అద్దంకి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
పటం
నిర్దేశాంకాలు: 15°48′40″N 79°58′26″E / 15.811°N 79.9738°E / 15.811; 79.9738Coordinates: 15°48′40″N 79°58′26″E / 15.811°N 79.9738°E / 15.811; 79.9738
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంఅద్దంకి మండలం
విస్తీర్ణం
 • మొత్తం25 km2 (10 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం43,850
 • సాంద్రత1,800/km2 (4,500/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08593 Edit this on Wikidata )
పిన్(PIN)523201 Edit this on Wikidata
జాలస్థలిhttps://addanki.cdma.ap.gov.in/ Edit this on Wikidata

అద్దంకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని బాపట్ల జిల్లాకు చెందిన ఒక పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం. రెడ్డిరాజుల తొలిరాజధానిగా ప్రఖ్యాతి. తొలి తెలుగు పద్య శాసనం అద్దంకిలోనే వెలుగు చూసింది.

పేరు వ్యుత్పత్తి[మార్చు]

ఒక కథ ప్రకారం, అద్దంకిలో అద్దడు, అంకి అనే ఇద్దరు వడ్డి కులం వారు తమ రాజుగారి కోట నిలవడానికి కోసం, ప్రాణలను సమర్పించుకొన్నారు. అందుకే ఈ ప్రాంతానికి అద్దంకి అని పేరు వచ్చింది.

చరిత్ర[మార్చు]

పాండురంగడు వేయించిన ప్రముఖమైన తొలి తెలుగు పద్య శాసనం అద్దంకిలోనే వెలుగు చూసినది. తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని తొమ్మిదవ శతాబ్దానికి సంబంధించినవిగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించాడు.[2] ఈ శాసనం వేయి స్తంభాల దేవాలయం దగ్గర త్రవ్వకాలలో బయటపడింది. ఇది సాహిత్య గ్రంథాలు వెలువడక ముందు తెలుగు సాహిత్యానికి నిదర్శనంగా భావిస్తారు. సా.శ. 849లో అద్దంకి పండరంగడు తనకు గురువైన ఆదిత్య భట్టారకుడికి 8 పుట్లు భూమిని దానమిచ్చిన వివరాలు తెలిపే శాసనమిది. ఇది చెన్నై మ్యూజియంలో భద్రపరచబడింది. దీని నకలు ప్రతిని అద్దంకిలో సృజనసాహితీప్రియుులు ప్రతిష్ఠించారు.[3]

రెడ్డిరాజుల కాలంలో ఇది ప్రఖ్యాతిగాంచిన పట్టణం.[4] గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న అద్దంకి రాజధానిగా 1324లో ప్రోలయ వేమారెడ్డి, మంత్రులైన దేశ పాండ్యులతో కలసి రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడు. తరువాత రాజధాని కొండవీటికి మార్చాడు. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రెగడ మహాభారతా న్ని ఇక్కడే పూర్తిచేశాడు.టంగుటూరి ప్రకాశం పంతులు బాల్యంలో ఇక్కడ చదువుకొన్నాడు.

2022 ఏప్రిల్ 4 న ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా , పట్టణం ప్రకాశం జిల్లా నుండి బాపట్ట జిల్లా పరిధిలోకి వచ్చింది.

భౌగోళికం[మార్చు]

అద్దంకి పట్టణం, చుట్టు గల గ్రామాల హద్దులు తెలుపు పటం (భువన్, ఇస్రో ద్వారా)

సమీప నగరమైన ఒంగోలుకు ఉత్తరంగా 38 కి.మీ దూరంలో, జిల్లా కేంద్రమైన బాపట్లకు పశ్చిమంగా 76 కి.మీ దూరంలో ఈ పట్టణం వున్నది.

జనగణన గణాంకాలు[మార్చు]

పటం2011 జనగణన ప్రకారం జనాభా 43,850. జన సాంద్రత 1,800/కి.మీ2 (4,500/చ. మై.).

పరిపాలన[మార్చు]

అద్దంకి నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

రంగనాయకులస్వామి దేవాలయం స్వామి వారి ఊరేగింపు
  • 1000 స్తంభాల దేవాలయం ( భవానీ సెంటర్ దగ్గర)
  • ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, సింగరకొండ : ఇక్కడ 5 కి.మీ. దూరంలో వుంది. ఇక్కడ ఇతర దేవాలయాలు కూడా వున్నాయి.. ఇక్కడ ₹ 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014, మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు.

రవాణా సౌకర్యాలు[మార్చు]

నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి పట్టణం గుండా పోతుంది. సమీప రైలు స్టేషన్ ఒంగోలు లో వుంది.

విద్య[మార్చు]

ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల, బధిరుల ఆశ్రమ పాఠశాల కొన్ని విశిష్ట పాఠశాలలు.

సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

రాళ్ళపల్లి చెరువు.

ఇవి కూడా చూడండి[మార్చు]

అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం

మూలాలు[మార్చు]

  1. http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx.
  2. ప్రభాకరశాస్త్రి, వేటూరి (1955). సింహావలోకనము. ముక్త్యాల: మణిమంజరి. Retrieved 2020-07-10.
  3. "ప్రకాశం జిల్లాచరిత్ర". ఈనాడు. Archived from the original on 2012-05-24. Retrieved 2019-08-09.
  4. ఆంధ్రప్రదేశ్ దర్శిని. 1982. p. 80.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అద్దంకి&oldid=3841099" నుండి వెలికితీశారు