జాతీయ ప్రజాస్వామ్య కూటమి
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) భారతదేశంలోని మధ్య-సాంప్రదాయ రాజకీయ పార్టీల సంకీర్ణ పక్షం. 1998లో ఇది ఏర్పడినపుడు భారతీయ జనతాపార్టీ నేతృత్వంలో 13 ఇతర భాగస్వామ్య పార్టీలను కలిగి ఉంది. NDA కన్వీనర్ శరద్ యాదవ్ మరియు గౌరవాధ్యక్షుడు పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి. కూటమిలోని ప్రతినిధులు పూర్వ గృహమంత్రి సుష్మా స్వరాజ్, రాజ్యసభలోని ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ, మరియు లోక్సభ ఉప స్పీకర్ కరియా ముండ.
విషయ సూచిక
చరిత్ర[మార్చు]
1998 మేలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రకటించబడిన తర్వాత మొదటి అడుగు సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడం, కానీ అఖిలభారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(AIADMK) మద్దతు ఉపసంహరించుకోవడం వలన సంవత్సరములోగా ప్రభుత్వము పతనమయినది. ఇది 1999 ఎన్నికలలో భారీ మెజారిటితో గెలవడానికి మరియు కొత్త పొత్తులు ఏర్పడడానికి దారితీసింది. NDA, వాజపేయి ప్రధానమంత్రిగా పూర్తిగా ఐదు సంవత్సరాలు పరిపాలించింది, 2004 ఎన్నికలలో గెలుపు గురించి విస్తృతంగా ఊహించడము జరిగింది. ఎలాగయినప్పటికి, ఎన్నికల తరువాత, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యములోలేని పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి ప్రభుత్వము ఏర్పర్చుటకు రంగములోనికి దిగింది. NDA నిర్మాణముచే ప్రభావితమయి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమయిన జాతీయపార్టీగా చుక్కానిలా మరియు మిగిలిన ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యముతో కలసి ఐక్య పురోగామి కూటమిను ఏర్పరచింది.
నిర్మాణం[మార్చు]
భారతదేశంలోని రాజకీయ పార్టీలకు తరచుగా ఏర్పరచే మరియు కూలదోయగల సామర్ధ్యము యున్నట్లుగా, జాతీయ ప్రజాస్వామ్య కూటమికి కార్య నిర్వహణా వర్గం లేదా ఆచరణాదేశక వర్గం లాంటి సంస్థా నిర్మాణము లేదు. ఎన్నికలలో స్థానాల సర్దుబాటు, మంత్రిపదవుల కేటాయింపు మరియు పార్లమెంటులో లేవనెత్తిన విషయాల మీద నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము వ్యక్తిగత పార్టీల నాయకులకు ఉంది. పార్టీల మధ్య ఉన్నటువంటి వేర్వేరు ప్రభుత్వ ఏర్పాటు ఆలోచనలు, చాలా సందర్భాలలో కూటమిలోని అనైక్యతకు మరియు అనంగీకారమునకు దారితీస్తుంది. అనారోగ్యకారణాల వలన కూటమి వ్యవహర్త జార్జ్ ఫెర్నాండెజ్ బాధ్యతల నుంచి తప్పుకొనగా, ఆ స్థానం జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్ చే భర్తీ చేయబడింది.[1]
గత మరియు ప్రస్తుత సభ్యులు[మార్చు]
ప్రస్తుతము ఎన్డీయే లోని 13 పార్టీలు :[2]
- భారతీయ జనతా పార్టీ(116 MPs)
- జనతాదళ్(యునైటెడ్)-బీహార్ మరియు కర్ణాటక(20 MPs)
- శివసేన-మహారాష్ట్ర(11 MPs)
- ప్రకాష్ సింగ్ బాదల్ యొక్క శిరోమణి అకాలీదళ్ ఫ్యాక్షన్-పంజాబ్(4 MPs)
- తెలంగాణా రాష్ట్ర సమితి-ఆంధ్ర ప్రదేశ్(2 MPs)
- అసోం గణ పరిషద్-అస్సాం(1 MP)
- నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్-నాగాలాండ్(1 MP)
- ఉత్తరాఖండ్ క్రాంతి దళ్-ఉత్తరాఖండ్
సంకీర్ణాన్ని వీడి వెళ్ళిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి యొక్క పూర్వ సభ్యులు:
- J&Kనేషనల్ కాన్ఫరెన్సు-J&Kఎన్నికలలో బి.జె.పి ఓటమి వలన దానిని నిందిస్తూ 2002లో విరమించుకుంది. J&K.ముఖ్యమంత్రి ఫరుఖ్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా, విదేశాంగశాఖ సహాయ మంత్రిగా పనిచేసారు.
- లోక్ జనశక్తి పార్టీ-2002 గుజరాత్ మతఘర్షణల నేపథ్యంలో మద్దతు విరమించుకొంది. దీని అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ కేంద్ర మంత్రివర్గంలో మొదట కమ్యునికేషన్ మంత్రిగా, తర్వాత బొగ్గు మంత్రిగా చేసారు.
- మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కజగం-2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలసింది.
- ద్రావిడ మున్నేట్ర కజగం-2004 ఎనికలలో కాంగ్రెస్ పార్టీతో కలసింది.
- అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం-1999 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలసింది, 2004 ఎన్నికలలో సంకీర్ణంతో తిరిగి కలిసింది, కానీ తర్వాత ఓటమివలన దానిలో ఉండలేదు. 2009 ఎన్నికలకు ముందుతృతీయ కూటమితో కలిసింది.[3]
- పట్టలి మక్కల్ కచ్చి-2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలిసింది.
- ఇండియన్ ఫెడరల్ డెమోక్రాటిక్ పార్టీ-దీని నాయకుడు,P.C.ధామస్, వాజ్ పాయ్ ప్రభుత్వంలో మంత్రి మరియు కేరళ నుండి సంకీర్ణంలో ఉన్న ఒకే ఒక పార్లమెంట్ సభ్యుడు. 2004 ఎన్నికలలో తన పార్టీని కేరళ కాంగ్రెస్ లో విలీనం చేసాడు, ఇది వామపక్షాలతో ఉంది.
- తృణమూల్ కాంగ్రెస్-పశ్చిమ బెంగాల్-2007 చివరలో కూటమి నుండి విరమించుకొంది. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో కలసింది.
- బిజూ జనతాదళ్-ఒడిషా-2009 ఎన్నికలకు ఒక నెల ముందు కూటమి నుండి వైదొలగింది.
- ఇండియన్ నేషనల్ లోక్ దళ్-2009 హర్యానా శాసనసభ ఎన్నికలలో సీట్ల సర్దుబాటు అనంగీకారము వలన తప్పుకొంది.
బయట నుండి మద్దుతు ఇచ్చి, కూటమిలో కొనసాగని పార్టీలు:
- తెలుగుదేశం పార్టీ-2005లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో తె.దే.పా, NDA యొక్క పార్లమెంట్ బహిష్కరణలో భాగంగా కొనసాగరాదని నిర్ణయించుకుంది. NDA యొక్క అంతాన్ని ఊహిస్తూ-తె.దే.పాతో NDA సంబంధం 2005 ఆగస్టులో స్థిరపరచబడి, NDA మరియు తె.దే.పా స్వయంగా ఎవరికి వారు స్థానిక ఎన్నికలలో పోటీ చేసారు. 2009లో తె.దే.పా థర్డ్ ఫ్రంట్ను ఏర్పరచింది.[3]
15వ లోక్ సభకు సీట్ల సర్దుబాటు అమరిక[మార్చు]
15వ లోక్ సభకు ముందు BJP వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అది పొత్తుపెట్టుకున్న పార్టీలలో అధికభాగం పైన పేర్కొనబడినవి. పంజాబ్ లోని BJP మరియు శిరోమణి అకాలీదళ్, ఉత్తరప్రదేశ్లో BJP మరియు రాష్ట్రీయ లోక్ దళ్, BJP మరియు జనతా దళ్ (యునైటెడ్)(JDU)పొత్తు ప్రధానంగా బీహార్లో ఉండగా ఇంకా చాలా రాష్ట్రాలలో కూడా ఉంది. ఆ రాష్ట్రాలలో JD(U)పాల్గొనకుండా రెండు లేదా మూడు సీట్లు ఇచ్చింది. అస్సాంలో BJP మరియు అసోం గణ పరిషద్ పొత్తు పెట్టుకున్నాయి. మహారాష్ట్రలో BJP మరియు శివసేన పొత్తు పెట్టుకున్నాయి. మిగతా చిన్న పార్టీల NPF,GJM మరియు ఉత్తఖండ్ క్రాంతి దళ్లు చాల కొద్ది సీట్లలో లేదా అసలు పోటీచేసి ఉండక పోవచ్చు. తమిళనాడులో BJP పోటీచేసే క్రమములో లేదు. సీనియర్ BJP నేత వెంకయ్యనాయుడు BJP తో కూడిన 7 పార్టీల ఫ్రంట్ ను ఏర్పరచాడు. ఈ ఫ్రంట్ ఏ సీట్లూ గెలిచే అవకాశంలేని చిన్న పార్టీలను కూడా కలిగి ఉంది. నిజానికి BJP దాని ఉత్తమ గెలుపుగా 39 సీట్లు గల రాష్ట్రములో కేవలము 4 సీట్లు మాత్రమే గెలిసింది. ఈ ఫ్రంట్ లో గల పార్టీలు మరియు అవి ఎన్ని సీట్లలో పోటిచేసింది ఈ దిగువన ఇవ్వబడినది:
BJP-13 స్థానాలు
JDU-2 స్థానాలు
ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి-సినీ నటుడు శరత్ కుమార్ చే స్థాపించ బడినది-5 స్థానాలు
నడలుం మక్కల్ కచ్చి-నటుడు కార్తీక్ చే స్థాపించబడింది-2 స్థానాలు
జనతా పార్టీ-డాక్టర్ సుబ్రమణియం స్వామిచే స్థాపించబడినది -ఏ స్థానము నుండి పోటీ చేయలేదు
పుతియ తమిళజం కచ్చి-ఏ స్థానము నుండి పోటీ చేయలేదు
భారతీయ ఫార్వర్డ్ బ్లాక్-ఏ స్థానం నుండి పోటీ చేయలేదు
భాగస్వాములు(2009 ఎన్నికలు):[మార్చు]
ఎలక్షన్లకు ముందు NDA కలిగి ఉన్న భాగస్వామ్య పార్టీలు దిగువన ఇవ్వబడినవి:
పార్టీలు | |
---|---|
భారతీయ జనతా పార్టీ | |
శివ సేన | |
జనతా దళ్(యునైటెడ్) | |
శిరోమణి అకాలీ దళ్ | |
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | |
రాష్ట్రీయ లోక్ దళ్ | |
అసోం గణ పరిషద్[4] | |
నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ | |
గోర్ఖా జనముక్తి మోర్చా | |
ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ | |
కంతాపూర్ ప్రోగ్రెసివ్ పార్టీ | |
లడఖ్ యూనియన్ టెరిటరీ ఫ్రంట్ | |
మిజో నేషనల్ ఫ్రంట్ | |
తెలంగాణా రాష్ట్ర సమితి[5] | |
పూర్వ సభ్యులు (2004 ఎన్నికల తరువాత) | |
అల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం(థర్డ్ ఫ్రంట్) లో కలసింది | |
తెలుగుదేశం(థర్డ్ ఫ్రంట్లో కలసింది) | |
తృణమూల్ కాంగ్రెస్(యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో కలసింది) | |
బిజు జనతాదళ్ (థర్డ్ ఫ్రంట్లో కలసింది) | |
ఇండియన్ ఫెడరల్ డెమొక్రాటిక్ పార్టీ(కేరళ కాంగ్రెస్లో విలీనమైనది) |
సూచనలు[మార్చు]
- ↑ http://WWW.lkadvani.in/eng/content/view/677/281/
- ↑ చిన్నపార్టీలు,స్వతంత్ర పార్టీలకు[1] మంచి గిరాకీ. జూలై 15, 2008న తిరిగి పొందబడింది.
- ↑ 3.0 3.1 "Third Front is born, asks for nation's trust". Retrieved 2009-03-12. Cite news requires
|newspaper=
(help) - ↑ అస్సాంలో AGP,BJP తో సీట్ల సర్దుబాటు అంగీకారము కుదుర్చుకుంది,కానీఅది సాధారణంగా NDA లో "AGP announces its candidates for Lok Sabha polls". The Hindu. March 9, 2009. Retrieved 2009-03-09. Cite web requires
|website=
(help)చేరే ఉద్దేశ్యము లేనట్లుగా సూచిస్తుంది. - ↑ http://www.hindu/2009/05/11/stories/2009051157250100.htm TRS joins NDA