రామన్నపేట్ (యాదాద్రి జిల్లా)

వికీపీడియా నుండి
(రామన్నపేట నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

రామన్నపేట, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా,రామన్నపేట మండలానికి చెందిన గ్రామం.[1] ఇది జనగణన పట్టణం.

ఇది సమీప పట్టణం నల్గొండకు ఉత్తరాన 36 కిలోమీటర్ల దూరంలోఉంది.రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

గణాంక వివరాలు[మార్చు]

రామన్నపేట బస్టాండు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2066 ఇళ్లతో, 10537 జనాభాతో 902 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5291, ఆడవారి సంఖ్య 5246.ఇక్కడ తెలుగు స్థానిక భాష.

సమీప మండలాలు[మార్చు]

రామన్నపేట ఏరియా వైధ్యశాల

రామన్నపేట దక్షిణాన చిట్యాల మండల్, ఉత్తర దిశగా వలిగొండ మండల్, తూర్పు వైపున నార్కేట్పల్లి మండల్, పశ్చిమాన చౌటుప్పల్ మండల్ ఉన్నాయి.

రవాణా సౌకర్యం[మార్చు]

రోడ్డు ద్వారా

సమీప పట్టణం నల్గొండ నుండి రోడ్డు మార్గం రామన్నపేట వరకు ఉంది.

రైలు ద్వారా

రeమన్నపేట్ రైల్వే స్టేషన్, చిట్యాల్ రైలు స్టేషన్లు రామన్నపేట్కు దగ్గరి రైల్వే స్టేషన్లు.సికింద్రాబాద్ జంక్షన్ ప్రధాన రైల్వే స్టేషన్ రామన్నపేట్కు 72 కిలోమీటర్ల దూరంలో ఉంది

విశేషాలు[మార్చు]

  • రామన్నపేట గ్రామంలో ఉన్న అలిసాహెబ్ హిల్స్ అనే సాంప్రదాయ రాజభవనము ఉంది.
  • రామన్నపేట్ 2009 వరకు అసెంబ్లీ నియోజకవర్గంగా కలిగి ఉంది.
  • రామన్నపేట్ నగరంలో మన్సిఫ్, జూనియర్ సివిల్ జడ్జి, అడిషనల్ అదనపు కోర్టుతో సహా ప్రతి ప్రభుత్వ కార్యాలయాలతో అన్ని ప్రాథమిక సదుపాయాలను కలిగి ఉంది. 

సాగునీటి వనరులు[మార్చు]

రామన్నపేట మండలం లో ప్రధాన సాగునీటి వనరు అయిన ఆసిఫ్ నహార్ కాలువ పారుతున్నది. ఈ కాల్వను నాటి నిజాం నవాబులు 1904 సంవత్సరంలో వలిగొండ మండలం నెమలి కాల్వ గ్రామం వద్ద మూసి నది కాల్వ పై ఆనకట్ట కట్టి కాలువను తవ్వించారు. ఈ కాలువ నీరు మొదటగా మండలంలోని ఇంద్రపాలానగరం పెద్ద చెరువు లోకి వెళ్లి అక్కడి నుండి లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నేముల, దుబ్బాక, మునిపంపుల, పల్లివాడ, ఏన్నారం గ్రామాల చెరువులను, కుంటలను నింపుతూ ప్రవహిస్తోంది. పల్లివాడ గ్రామం వద్ద మూసీ నదిపై ఆనకట్ట కట్ట నుండి వరద కాలువ ద్వారా బాచుప్పల, సూరారం, కుంకుడుపాముల, బి తుర్కపల్లి గ్రామాల మీదుగా శాలిగౌరారం ప్రాజెక్ట్ లోనికి ఈ నీరు ప్రవహిస్తోంది. ఈ కాలువల ద్వారా సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. లక్ష్మాపురం ఏటీ కాలువ ద్వారా 1890 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ కాలువ శోభనాద్రిపురం గ్రామంలోని మూసీ నది కత్వా నుండి ప్రవహిస్తూ మునిపంపుల చెరువులో కలుస్తుంది. ప్రస్తుతం ఈ కాలువ శిథిలావస్థలో ఉంది.

ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి, పాతరాచ కాల్వల నిర్మాణం పూర్తి అయితే మండలంలోని వెల్లంకి, సిరిపురం, రామన్నపేట, కోమ్మాయిగూడెం, జనంపల్లి, ఇస్కిల్ల, ఉత్తటూరు, కక్కిరేణి గ్రామాలలోని సుమారు 8వేల నుండి 10వేల ఎకరాల వరకు సాగు నీరు అందే అవకాశం ఉంది.  ప్రస్తుతం ఈ కాల్వలో మన పనులు సాగుతున్నయి.

కాలేశ్వరం కాల్వ[మార్చు]

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు నుండి గోదావరి నీరు మండలానికి రానున్నాయి. ఈ మేరకు కు అధికారులు కాలువ తవ్వకం కోసం భూ సేకరణ పనులు ముమ్మరం చేశారు. ఈ కాలువ నిర్మాణం పూర్తయితే మండలంలో మరి కొన్ని వేల ఎకరాలకు సాగు నీరుతో పాటు త్రాగునీరు అందనుంది.     

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)

వెలుపలి లంకెలు[మార్చు]