గోపనపల్లి (శేరిలింగంపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపనపల్లి
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 046
Vehicle registrationటిఎస్ 07
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

గోపనపల్లి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం.[1][2] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 104వ వార్డు నంబరులో ఉంది.[3]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[4]

సమీప ప్రాంతాలు[మార్చు]

తారానగర్

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్

చందానగర్

కొండాపూర్

ఇందిరానగర్

ప్రజా రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గోపనపల్లి నుండి గచ్చిబౌలి, సికింద్రాబాద్, లింగంపల్లి, మెహదీపట్నం, హైదరాబాదు విశ్వవిద్యాలయం, కోఠి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5] ఇక్కడికి సమీపంలోని లింగంపల్లి, చందానగర్ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  1. కనకదుర్గ దేవాలయం
  2. షిర్డీ సాయిబాబా దేవాలయం
  3. మసీదు-ఈ-అమీనా కలీమి
  4. మసీదు ఇ హఫీజియా

బ్రాహ్మణ సదన భవనం[మార్చు]

గోపన్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల 10 గుంటల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని 2023, మే 31న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించాడు. బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ భవనంలో 12 నిర్మాణాలను చేపట్టారు. మూడంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సదనం, గ్రంథాలయం (ఆధ్యాత్మిక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల వంటి సాహిత్య పుస్తకాలు) ఏర్పాటుచేశారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్రమంలో విద్యాశాఖామంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, చేవెళ్ళ ఎంపీ జి. రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సుర‌భి వాణిదేవీ, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కె.వి. ర‌మ‌ణాచారి, ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి, పీఠాధిప‌తులు, పండితులు పాల్గొన్నారు. ఈ బ్రాహ్మణ సదనం భవనానికి 2017, జూన్‌ 5న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు.[6][7]

మూలాలు[మార్చు]

  1. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 13 September 2021.
  2. "Gopanapalli Locality". www.onefivenine.com. Retrieved 2021-09-13.
  3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 13 September 2021.
  4. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  5. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 12 September 2021.
  6. "CM KCR: విప్రహిత బ్రాహ్మణ సదన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". EENADU. 2023-05-31. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.
  7. telugu, NT News (2023-05-31). "Brahmana Samkshema Sadan | విప్ర‌హిత బ్రాహ్మ‌ణ సంక్షేమ స‌ద‌నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.

ఇతర లింకులు[మార్చు]