ఉస్మానియా విశ్వవిద్యాలయము
|
ఉస్మానియా విశ్వవిద్యాలయము |
|
|---|---|
| కొసరు | తమసోమా జ్యోతిర్గమయ |
| స్థాపన | 1918 |
| తరహా | ప్రభుత్వ సంస్థ |
| కులపతి | నరసింహన్ |
| ఉప కులపతి | మొహమ్మద్ సులేమాన్ సిద్దిఖి |
| ప్రదేశం | హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
| చిరునామా | ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ - 500 007 భారతదేశం |
| క్యాంపస్ | పట్టణ |
| వెబ్సైటు | www.osmania.ac.in |
| NAAC ద్వారా ఐదు నక్షత్రాల నాణ్యత గుర్తింపు పొందినది | |
ఉస్మానియా విశ్వవిద్యాలయము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరములోని ప్రధాన విశ్వవిద్యాలయం. ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం[1] ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులలో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా బాషగా మారింది.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
నిజాం పరిపాలన కాలంలో హైదరాబాదులో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు, సంపన్న వర్గాలకు మాత్రమె అందు బాటులో వుండేవి. ఉన్నత విద్యను అన్ని సామజిక వర్గాలకు అందించాలనే వుద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1913 వ సంవత్సరంలో తమ పాలనలో వున్న ప్రాంతాలలొనె గాక సంస్థానాలలో కూడ విస్వ విద్యాలయాలను స్థాపించాలని తీర్మానించింది. ఆవిధంగా పాట్నా, బనారస్, మైసూరు, ఉస్మానియా విస్వవిద్యాలయాలు స్థాపించ బడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం,, హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసిఫ్ జా VII చే 1917 లో స్థాపించబడింది. భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాద్ సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. తన తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయము అన్ని విభాగాలలోనూ మంచి పురోగతి సాధించింది. ఇక్కడ ఉర్దూ ప్రథమ భాషగా మాద్యమంగా ప్రవేశ పెట్టి బ్యూరో ఆఫ్ ట్రాంసలేషన్ ను ఏర్పాటు చెసారు. మొదట గన్ ఫౌండ్రీ ప్రాంతంలో 25 మంది సిబ్బంది, 225 విధ్యార్తులుతో ఇంటర్మీడియట్ సాయంకాలం కోర్సులతో ప్రారంబించి క్రమంగా 1921 లోబ్.ఏ, 1923 లో ఎం.ఎ.ఎల్.ఎల్.బి 1927 లో మెడిసిన్, 1929 లో ఇంజనీరింగు కోర్సులని ప్రవేశ పెట్టారు. అయితే నగరంలో వివిద ప్రాంతాలలో వున్న కళాశాలలను పరిపాలనా సౌలభ్యం కొరకు ఒకే ప్రాంతంలో వుంటే బాగుంటుందని సంకల్పించి తార్నాక ప్రాంతంలో 2400 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత కాంపస్ ను ఏర్పాటు చేసారు. భవనాల నిర్మాణానికి ఆర్కిటెక్ లుగా సయ్యద్ అలీ, రజా, నావాబ్ జయంత్ సింగ్ బహదూర్ లను నిమమించారు. వారు అమెరికాలోని కాలి ఫోర్నిఉఆ స్టాంఫోర్డ్, హార్వర్డ్ కొలంబియా, బ్రిటన్ లోని ఆక్స్ పర్డ్, కేంబ్రిడ్జ్ మొదలగు విశ్వవిద్యాలయాలలు సందర్శించి వచ్చారు. బెల్జియం కు చెందిన ఇ.జస్సార్ ను సలహా ధారునిగా నియమించి లా, ఇంజరీరింగ్, ఆర్ట్స్ కళాశాల లైబ్రరి, సెనేట్ హాలు వంటి భవనాలను నిర్మించారు. ఆర్ట్స్ కాలేజి భవనానికి 1923 జూలై 5వ తారీఖున పునాదులు వేసి, 1939 డిసెంబరు నాల్గవ తేదీన పూర్తి చేసారు. అదే రోజున హైదరాబాదు నైజాము దీనిని ప్రారంబించాడు. నైజాంలో విధ్యాశాఖ మంత్రిగా వుండిన అక్బర్ హైదర్ చాంసలర్ గా, నవాబ్ మెహదీయార్ జంగ్ బహదూర్ వైస్ చాంస్లర్ గా నియమితులైనారు. 1949 లో హైదరాబాద్ రాస్ట్రం భారత దేశంలో విలీనం కావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి వరకు ఉర్దూ మాద్యమాన్ని రద్దు చేసి ఆంగ్లమాద్యమాన్ని ప్రవేశ పెట్టారు. మొదట దీనికి ఇస్లాం యూనివర్సిటి గా నామ కరణం చేయాలన్న ప్రతి పాదనను కాదని ఉస్మానియా యూనివర్సిటిగా నామ కరణం చేశారు. ఇండియా టు డే, మన దేశంలో వున్న 160 యూనివర్సిటిలపై సర్వే నిర్వహించాగా 2010 వ సంవత్సరంలో 10వ స్థానం, 2011లో 7వ స్థానం., 2012 లో ఆరవ స్థానం లభించింది. దక్షిణాది రాస్ట్రాలకు చెందిన యూనివర్సిటీలలో ఉస్మానియా విశ్వ విద్యాలయం మొదటి స్థానంలో నిలసింది.
ప్రతిష్ట మరియు బోధించే విషయాలు [మార్చు]
1,600 ల ఎకరాల (6 చ.కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని బహూశ దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడి భూగోళ శాస్త్ర విభాగం దక్షిణ భారతావనిలోనే పురాతనమైనది మరియు పెద్దది. ఇది 1942లో స్థాపించబడింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ [మార్చు]
ఆర్ట్స్ కళాశాలలో తెలుగు శాఖ చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఎకైక శాఖ. తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడతంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు తెలుగు భాష పై పరిశోధన (పీ.హెచ్.డి) లను అందిస్తున్నది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం [మార్చు]
ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు ఎం. ఫిల్ , పీహెచ్.డి డిగ్రీ లను అందిస్తున్నది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం [మార్చు]
ప్రత్యేక తెలంగాణకై విశ్వవిద్యాలయ విద్యార్థులు 1965 నుంచి పోరాడుతున్నారు. తెలంగాణ ప్రాతంలో ఇది అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఉండటం, ఇక్కడి విద్యార్థులు తెలంగాణ వారే అధికసంఖ్యలో ఉండటం మరియు స్వాతంత్ర్యోద్యమం సమయంలో ఇక్కడ విజయవంతంగా జరిగిన వందేమాతరం ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని ఇక్కడి విద్యార్థులు, మేధావులు ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తున్నారు.
చెప్పుకోదగిన పూర్వవిద్యార్ధులు [మార్చు]
- మహమ్మద్ రజీ-ఉద్దిన్ సిద్దిఖీ. ప్రముఖ గణిత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతికి నామిని చేయబడినవారు.
- పి.వి.నరసింహారావు, పూర్వ భారతదేశ ప్రధానమంత్రి.
- అసదుద్దీన్ ఒవైసీ, రాజకీయుడు, భారత పార్లమెంటు సభ్యుడు.
- సయ్యద్ అలీ మొహమ్మద్ ఖుస్రో, ఆర్ధికవేత్త, మాజీ జర్మనీ రాయబారి
- హరూన్ సిద్ధిఖీ, కెనడాలో భారత పాత్రికేయుడు
- రాములు కొమిరెడ్డి, జర్నలిస్టు
- ఆచార్య అఫ్జల్ మొహమ్మద్ ఉపసంచాలకుడు, బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు
- శ్యాం బెనగళ్, భారతీయ సినిమా దర్శకుడు
- హర్ష భోగ్లే, క్రికెట్ వ్యాఖ్యాత
- వరవర రావు, విప్లవ కవి
- జైపాల్ రెడ్డి, కాంగ్రెస్
- కిరణ్ కుమార్ రెడ్డి,ముఖ్యమంత్రి
అనుబంధంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు [మార్చు]
- ఉస్మానియా విశ్వవిద్యాలయము ఇంజనీరింగ్ కళాశాల. (స్తా. 1929) (http://www.uceou.edu)
- ఉస్మానియా విశ్వవిద్యాలయ సాంకేతిక కళాశాల
అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాలలు [మార్చు]
- సర్దార్ పటేల్ కళాశాల, సికిందరాబాదు
- ఆంధ్ర విద్యాలయ కళాశాల, లిబర్టీ, హైదరాబాదు
- ప్రగతి కళాశాల, కోఠి, హైదరాబాదు
బయటి లింకులు [మార్చు]
- ఉస్మానియా విశ్వవిద్యాలయము
- ఉస్మానియా విశ్వవిద్యాలయము బిజినెస్ మానేజ్మెంట్ శాఖ
- ఎన్.ఎ.ఏ.సి
- ఉస్మానియా విశ్వవిద్యాలయము పూర్వవిద్యార్ధుల సంఘం
మూలాలు [మార్చు]
ఈనాడు. 28.5.2012. పుట 6.
- ↑ ఆదాబ్ హైదరాబాద్, మల్లాది కృష్ణానంద్ రచన, ద్వితీయ ముద్రణ అక్టోబరు 2008, పేజీ సంఖ్య 70