Coordinates: 16°33′07″N 79°33′11″E / 16.552°N 79.553°E / 16.552; 79.553

రెంటచింతల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°33′07″N 79°33′11″E / 16.552°N 79.553°E / 16.552; 79.553
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రంరెంటచింతల
Area
 • మొత్తం184 km2 (71 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం49,827
 • Density270/km2 (700/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి988

రెంటచింతల మండలం ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లాకు చెందిన మండలం. రెంటచింతల గ్రామం ఈ మండలానికి కేంద్రం. ఈ మండలం జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉంది. మండలానికి ఉత్తరాన కృష్ణానది ప్రవహిస్తూ ఉంది. OSM గతిశీల పటము

సమీప మండలాలు[మార్చు]

తూర్పున గురజాల మండలం, పశ్చిమ, దక్షిణాల్లో మాచర్ల మండలం, దక్షిణాన దుర్గి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

మండలంలోని విశేషాలు[మార్చు]

వాతవరణ నమోదు కేంద్రం[మార్చు]

రెంటచింతల గ్రామం రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కేంద్రంగా నమోదుఅవుతుంది. ఈ కేంద్రాన్ని తొలుత ఇక్కడ, 1936, ఫిబ్రవరి-21న ఏర్పాటుచేసారు. స్థానిక సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాలలో, పాఠశాలవారు విరళణంగా ఇచ్చిన స్థలంలో, నూతనంగా ఆరు లక్షల రూపాయల వ్యయంతో ఈ కేంద్రం నిర్మాణానికి, 2016, జనవరి-7వ తేదీనాడు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కేంద్రాన్ని, 2016, జనవరి-14వ తేదీనాడు ప్రారంభించారు. ఈ కేంద్రంలో, శాటలైట్ ద్వారా గంటగంటకూ, ఉష్ణోగ్రత, వర్షపాతం నమోదవుతవి. ఈ కేంద్రంద్వారా వివరాలను ప్రతి ఒక్కరూ ఇంటర్ నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. అన్నదాతలు ఈ వాతావరణ కేంద్రంలో పేర్లు రిజిస్టరు చేసుకుంటే, ప్రతి మంగళవారం, శుక్రవారం, వారి చరవాణి (సెల్ ఫోన్) లో వాతావరణ వివరాలు పంపించెదరు. ఈ కేంద్రంలో నమోదయిన వివరాల ప్రకారం, 1964, సెప్టెంబరు-29న రెంటచింతలలో అత్యధికంగా, 227 మి.మీ.వర్షపాతం నమోదయినది.

రెంటచింతల ప్రాంతానికి చెందిన నరిశెట్టి లిపిక, తల్లిదండ్రులతోపాటు అమెరికాలో ఉంటూ అక్కడే చదువుకొంటున్నది. ఆమె ఇటీవల అమెరికాలో నిర్వహించిన స్పెల్లింగుల పోటీలలో విశేషప్రతిభ చూపినది. 2015, జూన్-17న గుంటూరు వచ్చిన ఆమెను కలెక్టర్ శ్రీ కాంతీలాల్ దండే ప్రశంసించారు.

రెంటచింతలలో గాంధీజీ[మార్చు]

పూజ్య బాపూజీ పాదస్పర్శతో పులకించిన పల్నాట ఏకైక పల్లె, రెంటచింతల. గాంధీజీ ఈ గ్రామములో 1929, ఏప్రిల్-21న పర్యటించారు. విదేశీవస్త్ర బహిష్కరణ చేయాలని స్థానికులను కోరితే, వేలాదిమంది వస్త్రాలను నడివీధిలో వేసి, పెట్రోలుపోసి తగులబెట్టినారు. వై.ఆర్.ఎస్.ఉన్నత పాఠశాల ప్రాంగణంలో, తాటాకు పందిరివేసినారు. ఖద్దరు ఉద్యమంలో భాగంగా, జాతిపిత సుమారు 500 రాట్నాలతో రోజంతా నూలు నేసినన అరుదైన సన్నివేశం, రెంటచింతల గ్రామస్థులకు ఒక తీపి గురుతుగా నిలిచిపోయింది.

మండల గణాంకాలు[మార్చు]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు 10 అందులో ఒకటి నిర్జన గ్రామం. 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 46,620.అందులో పురుషులు 23720.స్త్రీలు 22890. మండల పరిధిలోని మొత్తం అక్షరాస్యత శాతం: 49.69, పురుషులు అక్షరాస్యత శాతం 59.57.స్త్రీల అక్షరాస్యత శాతం 39.49.

2001-2011 దశాబ్దిలో మండల జనాభా పెరుగుదల 6.87% గా ఉంది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 9.47%.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. మల్లవరం
  2. గోలి
  3. మిట్టగుడిపాడు
  4. రెంటచింతల
  5. పసర్లపాడు
  6. తుమృకోట
  7. పాలువాయి
  8. మంచికల్లు
  9. రెంటాల

గమనిక:సముదాయం నిర్ణయం మేరకు నిర్జన గ్రామాలు పరిగణనలోకి తీసుకోలేదు

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2019-11-13 suggested (help)