సమాజ్‌వాది జనతా పార్టీ (రాష్ట్రీయ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాజ్‌వాది జనతా పార్టీ
స్థాపకులుచంద్రశేఖర్
స్థాపన తేదీ5 నవంబరు 1990 (33 సంవత్సరాల క్రితం) (1990-11-05)
రద్దైన తేదీ2020
ప్రధాన కార్యాలయంనరేంద్ర నికేతన్, ఇంద్రప్రస్థ ఎస్టేట్, న్యూ ఢిల్లీ
యువత విభాగంఆల్ ఇండియా సోషలిస్ట్ యూత్ కౌన్సిల్
రాజకీయ విధానంసోషలిజం
లౌకికవాదం
రంగు(లు)  ఆకుపచ్చ
ECI Statusరాష్ట్ర పార్టీ
కూటమి
Election symbol

సమాజ్‌వాది జనతా పార్టీ (రాష్ట్రీయ) లేదా జనతాదళ్ (సోషలిస్ట్) అనేది భారతీయ రాజకీయ పార్టీ. 1990-91లో భారతదేశ 8వ ప్రధానమంత్రి అయిన చంద్ర శేఖర్‌ ఈ పార్టీని స్థాపించాడు. 2007 జూలై 8న ఆయన మరణించే వరకు పార్టీకి నాయకత్వం వహించాడు.

చంద్ర శేఖర్ మరణించే సమయానికి పార్టీకి ఏకైక లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. జనతాదళ్ నుండి చంద్ర శేఖర్, దేవి లాల్ విడిపోయినప్పుడు 1990 నవంబరు 5న పార్టీ స్థాపించబడింది. పార్టీ 60 మంది ఎంపీలను కూడగట్టుకుని ఏడు నెలల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.[1]

1994 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు 1993లో రాష్ట్ర యూనిట్ జనతాదళ్‌లో విలీనం అయ్యేవరకు ఎస్.ఆర్. బొమ్మై కర్ణాటక రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు.[2]

2012 నాటికి, చంద్ర శేఖర్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో మాజీ క్యాబినెట్ మంత్రి కమల్ మొరార్కా పార్టీ అధినేత. పార్టీ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని న్యూఢిల్లీలోని ఐటిఓ ఇంద్రప్రస్థ ఎస్టేట్‌లోని నరేంద్ర నికేతన్‌లో ఉంది.[3]

2015 ఏప్రిల్ 14న సమాజ్‌వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ), జనతాదళ్ (యునైటెడ్), జనతాదళ్ (సెక్యులర్), రాష్ట్రీయ జనతాదళ్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, సమాజ్‌వాదీ పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీని ఎదిరించే క్రమంలో తాము కొత్త జాతీయ కూటమి జనతా పరివార్ లో విలీనమవుతామని ప్రకటించాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "Chandra Shekhar critical". The Hindu. 8 July 2007. Retrieved 11 December 2014.
  2. SARITHA RAI (July 31, 1993). "Ramakrishna Hegde and H.D. Deve Gowda patch up in Karnataka". India Today. Retrieved 17 August 2021.
  3. IN THE HIGH COURT OF KERALA AT ERNAKULAM present highcourt judge WEDNESDAY, THE 20TH DAY OF AUGUST 2014/29TH SRAVANA, 1936(HINDI CALENDER )Crl. MC. No 3575 of 2014(k.k.gopalakrishnan)CRL. R.P.NO. 19/2014 OF SESSIONS COURT. THIRUVANANTHAPURAM (K.K GOPALAKRISHNAN)CMP. NO 2677/2014 OF ADDL. CHIEF JUDICIAL MAGISTRATE COURT. THIRUVANANTHAPURAM
  4. "'Janata Parivar' formalised, Mulayam Singh named chief of new party". 15 April 2015.

బాహ్య లింకులు

[మార్చు]