చిరవిభవ శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిరవిభవ శతకము
కవి పేరుకూచిమంచి తిమ్మకవి
మొదటి ప్రచురణ తేదీ1923
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంచిరవిభవా! భవా! విజిత చిత్తభవా!
విషయము(లు)భక్తి
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుచంపకమాలా వృత్తము
ప్రచురణ కర్తచెలికాని లచ్చారావు
ప్రచురణ తేదీ1923
మొత్తం పద్యముల సంఖ్య101
ముద్రణా శాలశ్రీరామవిలాస ముద్రాక్షరశాల, చిత్రాడ

ఈ శతకము[1] కూచిమంచి తిమ్మకవిచే రచింపబడి 1923లో చెలికాని లచ్చారావుచే సంకలించబడిన శతకములు రెండవ సంపుటిలో చోటు చేసుకున్నది. భక్తి ప్రధానమైన శతకము. లౌకిక విషయాలు కూడా చర్చింపబడ్డాయి. చంపకమాలా సురభిళములైన 101 పద్యాలు ఈ శతకంలో ఉన్నాయి. 5 పద్యాలు అలభ్యములు. చిరవిభవా! భవా! విజిత చిత్తభవా! అనే మకుటం ఈ శతకానికి ఉంది. ఈ శతకము శ్రీరామవిలాస ముద్రాక్షరశాల, చిత్రాడలో ముద్రించబడింది.

ఉదాహరణ[మార్చు]

లోభులైన ప్రభువులు కవి ఏమేమి అడుగుతాడో, ఎక్కడ అతనికి దానమివ్వవలసి వస్తుందో అనే భయంతో అతనికి దర్శనమివ్వరనే భావం వచ్చే పద్యం ఇందులో ఉంది.

చ|| ఒరిమెఁ గవీంద్రుఁడే మెఱుఁగునో యని దర్శన మియ్యనోడి బ
ల్దొరలును మూల నీఁగుదురు లోభమున న్నిను నేమ ఱేమియు
న్వరములు వేఁడ నాకిపుడు వైళమ దర్శన మియ్యరాగదే
చిరవిభవా! భవా! విజిత చిత్తభవా! యభవా! మహాభవా!

మూలాలు[మార్చు]

  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973