పొందూరు
పొందూరు | |
— మండలం — | |
శ్రీకాకుళం జిల్లా పటములో పొందూరు మండలం యొక్క స్థానము | |
ఆంధ్రప్రదేశ్ పటములో పొందూరు యొక్క స్థానము | |
అక్షాంశరేఖాంశాలు: 18°24′52″N 83°46′51″E / 18.414473°N 83.780937°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
మండల కేంద్రము | పొందూరు |
గ్రామాలు | 38 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 73,890 |
- పురుషులు | 37,197 |
- స్త్రీలు | 36,693 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.11% |
- పురుషులు | 66.81% |
- స్త్రీలు | 41.16% |
పిన్ కోడ్ | {{{pincode}}} |
పొందూరు (Ponduru), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము.[1] పొందూరు శ్రీకాకుళము నకు 20 కి.మీ దూరంలో ఉంది. ఖద్దరు, హస్తకళలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము. భారత దేశంలో ఖాదీ వస్త్ర ప్రియులకు యిష్టమైన ఖద్దరును తయారుచేసే ప్రాంతం పొందూరు.
పొందూరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వేలో హౌరా మరియు చెన్నయ్ మార్గంలో ఉంది. ఇచ్చట కంప్యూటరీకరణ కలిగిన ఉప తపాలా కార్యాలయం ఉంది. పొందూరు నకు 7 కి.మీ దూరంలో నందివాడలో బాలయోగీశ్వరస్వామి ఆశ్రమం ప్రసిద్ధి చెందింది.
విషయ సూచిక
పొందూరు ఖద్దరు[మార్చు]
పొందూరు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము. ఒకవిధమైన చేప దంతాలతో ప్రత్తిని శుభ్రం చేసి దానిని రాట్నాలను ఉపయోగించి దారాన్ని తీస్తారు. ఈ దారాలనుపయోగించి మగ్గాలపై ఖద్దరు బట్టలను నేస్తారు. పొందూరు ఖద్దరు అనునది భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని గుర్తు చేస్తుంది. మహాత్మా గాంధీ కూడా పొందూరుకు చెందిన ఖద్దరును యిష్టపడే వారు. పొందూరు ఖాదీ దేశమంతటా ఖాదీ బట్టలు వేసుకునే వారికి ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతంలో దేవాంగ, పట్టుశాలి, నాగవంశం అనే కులాలు ముఖ్యమైనవి. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేనేత. ప్రత్తిని శుభ్రం చేసి రాట్నాలతో దారాన్ని తీసి మగ్గాలపై చక్కని ఖద్దరు వస్త్రాలను నేస్తారు. మగ్గాల తోనేకాక యంత్రపరికరాలు, మరమగ్గాల ఆధారంగా ఖద్దరు ఇతర రకాల నేతలు నేయు నేతగాళ్ళు కలరు. అమెరికా, స్వీడన్ వంటి దేశాలకు ఎగుమతులు కూడా జరిగేవి.
ప్రముఖులు[మార్చు]
- వాండ్రంగి కృష్ణదాసు పొందూరు సమీప గ్రామమైన వాండ్రంగికి చెందినవారు. ఆయన సెప్టెంబరు 5 1996 న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును శంకర్ దయాళ్ శర్మ చేతులమీదుగా అందుకున్నారు.
- పమ్మిన కూర్మారావు 1988 లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందినారు.
- యెచ్చిన గోపాలరావు 2007 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను మరియు జాతీయస్థాయిలోను ఒకేసారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను పొందుట విశేషం. 2007 లో భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందినారు.
- పమ్మిన రమాదేవి 2015 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా సెప్టెంబరు 5 2015 న ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా సన్మానింవబడింది. ఆమె జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత అయిన యెచ్చినగోపాలరావు సతీమణి. ఈ గ్రామానికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత అయిన పి.కూర్మారావు యొక్క కుమార్తె. ఆమె పొందూరు మండలంలోని తండ్యాం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ విశేషమైన సేవలందించారు[2]. ఈమె జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి 2015 ను ఢిల్లీలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి సెప్టెంబరు 5, 2016 న అందుకున్నారు.[3]
- ఘండికోట బ్రహ్మాజీరావు
చిత్రమాలిక[మార్చు]
పొందూరు లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతలు[మార్చు]
ఉపరాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ ద్వారా అరార్డు స్వీకరిస్తున్న పమ్మిన కూర్మారావు
భారత రాష్ట్రపతి డా.శంకర్ దయాళ్ శర్మ ద్వారా అవార్డు స్వీకరిస్తున్న వి.కృష్ణదాసు
రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ద్వారా జాతీయ అవార్డు స్వీకరిస్తున్న గోపాలరావు
సెప్టెంబరు 5, 2016 న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద నుండి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని స్వీకరిస్తున్న పమ్మిన రమాదేవి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
జనాభా (2011) - మొత్తం 73,890 - పురుషులు 37,197 - స్త్రీలు 36,693
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Ponduru, Srikakulam. |