raj Bhavan, Chennai, 20 September 2008)