సుమిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పాయసాన్ని అందిస్తున్న దశరథుడు

సుమిత్ర రామాయణంలో దశరథుని భార్య. కాశీరాజ్యపు రాకుమారి. పుత్రకామేష్టి యాగం చేసిన తరువాత యజ్ఞఫలం మూలంగా ఈమెకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. ఈమె కుమారుడైనందున లక్ష్మణుని "సౌమిత్రి" అంటారు.

రామాయణంలో సుమిత్ర ప్రస్తావన చాలా కొంచెంగా వస్తుంది. ఆమె పాత్రలో చాలా ఉదాత్తత, వివేకం కనిపిస్తాయి. వనవాసానికి వెళ్ళేముందు సీతారామలక్ష్మణులు ఆమెవద్దకు సెలవు తీసుకోవడానికి వెళ్ళారు. అప్పుడామె దుఃఖిస్తూనే లక్ష్మణునితో - "నాయనా, నువ్వు అడవులలో ఉండడానికే పుట్టావు. అన్నా వదినలకు ఏమీ ఆపద కలుగకుండా కాపాడుకో. వారే నీ తల్లిదండ్రులు. సుఖంగా వెళ్ళిరా " అని ఆశీర్వదించి పంపింది.

బిడ్డల వనవాసగమనం వల్ల దుఃఖిస్తున్న కౌసల్యను సుమిత్ర ఓదార్చింది. తండ్రిని సత్యవాదిని చేయడానికే రాముడు అడవులకు వెళ్ళాడని. ముల్లోకాలలోనూ గొప్పవాడైన రాముడు తప్పక తిరిగి వచ్చి తల్లి పాదాలు సేవిస్తాడని అనునయించింది.

"https://te.wikipedia.org/w/index.php?title=సుమిత్ర&oldid=3689889" నుండి వెలికితీశారు