Coordinates: 19°07′N 84°42′E / 19.12°N 84.7°E / 19.12; 84.7

ఇచ్ఛాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇచ్ఛాపురం
ఇచ్ఛాపురం రైల్వే స్టేషను
ఇచ్ఛాపురం రైల్వే స్టేషను
ఇచ్ఛాపురం is located in Andhra Pradesh
ఇచ్ఛాపురం
ఇచ్ఛాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో ఇచ్ఛాపురం
Coordinates: 19°07′N 84°42′E / 19.12°N 84.7°E / 19.12; 84.7
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం
Government
 • Typeమున్సిపాలిటీ
 • Bodyఇచ్ఛాపురం మున్సిపాలిటీ, సుడా
 • శాసనసభ సభ్యుడుఅశోక్ బెందాళం
Area
 • Total27.28 km2 (10.53 sq mi)
Elevation15 మీ (49 అ.)
Population
 (2011)[3]
 • Total40,000
 • Density1,500/km2 (3,800/sq mi)
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+05:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
532 312
టెలిఫోన్ కోడ్+91–8947
వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుఏపి30 (గతంలో)
ఏపి39 (2019 జనవరి 30 నుండి)[4]
లోక్‌సభ నియోజకవర్గంశ్రీకాకుళం
శాసనసభ నియోజకవర్గంఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం మండలం లోని పురపాలిక పట్టణం.[5] ఇది అదే మండలానికి కేంద్రం. చెన్నై కోల్‌కతా జాతీయ రహదారిపై ఒడిషా వైపునుండి వచ్చేటపుడు ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురం. అంచేత ఇచ్ఛాపురం ఆంధ్రప్రదేశ్ కు ఈశాన్య ముఖద్వారంగా చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఇక్కడ ఉంది.

గణాంకాలు[మార్చు]

ఇచ్ఛాపురం శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం మండలానికి చెందిన మునిసిపాలిటీ నగరం. ఇచ్ఛాపురం పట్టణం 15 వార్డులుగా విభజించారు.దీనికి 5 సంవత్సరాలకు ఒకసారి పురపాలక ఎన్నికలు నిర్వహిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇచ్ఛాపురం పట్టణంలో మొత్తం 8,290 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇచ్ఛాపురం మొత్తం జనాభా 36,493 అందులో పురుషులు 17,716, స్త్రీలు 18,777 మంది ఉన్నారు.[6] ఇచ్ఛాపురం సగటు లింగ నిష్పత్తి 1,060గా ఉంది

ఇచ్ఛాపురం పట్టణ జనాభా మొత్తంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4004, ఇది మొత్తం జనాభాలో 11%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 2050 మంది మగ పిల్లలు ఉండగా, 1954 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 953, ఇది సగటు లింగ నిష్పత్తి (1,060) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 71.1%. దీనిని శ్రీకాకుళం జిల్లా 61.7% అక్షరాస్యత శాతంతో పోల్చగా ఎక్కువ ఉంది. ఇచ్ఛాపురంలో పురుషుల అక్షరాస్యత రేటు 81.27%, స్త్రీల అక్షరాస్యత రేటు 61.67%.

ఇచ్ఛాపురం పట్టణ పరిధిలో మొత్తం 8,290 ఇళ్లకు పైగా పరిపాలన ఉంది,వీటికి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను సంబంధిత స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది.మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్నులు విధించడానికి దీనికి అధికారం ఉంది.

సరుకు రవాణా వాహన తనికీ కేంద్రం[మార్చు]

ఉత్తరాంధ్రలోని జాతీయదారిలో వున్న చిట్టచివరి నగరం.ఇచ్చాపురం పురపాలక సంఘం పరిధిలో వున్న పురుషోత్త్రమపురం నుండి ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దు మొదలవుతుంది..పురుషోత్తమపురం ఇచ్చాపురానికి 3కిలో మీటర్ల దూరంలో వున్నప్పటికి, సరుకురవాణా వాహనాల వల్ల వచ్చు రాబడి దృష్ట్య, ఈ వూరును ఇచ్చాపురం పురపాలక సంఘంలో విలీనంచేసారు. పురుషోత్తమపురం వద్దనున్న రహదారి రవాణా సంస్ధ తనికీ కార్యాలయం ఉంది.ఇక్కడ ఒడిస్సాలోకివెళ్ళే, ఒడిస్సానుండి వచ్చే సరుకుల రవాణా వాహనాలను నిలిపి, రవాణా అనుమతి పత్రాలను పరిశీలించినపిమ్మట, వెళ్ళుటకు అనుమతి ఇస్తారు.ఈ ఆంధ్రప్రదేశ్ తనికీ కేంద్రానికి కిలోమీటరు దూరంలో, ఒడిస్సాలో గిరిసొల అను గ్రామంవద్ద ఒడిస్సా రాష్ట్రా సరుకుల వాహన తనికీ కార్యాలయం ఉంది.ఈ తనికీ కేంద్రాలవద్ద కొన్ని సమాయాలలో కొన్నిసార్లు 6-7 కిలోమీటర్లదూరం వరకు వాహనాలు నిలచివుంటాయి.

ప్రయాణికుల రవాణా సౌకర్యం[మార్చు]

ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నామ ఫలకం
బస్ స్టేషను
రైల్వే స్టేషను

ఇచ్చాపురములో ఆర్.టి.సి.వారి బస్ స్టేషను ఉంది.ఇక్కడినుండి రామచంద్రపురం, కాకినాడ, విశాఖ పట్టణం, రాజమండ్రిలకు ఎక్సుప్రెస్ బస్సు సౌకర్యం ఉంది.అలాగే ఒడిస్సాలోని బరంపురం వరకు బస్సులున్నాయి.ఇచ్చాపురం చుట్టుప్రక్కలగ్రామాలకు ప్యాసింజరు/అర్డినరి బస్సులున్నాయి.ఇవికాక బరంపురంనుండి ఇచ్చాపురంమీదుగా ఒడిస్సాలోని ఇతరగ్రామాలకు కూడా ప్రవేటు బస్సులున్నాయి.ఇచ్చాపురంలో రైల్వే ష్టేషను ఉంది.ఫలకనామా, విశాఖ, పూరి-తిరుపతి, మద్రాసు-హౌరా, కోణార్కు ఎక్సుప్రెసు, ఈస్టుకోస్టు ఎక్సుప్రెస్సు, ఇంటర్‍సిటి వంటి ఎక్సుప్రెస్సు రైల్లు, ప్యాసింజరు రైల్లు ఆగును.

వైద్యసౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్యశాల
  • పడకలున్న ప్రభుత్వవైద్యశాలవుంది.
  • రెండు ప్రవేట్ వైద్యశాలలున్నాయి. (ఒకటి త్రినాథ్ రెడ్ది ఆసుపత్రి)
  • మెరుగైన వైద్యసేవలకు 60కి.మీ.దూరంలో పలాస కు, 125 కి.మీ.దూరంలోవున్న శ్రీకాకుళం వెళ్ళాలి.లేదా బరంపురం వెళ్లాలి.

విద్య[మార్చు]

  • ప్రభుత్వ ఉన్నత పాఠశాల
  • నగరసంస్ధ ఉన్నతపాఠశాల
  • ప్రభుత్వజూనియరు కళాశాల
  • ప్రభుత్వడిగ్రి కాలేజి
  • జ్ఞానభారతి ఇంగ్లిషు మీడియం స్కూలు
  • శాంతినికేతన్ ఇంగ్లీసు మీడియం స్కూలు.
  • ఒరియా పాఠశాల
  • బోర్డుస్కూలు.

ప్రచార కేంద్రం[మార్చు]

  • దూరవాణి రిలే కేంద్రం ఉంది.
  • టెలిఫోన్ ఆఫిసు ఉంది.

ప్రార్ధనా మందిరాలు, దేవాలయాలు[మార్చు]

జగన్నాధ గుడి
  • నర్మదేశ్వరస్వామి ఆలయం
  • జగన్నాధస్వామి ఆలయం
  • స్వేచ్ఛావతి అమ్మవారిగుడి
  • మసిదు
  • శివాలయం,, దుర్గాదేవి గుడుల సముదాయం.

శుద్దికొండ త్రినాధస్వామి ఆలయం[మార్చు]

ఇచ్చాపురమ్ బెల్లువడ ప్రాంతములోని శుద్ధికొండ త్రినాధస్వామి యాత్ర ప్రతి సంవత్సరము కనుమ నాడు జరుగుతుంది. అదే రోజు హనుమత్ దర్శనోత్సవము కూడా ఇక్కడ జరుగుతుంది. పెద్ద జగన్నాధ స్వామి ఆలయము కూడా ఉంది. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి ప్రజలు ఎక్కువగా ఈయాత్రకు తరలి వస్తారు.

స్వేచ్చావతి అమ్మవారు[మార్చు]

ఇక్కడ ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారిని ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి నాడు పూజలు చేస్తారు

పీర్లకొండ[మార్చు]

హిందూ-ముస్లింల సమైక్య జీవనానికి ప్రతీక.. 16శతాబ్దం నాటి ప్రాచీన సంస్కృతికి సజీవసాక్ష్యం.నవాబుల పరిపాలన కాలంలో ఇక్కడ పీర్లకొండపై ఉన్న కట్టడాల్ని ప్రార్థనా మందిరాలుగా వినియోగించేవారు. 16వ శతాబ్దంనాటివైనా నేటికీ చెక్కుచెదరకుండా గత వైభవపు చిహ్నాలుగా నిలిచివున్నాయి. ఏటా మార్గశిర గురువారాల్లో హిందువులు పీర్లకొండపైకి చేరుకొని మొక్కులను చెల్లిస్తుంటారు. హైందవ సంప్రదాయ ప్రకారం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. ఆంధ్రా-ఒడిషా ప్రాంతాల నుంచి వేలాదిగా ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు. అలాంటి ఈ కట్టడాల సమీపం వరకు కొండ క్వారీ తవ్వకాలను సాగించడం వల్ల సమీప భవిష్యత్తులో కట్టడాలు ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.పీర్లకొండలో క్వారీని గుర్తించి 20 ఏళ్ల క్రితం ఒకటిన్నర హెక్టార్లకు ప్రభుత్వం లీజుకిచ్చింది.కొండను మూడువైపుల నుంచీ తవ్వేస్తున్నారు. లీజు ఒప్పందాల ప్రకారం పేలుడు పదార్థాలను వినియోగించకూడదు. ఇక్కడ డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉపయోగించి నాలుగు అడుగుల గోతిని తవ్వి దాంట్లో గంధకం, పొటాష్‌ తదితర రసాయనాలు నింపి కొండను పేల్చుతున్నారు.పేలుడు కారణంగా కొందరు మృతిచెందారు. నాణ్యమైన రాయిగా ఇచ్ఛాపురం పీర్లకొండ రాళ్లకు గుర్తింపు ఉంది. అటు ఒడిషాలోని భువనేశ్వర్‌, ఇటు ఆంధ్రాలోని విశాఖపట్నం వరకు ఈ రాయిని రవాణా చేస్తున్నారు. (ఈనాడు 7.3.2010)

పాదయాత్ర జ్ఞాపిక స్తూపం[మార్చు]

స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కాంగ్రెసు ప్రతిపక్షసభ్యుడుగా వున్నప్పుడు, 2003 లో రంగారెడ్డిజిల్లాలో చెవెళ్ళ నుండి, ఏప్రిల్ 9 వతేదిన పాదయాత్ర ప్రారంభించి, 68 రోజులు, 1470 కి.మీ నడచి ఇచ్చాపురంలో తన పాదయాత్రముగించిన చోట, ప్రజాప్రస్ధాన విజయవాటికలో ఒక జ్ఞాపిక స్తూపాన్ని నిర్మించారు.

బ్యాంకులు[మార్చు]

  • స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
  • ఆంధ్రబ్యాంక్

వసతి గృహాలు[మార్చు]

  • సూర్యాలాడ్జి:మెయిన్ రోడ్డులో బరంపురంవెళ్ళువైపు ఉంది.
  • మరో లాడ్జి శ్రీరామా లాడ్జి: పాత బస్టాండుకు దగ్గరలో ఉంది.

సినిమాథియేటర్లు -ఇతరాలు[మార్చు]

  • ఒక్కప్పుడు 3 సినిమా థియెటరులుండేవి.ప్రస్తుతం మూడింటిని మూసివేశారు.
  • నగర సంస్ధవారి పార్కు ఉంది.
  • హెడ్ పొస్టాఫిసు ఉంది.
  • సర్కిల్ స్థాయి పోలీసు స్టేషను ఉంది.

ప్రజల జీవన విధానం[మార్చు]

ఈ పట్టణానికి సమీపంగా ఒడిస్సా రాష్ట్రాముండుటచే, ఒరియాభాష, వారిసంస్కృతి ఇక్కడిప్రజలలో తెలుగుఆచారాలతోపాటు కలగలిసిపోయాయి.ఇచ్చటి ప్రజలు అందరు, ఇంచుమించు తెలుగు, ఒరియా రెండుభాషలు మాట్లాడుతారు. భోజనం, వస్త్రధారణ, ఇతరఆచారావ్యవహారాలలో ఒడియా ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.జగన్నాధుని పండుగ చాలా వైభవంగా చేస్తారు.ఒరియా వారిని స్ధానికులు 'వడ్ది లని పిలుస్తారు.

మండలం లోని పట్టణాలు[మార్చు]

  • ఇచ్చాపురం - పట్టణ జనాభా: 32662. పురపాలక సంఘం వార్డులు: 23

ఇచ్చాపురం శాసనసభ నియోజకవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "STATISTICAL INFORMATION OF ULBs & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. p. 1. Retrieved 24 April 2019.
  2. "Elevation for Rajam". Veloroutes. Retrieved 19 August 2014.
  3. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 19 August 2014.
  4. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
  5. "Villages and Towns in Ichchapuram Mandal of Srikakulam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2023-01-11. Retrieved 2023-01-11.
  6. "Ichchapuram Municipality City Population Census 2011-2023 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2023-01-11.

వెలుపలి లంకెలు[మార్చు]