చెన్నకేశవ శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెన్నకేశవ శతకము
కవి పేరురామడుగు సీతారామశాస్త్రి
దేశంభారత దేశము
భాషతెలుగు
మకుటంచెన్నకేశవా!
పద్యం/గద్యంపద్యములు
ఛందస్సువృత్తములు
మొత్తం పద్యముల సంఖ్య100
మొత్తం పుటలు34
శతకం లక్షణంభక్తి శతకం

చెన్నకేశవ శతకం రామడుగు సీతారామశాస్త్రి రచించిన శతకం. ఇది 1944లో ముద్రించబడింది.

విశేషాలు[మార్చు]

శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. "చెన్నకేశవా!" అనే మకుటంతో ఈ పద్యాలను రచించారు.ఇందుకోసం నల్లమోతు కృష్ణయ్య ధనసహాయం చేయగా రచయిత పుత్రుడు రామడుగు సత్యనారాయణ శాస్త్రి సంపాదకత్వం వహించాడు. ఇది 1944లో ముద్రించబడినది.[1]

పద్యాలు[మార్చు]

మొదటి పద్యం

శ్రీరమణీ మనః కుముద శీతమయూఖ! విరించిముఖ్య బృం
దారక వారచారుతర నవ్యకిరీటమణీ ఘృణీఝరీ
పూర విరాజమాన పదపుష్కరజాత! నమో స్తుతే లస
న్నీరదనీలగాత్ర! ధరణీభరణక్షమ! చెన్నకేశవా!

మూలాలు[మార్చు]

  1. రామడుగు సీతారామశాస్త్రి (1944). చెన్నకేశవ శతకం.

బాహ్య లంకెలు[మార్చు]