నేపాల్: కూర్పుల మధ్య తేడాలు
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 161: | పంక్తి 161: | ||
== భక్తా పూర్ == |
== భక్తా పూర్ == |
||
[[దస్త్రం:In the kings palace in bhaktapur at Nepal.JPG| |
[[దస్త్రం:In the kings palace in bhaktapur at Nepal.JPG|thumb|right|నేపల్ లో భక్తఫూర్ లో ఒక ఆలయం]] |
||
నేపాల్ దేశంలో భక్థాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ రాజధాని నగరం లో చూడ వలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు అనేకం వున్నాయి. పశుపతి నాద్ ఆలయాన్ని పోలిన ఆలయం కూడ ఇక్కడ వున్నది. అలాంటి దేవాలయాలు అనేకం వున్నాయి . కాని అన్ని శివాలయాలె. రాజ దర్బారు హాలు చాల గంబీరంగ వుంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి వున్నది. ఇది ఆలయం లాగ కాకుండ నివాస గృహం లాగ వుంటుంది. ఆ ఆలయాన్ని కేవలం దసరా సందర్బంలో మాత్రమె తెరుస్తారు. లోన అత్యంత సంపద వున్నట్లు స్థానికులు చెపుతారు. గర్బ గుడిలోనికి వెళ్లనీకున్నా పరిసర ప్రాంతాలను చూడ వీలున్నది. ఈ ప్రాంతం లోని కట్టడాలు అతి మనోహరంగా వున్నవి. |
నేపాల్ దేశంలో భక్థాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ రాజధాని నగరం లో చూడ వలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు అనేకం వున్నాయి. పశుపతి నాద్ ఆలయాన్ని పోలిన ఆలయం కూడ ఇక్కడ వున్నది. అలాంటి దేవాలయాలు అనేకం వున్నాయి . కాని అన్ని శివాలయాలె. రాజ దర్బారు హాలు చాల గంబీరంగ వుంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి వున్నది. ఇది ఆలయం లాగ కాకుండ నివాస గృహం లాగ వుంటుంది. ఆ ఆలయాన్ని కేవలం దసరా సందర్బంలో మాత్రమె తెరుస్తారు. లోన అత్యంత సంపద వున్నట్లు స్థానికులు చెపుతారు. గర్బ గుడిలోనికి వెళ్లనీకున్నా పరిసర ప్రాంతాలను చూడ వీలున్నది. ఈ ప్రాంతం లోని కట్టడాలు అతి మనోహరంగా వున్నవి. |
||
10:00, 29 ఆగస్టు 2012 నాటి కూర్పు
नेपाल Nēpāl నేపాల్ |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం जननी जन्मभूमिष्च स्वर्गादपि गरीयसी (సంస్కృతం: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి) |
||||||
జాతీయగీతం రాష్ట్రీయ గాన్ |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | ఖాట్మండు 27°42′N 85°19′E / 27.700°N 85.317°E | |||||
అధికార భాషలు | నేపాలి | |||||
ప్రభుత్వం | ట్రాన్సీషనల్ | |||||
- | రాజు ప్రధాన మంత్రి |
Gyanendra Girija Prasad Koirala |
||||
Unification | ||||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 147,181 కి.మీ² (94th) 56,827 చ.మై |
||||
- | జలాలు (%) | 2.8 | ||||
జనాభా | ||||||
- | July 2005 అంచనా | 27,133,000 (42nd) | ||||
- | 2002 జన గణన | 23,151,423 | ||||
- | జన సాంద్రత | 196 /కి.మీ² (39th) 508 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $42.17 billion (81st) | ||||
- | తలసరి | $1,675 (152nd) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) | 0.526 (medium) (136th) | |||||
కరెన్సీ | రూపాయి (NPR ) |
|||||
కాలాంశం | NPT (UTC+5:45) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+5:45) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .np | |||||
కాలింగ్ కోడ్ | +977 |
హిమాలయాలలో ఉన్న నేపాల్ రాజ్యము, 2006 నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యము. ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉన్నది. ఇది ఒక భూపరివేష్టిత దేశం (landlocked country)
చరిత్ర
నేపాల్కి వెయ్యి సంవత్సరాల పెద్ద చరిత్ర ఉంది. కిరాంత్ లేదా కిరాతి అనేది 7వ లేక 8వ శతాబ్దములలో తూర్పు నుండి వలస వచ్చిన మరియు చరిత్రకారులకు తెలిసిన మొదటి తెగ. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము 563లో నేపాల్లోనే జన్మించాడు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో అశోకుడు కూడా ఉత్తర భారతదేశంతో బాటు ఇప్పటి నేపాల్లోని దక్షిణ ప్రాంతాలను(హిమాలయ పర్వత ప్రాంతాలు అశోకుని సామ్రాజ్యంలో లేవు) పరిపాలించాడు. క్రీస్తు శకం 200కల్లా బౌద్ధ సామ్రాజ్యాన్ని హిందువులు అంతమొందించి లిక్కావి వంశ పరిపాలనను ప్రారంభించారు.
900వ సంవత్సరంలో లిక్కావి వంశాన్ని పారద్రోలి ఠాకూర్లు, వారిని పారద్రోలి మల్లులు పరిపాలనకు వచ్చారు. వాళ్ళే 18వ శతాబ్దం వరకూ పాలించారు. 1768లో ప్రిథ్వి నారాయణ్ షా అనే గూర్ఖా రాజు ఖాట్మండును ఆక్రమించుకున్నాడు. 1814లో నేపాల్ ఇంగ్లీషు వారితో యుద్ధం చేసింది(ది ఆంగ్లో నేపాలీస్ వార్). 1816లో సుగౌలి సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఇంగ్లీషు వారికి సిక్కింను, దక్షిణ భాగాలను ఇచ్చివేయడంతో ఇంగ్లీషు వారు వెనుదిరిగారు. కానీ 1857లో భారత దేశంలోని సిపాయిల తిరుగుబాటును అణచివేయడంలో ఇంగ్లీషు వారికి సహాయపడినందుకుగాను ఇంగ్లీషువారు దక్షిణ ప్రాంతాలను తిరిగి ఇచ్చివేశారు.
షా వంశాన్ని 1846లో జంగ్ బహద్దూర్ రాణా అంతమొందించి దేశ పరిపాలనను తన చేతిలోకి తీసుకున్నాడు. దీనికోసం అతడు దాదాపు కొన్ని వందల మంది రాకుమారులను, తెగల నాయకులను అంతమొందించాడు (దాన్నే కోట్ ఊచకోత అంటారు). 1948వ సంవత్సరము వరకూ రాణాలు వారసత్వ ప్రధాన మంత్రులుగా నేపాల్ను పరిపాలించారు. ఎప్పుడైతే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందో త్రిభువన్ అనే క్రొత్త రాజు నేపాల్ పాలనకు రావడానికి భారతదేశం సహాయపడింది. నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా సహాయపడింది. రాజు త్రిభువన్ కుమారుడైన రాజు మహేంద్ర ప్రజాస్వామ్య ప్రయోగాన్ని, పార్లమెంటును రద్దు చేసి పార్టీలు లేని పంచాయితీ పద్ధతి ద్వారా నేపాల్ని పరిపాలించాడు. అతని కుమారుడు బీరేంద్ర సింహాసనాన్ని అధిరోహించాడు. అతను కూడా 1989 వరకూ పంచాయితీ పద్ధతినే అనుసరించాడు. కాని ప్రజా ఆందోళన తర్వాత బలవంతంగా రాజ్యాంగ మార్పులను ఆమోదించాడు. 1991 మే నెలలో దాదాపు యాభై సంవత్సరాల తరువాత నేపాల్లో ఎన్నికలు జరిగాయి. నేపాలి కాంగ్రెస్ పార్టీ, కమ్మూనిస్ట్ పార్టీలకు ఎక్కువ వోట్లు దక్కాయి. ఏ పార్టీ కూడా రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పరిపాలించలేక పోయాయి. అందుకు కారణంగా ప్రజోపయోగ కార్యక్రమాలలో మార్పు లేకపోవటం, అవినీతి రోగంలాగా మారటాన్ని చూపిస్తారు.
ఫిబ్రవరి 1996లో మావోయిస్టు పార్టీ ప్రజాస్వామ్యాన్ని మార్చి సామ్యవాదాన్ని స్థాపించడం కోసం విప్లవాత్మక ధోరణిని ఎంచుకొని ప్రజా యుద్ధాన్ని ప్రారంభించింది. అదే ఆ తర్వాత అంతర్యుద్ధంగా మారి 10 వేల మంది మరణానికి దారితీసింది.
నేపాల్ ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2001, జూన్ 1 నాడు సింహాసన వారసుడు దీపేంద్ర తన ప్రేమను ఒప్పుకోలేదని రాజభవనంలో రాజు బీరేంద్రను, రాణి ఐశ్వర్యను, తమ్ముడిని, చెల్లెల్ని, ఇద్దరు బాబాయిలను, ముగ్గురు పిన్నులనూ కాల్చి చంపేశాడు. తర్వాత తనూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నడు. అతడు కోమాలో ఉన్నా సంప్రదాయం ప్రకారం అతడ్ని వైద్యశాల పడక పైనే రాజుగా ప్రకటించారు. అతడు మూడు రోజుల తరువాత మరణించాడు.
అతని మరణం తరువాత బీరేంద్ర తమ్ముడు అయిన జ్ఞానేంద్రను జూన్ 4న రాజుగా ప్రకటించారు. వెంటనే అతను రాజ్యంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. మావోయిస్టులతో యుద్ధానికి నేపాల్ సైన్యాన్ని రంగంలోకి దించాడు.
విభాగాలు
నేపాలును మొత్తం 14 ప్రాంతీయ విభాగాలు గా విభజించినారు. భాగమతి, భేరి, ధావలగిరి, గండకి, జానక్ పూర్, కర్నలి, కోషి, లుంబిని, మహాకాళి, మేచి, నారాయణి, రప్తి, సగర్మత, సేతి
భౌగోళికం మరియు వాతావరణం
నేపాల్, భారత్ మరియు చైనా మధ్యలో భౌగోళికముగా బంధింపబడి ఉన్నది. మొత్తం 1,47,181 చ.కి.మీ. వైశాల్యములో విస్తరించి ఉన్నది. అందులో 56,827 చ.మై. భౌగోళిక వైవిధ్యమున్నప్పటికీ పర్వతాలతో నిండి ఉన్నది. అడ్డంగా మూడు వైవిధ్య భౌగోళిక స్వరూపాలు ఈ దేశంలో ఉన్నాయి. దక్షిణాన లోతట్టు ప్రాంతము, మధ్యన చిన్న పర్వతాలతో ఉన్న ప్రాంతము, ఉత్తరాన హిమాలయాలతో(ఎవరెస్టు, ఇతర ఎత్తైన శిఖరాలతో) కూడిన అతి ఎత్తైన ప్రాంతము (8,850 మీ లేదా 29,035 అడుగులు). మొత్తము నేపాల్లో 20% భూమి మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది. అడవుల కొట్టివేత కూడా ఒక ముఖ్య సమస్య.
ఎవరెస్టు శిఖరము
ఈ శిఖరము ప్రపంచములోనే ఎత్తైనది. దీనిని నేపాలీలో 'సాగరమాత' అనీ, టిబెట్ భాషలో 'ఖోమోలోంగ్మ' అనీ పిలుస్తారు. ఇది నేపాల్-ఛైనా సరిహద్దులో ఉన్నది. సమున్నతమైన ఎవరెస్టు శిఖరము, హిమాలయ పర్వత సానువులతో బాటు ప్రపంచములో 8000 మీ. దాటిన పది ఎత్తైన శిఖరాలలో ఎనిమిది నేపాల్లోనే ఉన్నాయి. ఇవి పర్యాటకులకు ముఖ్య ఆకర్షణ. వీటిని ప్రకృతి వింతలుగా చెప్తారు. నేపాల్లో ఐదు వాతావరణ ప్రాంతాలు ఎత్తుల వారీగా ఉన్నాయి. దక్షిణాన సమశీతోష్ణ మండలము మొదలుకొని చల్లని వాతావరణము, ఉత్తరాన అతిశీతల ప్రదేశాల వరకూ ఉన్నాయి. వర్షపాతం వివిధ ఋతువులలో ఋతుపవనాల పై ఆధారపడి వివిధ రకాలుగా ఉంటుంది. ఆ వర్షపాతమే మొత్తము సంవత్సర వర్షపాతములో 60-80% మేర ఇస్తుంది. సంవత్సరానికి తూర్పున 2500 మి.మీ., పశ్చిమాన 1000 మి.మీ., 1420 మి.మీ. ఖాట్మండు చుట్టుపక్కలా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఇది 4000 మి.మీ. దాకా, కొన్ని సార్లు 6000 మి.మీ. దాకా కూడా ఉండవచ్చు. ఋతుపవనాలు మంచి ఊపు మీద ఉన్నప్పుడు వర్షపాత వివరాలు. (జులై-ఆగస్ట్).
దదెల్ధురా: | 350 mm |
నేపాల్ గన్జ్: | 510 mm |
బుట్వల్: | 715 mm |
పోఖర: | 920 mm |
ముస్తాన్గ్: | 60 mm |
ఖాట్మండు: | 370 mm |
చైన్పుర్: | 320 mm |
నమ్ఛె బజార్: | 220 mm |
ఆర్థికవ్యవస్థ
ప్రభుత్వము మావోయిస్టుల మధ్య నిరంతరము జరిగే గొడవలు, తగవులు, చిన్న అంతర్యుద్ధముల వల్ల నేపాల్ ఆర్థికముగా పతనము చెందినది. ప్రపంచములోని అత్యంత పేద దేశాలలో నేపాల్ ఒకటి, కానీ ఆర్థికంగా ఓ ప్రబల శక్తిగా మారుటకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న దేశము, కానీ సరైన నాయకత్వం లోపం చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. సేవలు, వ్యవసాయం దీని ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. సుమారుగా 80% జనాభా, 41% స్థూల జాతియాదాయం ఈ రెండు రంగాల నుండే వస్తుంది. పారిశ్రామికీకరణ కేవలం వ్యవసాయాధార పరిశ్రమలయిన నార (jute), చక్కర, పొగాకు, ఆహార పంటలకు మాత్రమే పరిమితం అయినది. వస్త్ర ఉత్పత్తి, కార్పెట్ల తయారీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది, గత మూడు సంవత్సరాలలో ఇవి రెండూ దేశ విదేశీ మారక ద్రవ్య సంపాదనలో 80% ఆక్రమించినాయి. పారిశ్రామికాభివృద్ది చాలా వరకూ కాట్మండు లోయ చుట్టుపక్కల, మరియూ భిరత్ నగర్, బిర్గంజ్వంటి నగరాలలోనే జరిగినది. వ్యవసాయాభివృద్ది 5%, వార్షిక జనాభావృద్ది 2.3%గా ఉన్నది.
1991 నందు ప్రభుత్వము ఆర్థిక సరళీకరణల ద్వారా వ్యాపారాన్ని, విదేశీ సంస్థాగత ముదుపుదారులని ప్రోత్సహించడంద్వారా, ఆర్థికాభివృద్ది చాలా త్వరగా సాధించుదామని మొదలుపెట్టినది. కానీ రాజకీయ అస్థిరత్వం వల్ల, ఎక్కువగా వృద్ది సాధించలేక పొయినది. ముఖ్యముగా జల విద్యుత్తు, పర్యాటక రంగములలో అభివృద్దికి బాటలు పరచినది. కానీ చిన్న ఆర్థికవ్యవస్థ, రాజకీయ అస్తిరత్వం, సహజ దుర్ఘటనలు (?), సాంకేతికపరంగా వెనకబడి ఉండటం వల్ల, చైనా భారత దేశాల మధ్య భౌగోళికంగా చిక్కుకొని పోవడం వల్ల ఎక్కువగా పెట్టుబడులు రాలేదు, కానీ ఇప్పటికీ తన అభివృద్ధి బడ్జెటులో 80%, మొత్తం బడ్జటులో 28% విదేశీ పెట్టుబడులే ఆక్రమించినాయి.
జనగణన వివరాలు,స॰స్కృతి
నేపాలు బహు భాషా, బహు మత, బహు జాతులు గల సమాజం. ఈ క్రింద ఇవ్వబడిన లెక్కలు 2002 నేపాలు జన గణన నుండి ఇవ్వబడినది. [1]
భాషలు
నేపాల్కి వైవిధ్య భరితమైన భాషా సంస్కృతి ఉంది. అది మూడు భాషా సముదాయాల నుండి ఏర్పడింది. 1.ఇండో-ఆర్యన్, 2.టిబెటో-బర్మన్, 3.దేశీయమైన. 2001 జాతీయ లెక్కల ప్రకారం నేపాల్లో మొత్తం 92 వివిధ భాషలు మాట్లాడతారు(93వ దాన్ని ఉన్నాగుర్తించలేకపోయారు). మాతృభాషగా నేపాలీలు మాట్లాడేది జనాభా శాతం ప్రకారం నేపాలి (49%), మైథిలి (12%), భోజ్ పురి (8%), థారు (6%), తమంగ్ (5%), నేవారి లేదా నేపాల్ భాష (4%), మగర్ (3%), అవధి (2%), బంటవ (2%), లింబు (1%), బజ్జిక (1%). మిగతా 81 భాషలు మాతృభాషగా 1% కన్నా తక్కువ మంది మాట్లాడతారు.
అధికార భాష దేవనాగరి లిపిలో వ్రాయబడే నేపాలి భాష. వివిధ భాషలు మాట్లాడే నేపాలీలందరికీ, ఈ భాష భాషా మాధ్యమంగా ఉపయోగపడుతున్నది. దక్షిణ తెరాయ్ లేదా 5-10 మైళ్ళ వెడల్పు ఉన్న నేపాల్ భారత సరిహద్దు ప్రాంతంలో హిందీ కూడా మాట్లాడతారు.
మతములు
అధికారికంగా నేపాల్ ప్రపంచంలో ఏకైక హిందూ దేశము. కానీ దీర్ఘ కాలంగా అక్కడి చట్టాలు బలవంతపు మత మార్పిడులను, అన్య మత విద్వేషాన్ని అడ్డుకుంటున్నాయి. 2001 లెక్కల ప్రకారం 80.6% మంది హిదువులు, 11% మంది బౌద్ధులు. కాని ఇరు మతాల వాళ్ళూ ఇరు మతాల సాంప్రదాయాలనూ, ఆచారాలనూ, సమానంగా ఆచరిస్తారు. ఇంకా 4.2% మంది ముస్లింలు, 3.6% మంది కిరాంతులనబడే వాళ్ళూ, 0.5% మంది క్రైస్తవులూ ఉన్నారు. వీరి సంఖ్య 2005కు 6లక్షలకు పెరిగింది.
నేపాల్ పర్యటన
ప్రపంచంలో అత్యదికంగా పర్యాటకులను ఆకర్షించే దేశాలలో నేపాల్ ఒకటి. దీనికి కారణాలు అనేకం. అక్కడి ప్రకృతి రమణీయత కావచ్చు., హిందు మతస్తులకు, బౌద్ద మతస్తులకు సంబందించిన అత్యున్నతమైన కేంద్రాలు కావచ్చు., ట్రెక్కింగు, రాప్టింగు వంటి సాహస క్రీడలకి ముఖ్య కేంద్రం కావచ్చు, ముఖ్యంగా అక్కడి ప్రజల స్నేహ పూరిత స్వభావం కావచ్చు. ఆకాశాని తాకుతున్నాయా అన్నట్టున్న హిమాలయాలు, పాతాళ లోకం లో వున్నాయా అన్నట్టున లోయలు, నదులు, సెల యేళ్లు, జలపాతాలు, హిందువులకు అత్యంత పవిత్రమైన ఆద్యాత్మిక కేంద్రాలు, ఆలయాలు, భౌద్దులకు అతి పవిత్రమైన ప్రార్థనా మందిరాలు ఇలా కారణాలేవైనా నేపాల్ దేశం పర్యాటకులకు నయనాందకరం చేసే దేశం.
ప్రపంచంలో వున్న ఏకైక హిందు సామ్రాజ్యం
మొన్నటి దాక రాజుల పరిపాలనలో వున్న నేపాల్ దేశం ప్రపంచంలో వున్న ఎకైక హిందు రాజ్యం. భారత దేశానికి ఉత్తరాన ఆనుకునే వున్న ఈ దేశంలోనికి అడుగు పెట్టాలంటే భారతీయులకు ఎటువంటి పాస్ పోర్టు / వీసా / ఎలాంటి అనుమతి పత్రాలు అవసరం లేదు. వాహనాలకు మాత్రం కొంత రుసుము తీసుకొని అనుమతిస్తారు. అదే విధంగా భారతీయులు నేపాల్ లో స్థిరాస్తులు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. అందుకనే నేపాల్ లో వున్న పెద్ద పెద్ద హోటల్ల వ్యాపారం భారతీయుల చేతిలోనె వున్నది. ఇదంతా నేపాల్ --- భారత దేశాల మద్య కుదుర్చు కున్న ఒప్పందం ప్రకారం జరుగు తున్నది. ఈ దేశంలో వున్న మొత్తం జనాబాలో ఎనబై శాతం హిందువులు. తక్కిన ఇరవై శాతంలో భౌద్దులు, ముస్లింలు, క్రిచ్చియన్లు వున్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయాలు ఇక్కడున్నాయి. అలాగె భౌద్దులకు అత్యంత పవిత్రమైన ప్రార్థనా స్థల్లాలు ఇక్కడున్నాయి. హిందువులు, భౌద్దులు కలిసే వుంటారు.
ద్రవ్యము (కరెన్సి)
నేపాల్ లోని ద్రవ్యము ను కూడ రూపాయి అంటారు. భారత్ రూపాయిని ఐ.ఆర్ అని నేపాల్ రూపాయిని ఎన్.ఆర్. అని అంటారు. ద్రవ్య మారకానికి చాల చోట్ల అవకాశం వున్నది. కాని నేపాల్ లోని ప్రతి దుకాణంలోను, ఇతర ప్రదేశాలలోను భారత్ రూపాయిని తీసుకుంటారు. భారత్ రూపాయలు వందకు నేపాల్ రూపాయలు నూట అరవై ఇస్తారు. చిన్న నాణేలు అనగా పైసలు కూడ అక్కడ చలామణి లోవున్నాయి. భారత రూపాయి మారకానికి అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
ప్రవేశ ద్వారాలు
భారత్ భూబాగంతొ కలిసి వున్న నేపాల్ లోనికి ప్రవేశించ డానికి చాల భూమార్గాలున్నాయి. అన్నింటి లోకి ఘోరక్ పూర్ వద్ద వున్న మార్గమే ప్రధాన మైనది. ఈ భార్డర్ లో ఇరువైపుల కలిసి వున్న గ్రామం పేరు సునౌలి ఇక్కడ అసాధరాణమైన భద్రతా ఏర్పాట్లేమి వుండవు. అక్కడి స్థానిక ప్రజలు మామూలుగానె అటు ఇటు తిరుగు తుంటారు. భారతీయులు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నేపాల్ భూభాగం లోకి ప్రవేశించ వచ్చు. కాని వాహనాలకు కొంత రుసుం కట్టితే లోనికి అనుమతిస్తారు. అలా నేపాల్ లోనికి ప్రవేసించిన వాహనాలు ఆ దేశంలో ఎక్కడైనా తిరగ వచ్చు. సరిహద్దు వద్ద నేపాల్ భూబాగం లోనికి ప్రవేశించిన పర్యాటకులకు సేద దీరడానికి, కాల కృత్యాలు తీర్చు కోడాని అనేక ఏర్పాట్లుంటాయి. నేపాల్ భూబాగంలోనికి ప్రవేశించగానె ప్రత్యేకంగా కనుపించే విషయ మేమంటే. ఇంకా తెల్ల వారకముందే అక్కడున్న చిన్న చిన్న అన్నశాలలు, సత్రాలు , బడ్డి కొట్టులు అన్ని తెరిచే వుంటాయి. ఆ దుఖాణాల ముందు ఒక మేజా బల్ల వేసి దానిపై మద్యం సీసాలు పెట్టి వుంటారు. మందు బాబులు కూడ అప్పటికప్పుడు తమ పని కానిచ్చుకొని వెళు తుంటారు. మద్యంపై ఇక్కడ ఎటువంటి నియంత్రణ లేదు.
గ్రామాలు పంట పొలాలు
సరిహద్దు నుండి కొంత దూరమె మైదాన ప్రాంతం. అక్కడక్కడ పల్లెలు పంట పొలాలు వుంటాయి. ఇక్కడ వరి ప్రధాన పంట. ఆ వరి చాల ముతక రకం. వ్వవసాయం సాంప్రదాయ పద్దతిలోనె జరుగు తున్నది. కొండ వాలున కొన్ని అడుగుల వెడల్పున చదును చేసి అక్కడే వరి పండిస్తుంటారు. ఆ పొలాలు చూడ్డానికి చాల అందంగా కనబడుతుంటాయి. కొండలకు అందమైన మెట్లు చెక్కారా అని అనిపిస్తుంది. అటు వంటి కొండల పాద భాగన మంచి పారుతున్నా అది కొన్ని వందల అడుగుల లోతులో వున్నందున ఆ నీటిని పొలాలకు పారించ లేరు. కొండల పైనుండి జారు వారె నీటి దారలే ఈ పంటలకు జల వనరులు. ఇటు వంటి నీటి దారలు చిన్నచిన్నవి చాల ఎక్కువ. కొన్ని పెద్ద పెద్ద జల ధారలు వుంటాయి అవి జలపాతాల లాక కనబడుతుంటాయి. ఈ కొండలలో ప్రజలు అన్ని రకాల కూరగాయలు, పండ్లు కూడ పండిస్తుంటారు. పల్లెలు చాల పలుచగా వుంటాయి. ఇళ్లు దూర దూరంగా వుంటాయి. కొన్ని చోట్ల పొలాల మద్యలోనె ఇళ్లుంటాయి. ప్రతి ఇంటి ముందు బంతి పూల చెట్లుంటాయి. రోడ్లు విశాలంగా వున్నా అక్కడ తిరిగే వాహనాలు చాల పాతవి. జీపుల్లాంటి డొక్కు వాహనాలు, రిక్షాలు మొదలగునవి ప్రయాణ సాధనాలు.
ఘాట్ రోడ్డు
నేపాల్ దేశం కొండలమయమైనందున అక్కడ రోడ్డులన్ని ఘాట్ రోడ్డులే. కొండ వాలులో రోడ్డుకు సరిపడినంత మేర చదును చేసి కొడ వాలు వెంబడి వంకర టింకరగా మెలికలు తిరుగు తూ రోడ్లుంటాయి. బస్సులో వెళు తుంటే ఒకవైపు ఆకాశం అంతెత్తున్న కొండలు, మరొక వైపున పాతాళం కనిపిస్తున్నదా అన్నంత లోతున ప్రవహిస్తున్న నది ఇలా వందలాది మైళ్ల పర్యంతం కనబడుతూనె వుంటుంది. లోయలో ప్రవహిస్తున్న నదిలొ అతి శుబ్రమైన నీరుంటుంది. ఆనది కూడ అనేక మలుపులు తిరుగుతూ ఎగుడు దిగుడుగా నురగలు కక్కుతూ ప్రవహిస్తుంటుంది. ఆ నదిలో రాళ్లన్ని అతి నును దేలి కాలు పెడితే జారిపోయేటట్లుంటాయి. వాటినే సాలగ్రాం లంటారు. నదులు చిన్నవైనా అవి అతి వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ నదులలో సాహసికులు ప్రత్యేక బట్టలు వేసుకుని తలకు టోపి పెట్టుకొని రబ్బరు బోట్ల లో పోటి పడుతుంటారు. కొండ వాలులో బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఇదొక ఆనంద కరమైన దృశ్యం. రోడ్డు ప్రయాణికులకు టీ, కాపి, అల్పాహారం అందించడానికి అక్కడక్కడా చిన్న చిన్న జనవాసాలుంటాయి. అక్కడే సాహసిక క్రీడలైన రాప్టింగ్ (నదిలో రబ్బరు బోట్ల పోటీ) ట్రెక్కింగ్ ( తాళ్ల సాయంతో కొండలనెక్కే సాహస క్రీడ) లకు కావలసిన సామాగ్రిని అద్దెకిచ్చే దుకాణాలుంటాయి. ఇటు వంటి నివాస ప్రాంతాలలో కూడ నీటి వసతికి నది అత్యంత లోతులో నున్నందున దానిపై ఆదార పడకుండా కొండలపై నుండి జాలువారె జల దారలకు పైపు తగిలించి వారి అవసరాలకు వాడు కుంటారు. ఈ రోడ్డు పై ప్రయాణించే ప్రయాణికులకు మరొక ఆచ్యర్య పరిచే వినోదం మరొకటి కను విందు చేస్తుంది. అవతిలి కొండ వాలులో పంటలు పండించే రైగులు ఇవతల నుండి నదిని దాటి అటు పక్కకు వెళ్లాలంటే. కొన్ని వందల అడుగుల లోతు కు దిగి అతి వేగంగా ప్రవహించే నదిని దాటి తిరిగి ఆ కొండ నెక్కి తమ పొలాలకు వెళ్ళాలి. ఆ నది చిన్నదే అయినా అతి వేగంగా ప్రవహిస్తుంటుంది. అందులోని రాళ్లు అతి నునుపుగా కాలు జారేటట్టుంటాయి. ఇటు వంటి ప్రమాదాన్నుండి తప్పించు కోడానికి వారు ఒక ఉపాయం కనిపెట్టారు. ఇవతల కొంత దిగువన ఒక బలమైన స్థంబాన్ని పాతి దానికి సమానాంతరంగ నదికి అవతిలి వైపున కూడ ఇలాంటి స్థంబన్ని పాతి ఈ రెండు స్థంబాలను ఒక బలమైన ఇనుప మోకుతో అనుసందానిస్తారు. పైన చక్రాలు కట్టిన ఊయాల లాంటి ఒక పెద్దబుట్టను ఆ ఇనుప మోకుకు తగిలించి ఆ బుట్టలో కూర్చొని తమ చేతులతో ఆ ఇనుప మోకును తమవైపుకు లాగుతూ వుంటే తాము కూర్చున్న ఆ బుట్ట ముందుకు సాగి అవతలి గట్టుకు చేరు కుంటారు. ఇది ఎంతో సాహసంతో కూడిన ప్రమాదకరమైన పనిగా అనిపిస్తుంది. ఇటువంటి సాహసాలు దారి పొడుగునా కనబడుతూనె వుంటాయి. ఒక్కోచోట కేవలం ఒక మనిషే కోతిలాగ ఆ ఇనుప తాడును పట్టుకొని అవతలికి వెళ్లే సందర్బాలు కూడ చూడొచ్చు. ఇలా ఎన్నో ప్రమాద భరితమైన సాహాసాలు చూస్తు ప్రయాణిస్తున్న బస్సు ప్రయాణికులలు కూడ అత్యంత ప్రమాదం పొంచి వుంటుంది. అదేమంటే వర్షాకాలంలో కొండ చెరియలు విరిగితే అవి ఖచ్చితంగా ఆ రోడ్డు పైనే పడతాయి. వాహనాలపై పడితే ఇక చేయగలిగింది ఏమీలేదు. ఖాళీ రోడ్డు పడినా వాటిని తొలిగించేంత వరకు వారి ప్రయాణం వాయిదా పడాల్సిందే.
పోక్రా లో దేవి జలపాతం
నేపాల్ లోని ముఖ్యమైన పట్టణాలలో పోక్రా ఒకటి. ఇది అతి చిన్న పట్టణం. కొండ కోనల్లో కట్టిన ఇళ్లతో అందంగా కనబడు తుంది. ఈ పట్టణానికి ప్రాముఖ్యతను ఆపాదించడానికి మరొక కారణమున్నది. అది పట్టణానికి అల్లంత దూరంలో మంచు తొ కప్పబడిని హిమాలయా పర్వతాలు. వెండి కొండలవలె ప్రకాసిస్తున్న ఆ హిమాలయాలను దగ్గర నుండి చూడ డానికి విమాన ప్రయాణాన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ చిన్న విమానాలలొ హిమాలయాలకు కొంత దగ్గరికి వెళ్లి తిరిగి వస్తాయి. ఈ పట్టణాన్ని స్విజ్డర్ లాండుతో పోలుస్తారు. దీనికి ఆసియాలోని స్విజ్డర్ ల్యాండు అని అంటారు. హిమాలయాల అందాలను చూడ డానికి మంచి సమయం సూర్యోదయానికి కొంత ముందు దాని తర్వాత కొంత సమయం. ఆ సమయానికి పర్యాటకులు తాము బస చేసిన భవనాల పైకెక్కి హిమాలయాల అందాలను తిలకిస్తుంటారు. సూర్యోదయానికి ఇంకా కొన్ని నిముషాలుందనగా ఆకాశం ఎర్ర బడుతుంది. ఆ కాంతిలో ఆ మంచు కొండలు బంగారు కాంతి తో మెరిసి పోతుంటాయి. ఆ బంగారు కాంతి పొద్దెక్కే కొద్ది రంగు మారి వెండి కొండ వలే వెలుగు లీనుతుంది. ఆదృశ్యం అత్యంత నయానంద కరం. ఈ పట్టణంలో మరొక వింత దేవి జలపాతం. సాధారణంగా జలపాతాలను క్రింద నుండి పైకి చూసారు. కాని ఈ జలపాతాన్ని పైనుండి క్రిందికి చూడాలి. అంటే కొండ పైకెక్కి చూడాలని కాదు. భూమి పైనుండే విశాలమైన బావిలోనికి చూడాలి. ఆ బావి చుట్టూ ప్రమాద నివారణ కొరకు ఇనుప పట్టీలతో కంచె ఏర్పాటు చేశారు. దాని అంచున నిలబడి బావి లోనికి చూడాలి. లోపల బావి దరి లోనుండి అతి పెద్ద జల ప్రవాహం వచ్చి చాల లోతున్న బావిలోనికి పడుతుంది. ఆ ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. పర్యాటకులు నిలబడిన భూమి క్రింద సుమారు ఇరవై అడుగుల లోతోలొనుండి వచ్చి బావిలోనికి పడుతుంది. ఈ జలంతో ఆ బావి నిండి పోదు. ఆ వచ్చిన నీరు ఎలా వచ్చాయో అదేవిదంగా భూమి లోపలికి వెళ్లి పోతాయి. అవి ఎక్కడ బయట పడతాయో. ఈ వింత జలపాతం పోక్రా పట్టణం మద్యలోనె వున్నది. పోక్రా కు దిగువన కొంత మైదాన ప్రాంతమున్నది. అక్కడ వరి పంట పొలాలు ఎక్కువగా వున్నాయి. అల్లంత దూరంలో వున్న మంచు కొండల నుండి మంచు కరిగి వచ్చే నీరె వీరిపంటలకు సాగునీరు. ఆ నీరు అనేక చిన్న చిన్న కాలువగుండా స్వచ్చంగా ప్రవహిస్తుంటుంది. ముక్తి నాద ఆలయం.
హిందువులు పవిత్రంగా బావించే నూట ఎనిమిది వైష్ణవ దివ్య దామాలలో ముక్తి నాద ఆలయం 106 వది. పోక్రానుండి ముక్తి నాద్ ఆలయానికి వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. అంతా గతుకుల బాట. చిన్న చిన్న విమానాలు నడుపుతుంటారు. అవికూడ వాతవరణం సరిగా లేకుంటే నడపరు. వాటిలో వెళ్లినా ఆ తర్వాత కూడ కొంత దూరం కాలి నడకన వెళ్లాల్సిందె. ఇది చాల కష్టతరమైన దారి ప్రయాసతో కూడు కున్న పని. ముక్తి నారాయణుడు స్వయంబువు. పద్మాసనంలో కూర్చొన్నట్లున్న మూర్తి. ఇక్కడ నూట ఎనిమిది దారలలో నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లను నెత్తిన చల్లు కుంటే నూట ఎనిమిది దివ్యదామాలు దర్శించు కున్నంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మిక.
== మనసులో అనుకొన్న కోరికలు తీర్చే మనోకామన ==
పోక్రా నుండి [[ఖాట్మండు కు పోయే దారిలో ఈ మనో మామని ఆలయం ఒక పెద్ద కొండపై వున్నది. బస్సు రోడ్డు కానుకొని త్రిశూల్ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడ నది లోనికి దిగ గలిగినంత లోతులోనె వున్నది. నదికవతల రెండు మూడు కొండలకవతల ఒక కొండపై మనో కామిని ఆలయం వెలసి వున్నది. అక్కడికి వెళ్లడానికి రోప్ వే" ఏర్పాటు వున్నది. ఆ రోప్ కారులో వెళుతుంటే ఆదృశ్యం . క్రింద నది, లోయలు, కొండ వాలులో పంటలు చాల మనోహరంగా వుంటుంది. గతంలో ఈ ఆలయానికి వెళ్ల డానికి మెట్ల దారి వున్నట్లు తెలిపే మెట్ల వరుసలు ఇప్పటి కనబడతాయి. ఈ రో ప్ కారులో మనుషులతో బాటు గొర్రెలు కూడ వెళుతుంటాయి. కొండ కొసన పెద్ద ఆలయం వున్నది. ఇది పగోడ పద్దతిలో వున్నది. ఈ ఆలయంకొరకు వెలసినదే ఇక్కడున్న చిన్న గ్రామం. ఇక్కడి పూజారులను పండితులు అంటారు. వారు భక్తులను దేవి చుట్టు కూర్చో బెట్టి పూజ చేయిస్తారు. చివరన పూలు ప్రసాదం ఇస్తారు. ఇక్కడి అమ్మవారు భక్తుల మనసు లోని కోరికలు తెలుసుకొని వాటిని నెరవేరుస్తుందని భక్తుల నమ్మిక. ఈ ఆలయ ప్రాంగణంలో పావురాలు ఎక్కువగావున్నాయి. వాటికి గింజలను మేతగా వేస్తారు. ఇది చాల పురాతన ఆలయం. ఈ ఆలయం వెనుక ఒక జంతు వధ శాల వున్నది. ఇక్కడ తరచు దేవి కొరకు జంతు బలులు ఇస్తుంటారు. ఈప్రాంతం అంతా రక్త సిక్తంగా వుంటుంది. ఆ జంతువులు అనగా గొర్రెలు కూడ రోప్ కార్లలో రావలసిందే. ఇక్కడ చిన్న చిన్న హోటళ్లు వున్నాయి. అందులో ప్రతి టేబుల్ ముందు మద్యం బాటిళ్లు పెట్టి వుంటాయి. ఈ కొండ పై నుండి సుదూరంలో మంచు తో కప్పబడిని హిమాలయాలు కనబడు తుంటాయి.
ఖాట్మండు
ఖాట్మండు నగరం కొండల మద్యన మైదాన ప్రాంతంలో వున్నది. ఇది ఈ దేశంలో అతి పెద్ద పట్టణం మరియు దేశ రాధాని కూడ. ఇక్కడ ఇది పెద్ద పట్టణమైనా భారత దేశంలో పట్టణాలతో పోలిస్తే ఇది చిన్నదె. భహుళ అంతస్తుల భవనాలు, బారీ కట్టడాలు చాల తక్కువ. ఈ దేశంలోని వాహనాలు చాల పాతవి డొక్కువి కూడాను. పాత జీపుల్లాంటి వాహనాలె ఇక్కడి ప్రయాణ సాధనాలు. ఖాట్మండులొ ఒక ఆకర్షన అక్కడి జూద గృహాలు. వీటిని కాసినొ అంటారు. ఇక్కడ మద్యం సేవిస్తూ, అర్థ నగ్న నృత్యాలను వీక్షిస్తూ జూదం ఆడు తారు. ఈ జూదం ఆడడనికే ఇతర దేశాలనుండి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరు. సాధారణ పర్యటకులు కూడ వెళుతుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగు సెంటర్లు కూడ వున్నాయి. కాని అవి ఎక్కువగా భారత్ లాంటి విదేశాల వర్తకులకు చెందినవే. అన్ని దేశాలకు చెందిన వస్తువులు ఇక్కడ అమ్ముతుంటారు. సామాన్యంగా ఇక్కడ తయారైన వస్తువులు అంటు ఏమి వుండవు. అన్ని విదేశాలవే. స్థానికులకాన్నా పర్యటకులే ఈ వస్తువులను కొంటుంటారు. ఇది కూడ అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి ఆదాయ వనరె. ఇక్కడ రుద్రాక్ష చెట్లెక్కువ. అందు చేత రుద్రాక్షలు ఎక్కువగా, చాల చవకగా దొరుకుతాయి. కొందరు పర్యాటకులు రుద్రాక్ష కాయలను కిలోల లెక్కన కొంటుంటారు. వాటిని పగల గొట్టి చూస్తే వారి అదృష్టం పండి అందులో ఒకటి రెండు ఏకముఖి రుద్రాక్షలు దొరికాయంటే వారి పంట పండి నట్లే. వాటి ధర ఒక్కోటి కొన్ని వేల రూపాయ లుంటుంది.
పశుపతి నాద్ ఆలయం
ఇక్కడ చూడ వలసిన ప్రదేశాలు చాల వున్నాయి. అందులో ఒకటి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పశుపతి నాద్ ఆలయం. ఇది శివాలయం. చాల విశాలమైనది. కాని చాలవరకు శిధిలమయం. ఇక్కడి ప్రధాన ఆలయం పగోడ ఆకారంలో చాల ఎత్తుగా వుంటుంది. ఇందులో గర్బాలయం చతురస్త్రాకారంలో వుండి నాలుగు వైపుల ద్వారాలు కలిగి వుంటుంది. మద్యలో వున్న శివ లింగానికి నాలుగు వైపుల నాలుగు మొఖాలుంటాయి. అవి ధర్మార్థకామ మోక్షాలకు ప్రతీకలని నమ్మకం. నాలుగు ద్వారాల వద్ద నలుగు పండితులు వుండి పూజలు చేయిస్తుంటారు. ఇక్కడి పూజారులను పండితులు అని అంటారు. వీరందరు తెలుగు వారేనని అంటారు. వారు తర తరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిర పడ్డారు. ఈ ఆలయంలోనికి హిందూవులకు మాత్రమె ప్రవేశం వుంటుంది. కాని వచ్చే వారు హిందువు అవునో కాదో గుర్తించే ఏర్పాట్లెమి వుండవు. ఈ ఆలయం వెనుక వైపున భాగమతి నది వున్నది. అక్కడే ఆతి పెద్ద శ్మశానం వున్నది. అక్కడ ఎప్పుడు శవాలు కాలుతూనే వుంటాయి. గర్బ గుడికి ఎదురుగా అతి పెద్ద నంది వున్నది. ఆలయ ప్రాంగణం లో వివిధ మందిరాలలో కొంత మంది పండితులు భక్తులకు పూజలు వ్రతలు చేయిస్తుంటారు. ఇక్కడ రుద్రాక్షలు ఎక్కువగా దొరుకు తాయి. రుద్రాక్ష మాలలు చాల చవకగా అమ్ముతుంటారు. భక్తులు ఒక రుద్రక్ష మాలను కొని పూజారికిచ్చి దానిని గర్బ గుడిలోని శివుని పై వుంచి మంత్రాలు చదివి దానికి తిరిగి భక్తులకు ఇస్తారు. దాన్ని భక్తులు పవిత్రం గా బావించి ధరిస్తారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలలో అనేక దుఖాణలాలలో ముత్యాలు, నవర్నాలు, అనేక రంగుల పూసలు విక్రయిస్తుంటారు. విదేశీ యాత్రికులే వీటిని ఎక్కువగా కొంటుంటారు.
మహావిష్ణు ఆలయం
సేషశయనుని పై పవళించి నట్లున్న మహావిష్ణువు నల్లరాతి బారి విగ్రహం తక్కువ లోతు నీళ్లున్న కోనేరులో తేలి యాడుతున్నట్లున్న ఈ దేవుని భక్తులు నీళ్లలోకి దిగ పూజలు చేస్తుంటారు. ఆ విగ్రహం చేతులలో శంఖు, చక్రం, గధ మొదలైన ఆయుదాలున్నాయి. ఇది స్వయం భవమని, బుద్దుని అవతారమని ఇక్కడి వారి నమ్మిక. ఇది చాల పురాతనమైనది. ఈ చుట్టు పక్కల ఉన్న దేవాలయాల శిధిలాలను చూస్తుంటే గతంలో ఇక్కడ అతి పెద్ద ఆలయం వుండేదని అర్థం అవుతుంది. అతి పొడవైన రుద్రాక్ష మాలలు ఇక్కడ ఎక్కువగా అమ్ముతుంటారు.
సూర్యోదయ వీక్షణ
ఖాట్మండుకు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఒక కొండ మీద ఉదయిస్తున్న సూర్యుని చూడడానికి ఒక కేంద్రం వుంది. సూర్యోదయానికి ముందె అక్కడికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లె దారి సన్నగాను మలుపులు తిరిగి వుంటుంది. కనుక పెద్ద వాహనాలు వెళ్లలేవు. చిన్న వాహనాలలో వెళ్లాలి. ఈ కొండ పైనున్న ఒక హోటల్ లో యాత్రీకులకు కావలసిన టీ, కాఫీ పలహారాల వంటి వసతులు చాల బాగ వుంటాయి. కొండ ఎత్తుగ వున్నందున సుధూర ప్రాంతం చక్కగా కనబడు తుంది. సూర్యోదయ సమయానికి మేఘాలు అడ్డు లేకుంటే ఆ సూర్యోదయ దృశ్యం చాల అద్బుతంగా వుంటుంది.
భక్తా పూర్
నేపాల్ దేశంలో భక్థాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ రాజధాని నగరం లో చూడ వలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు అనేకం వున్నాయి. పశుపతి నాద్ ఆలయాన్ని పోలిన ఆలయం కూడ ఇక్కడ వున్నది. అలాంటి దేవాలయాలు అనేకం వున్నాయి . కాని అన్ని శివాలయాలె. రాజ దర్బారు హాలు చాల గంబీరంగ వుంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి వున్నది. ఇది ఆలయం లాగ కాకుండ నివాస గృహం లాగ వుంటుంది. ఆ ఆలయాన్ని కేవలం దసరా సందర్బంలో మాత్రమె తెరుస్తారు. లోన అత్యంత సంపద వున్నట్లు స్థానికులు చెపుతారు. గర్బ గుడిలోనికి వెళ్లనీకున్నా పరిసర ప్రాంతాలను చూడ వీలున్నది. ఈ ప్రాంతం లోని కట్టడాలు అతి మనోహరంగా వున్నవి.
ప్రకృతి పరంగ ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అభయారణ్యాల తో అనేక ప్రముఖ ఆద్యాత్మిక కేంద్రాలతో ఎంతో ప్రశాంతంగా కనబడే నేపాల్ దేశం రాజకీయంగా అత్యంత వేడి. వాడి చర్యలు చాల ఎక్కువగా జరుగు తుంటాయి. ఇదే ఈ దేశం ఆర్థికంగా ఎదగక పోవడానికి కారణం.
జాతులు, కులములు
నేపాల్లో 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తము 103 (ఒక గుర్తు తెలియని జాతితో సహా) జాతులు/కులములు ఉన్నట్లు తేలినది. కులములు అనే పద్దతి హిందూ మతము నుండి వచ్చింది. జాతుల విభజన అనేది, చారిత్రక విశేషాల వల్లా, వారికే ప్రత్యేకమైన ప్రాంతీయ ఊహాజనితమైన కథల వల్లా జరిగినది. 2001 జనాభా లెక్కల ప్రకారం ముఖ్యమైన కులాలు క్షత్రియ(ఛెత్రి) 15.8%, బ్రాహ్మణ(హిల్) 12.7%, మధేషి 33%, మగర్ 7.1%, తమంగ్ 5.6%, నేవార్ 5.5%, మహమ్మదీయ 4.3%, కామి 3.9%, (జాతులు) రాయ్ 3.9%, గురుంగ్ 2.8%, దమాయ్/ధోలి 2.4%. మిగతా 92 కులాలు/జాతులు 2% కన్నా తక్కువగా ఉన్నారు. వీళ్ళలోనే ప్రఖ్యాతి గాంచిన షెర్పాలు కూడా ఉన్నారు.
పట్టణ జనాభా
ప్రాంతము | జిల్లా | జనాభా 19911 | జనాభా. 2001 | సరాసరి పెరుగుదల | 2005 అంచనా |
---|---|---|---|---|---|
ఖాట్మండు | ఖాట్మండు | 414.264 | 671.846 | 4,7 | 807.300 |
లలిత్ పూర్ | లలిత్ పూర్ | 117.203 | 162.991 | 3,4 | 190.900 |
పోఖరా | కాశి | 95.311 | 156.312 | 5,0 | 190.000 |
భిరత్ నగర్ | మోరంగు | 130.129 | 166.674 | 2,5 | 184.000 |
బిర్గంజ్ | పార్ష | 68.764 | 112.484 | 4,9 | 136.200 |
ధరన్ | సంసారి | 68.173 | 95.332 | 3,6 | 109.800 |
భరత్ పూర్ | చిత్వాన్ | 54.730 | 89.323 | 4,9 | 108.200 |
భూత్వాల్ | రూపందేహి | 44.243 | 75.384 | 5,3 | 92.700 |
మహేంద్రనగర్ | కంచన్ పూర్ | 62.432 | 80.839 | 2,7 | 89.900 |
జానక్ పూర్ | ధనుషా | 55.021 | 74.192 | 3,1 | 83.800 |
ధన్ గడి | కైలాలి | 45.094 | 67.447 | 4,1 | 79.200 |
భక్తాపూర్ | భక్తాపూర్ | 61.122 | 72.543 | 1,7 | 77.600 |
హేతౌడా | మక్వన్పూరు | 54.072 | 68.482 | 2,4 | 75.300 |
త్రియుగ | ఉదయపూర్ | - | 55.291 | 3,9 | 64.400 |
నేపాల్ గంజ్ | బంకే | 48.556 | 57.535 | 1,9 | 62.000 |
సిద్ధార్థ్ నగర్ | రూపందేహి | 35.456 | 52.569 | 2,9 | 58.900 |
మధ్యపూర్- తిమ్మి | భక్తాపూర్ | - | 47.751 | 4,0 | 55.900 |
మేచి నగర్ | జప | - | 49.060 | 2,8 | 54.800 |
గులరియ | బర్డియ | - | 46.011 | 4,1 | 50.700 |
త్రిభువన నగర్ | దంగ్దౌకురి | 29.152 | 43.126 | 4,0 | 50.500 |
ఇటహ | సంసారి | - | 41.210 | 4,3 | 48.800 |
లేన్కత్ | కాశి | - | 41.369 | 3,2 | 46.900 |
టికాపూర్ | కైలాలి | - | 38.722 | 4,1 | 45.500 |
కిర్తిపూర్ | ఖాట్మండు | - | 40.845 | 2,7 | 45.400 |
రత్నానగర్ | చిత్వాన్ | - | 37.791 | 4,1 | 44.500 |
కమలమయి | సింధూలి | - | 32.828 | 5,3 | 40.400 |
కలైయా | బర | 17.265 | 32.260 | 5,6 | 40.100 |
తులసీపూర్ | దంగ్దేఖురి | 20.752 | 33.876 | 4,0 | 39.600 |
భీరేంధ్ర నగర్ | సుర్ఖేట్ | 22.888 | 31.381 | 3,1 | 35.500 |
దమక్ | జప | 41.419 | 35.009 | -1,7 | 35.000 |
రాజ్ బిరాజ్ | సప్తరి | 23.847 | 30.353 | 2,3 | 33.200 |
కపిలబస్తు | కపిలబస్తు | 17.146 | 27.170 | 4,6 | 32.500 |
బ్యాస్ | తనహు | 20.175 | 28.245 | 3,4 | 32.300 |
లహన్ | సిరాహ | 19.046 | 27.654 | 3,8 | 32.100 |
పుతలిబజార్ | స్యంజ | - | 29.667 | 1,4 | 31.400 |
ప్రుథ్వినారాయణ్ | గోర్ఖా | - | 25.738 | 2,2 | 28.100 |
పనౌటి | కభ్రేపలంచోక్ | - | 25.563 | 2,4 | 28.100 |
గౌర్ | రౌతహట్ | 23.258 | 25.383 | 2,2 | 27.700 |
దీపాయల్-సిల్గధి | దోటి | 12.259 | 22.061 | 5,8 | 27.600 |
ఇనరువ | సన్సరి | 18.562 | 23.200 | 2,2 | 25.300 |
సిరాహ | సిరాహ | - | 23.988 | 1,0 | 25.000 |
రాంగ్రాం | నవల్ పరసి | - | 22.630 | 1,8 | 24.300 |
తాన్సేన్ | పల్ప | 13.617 | 20.431 | 4,0 | 23.900 |
జలేశ్వర్ | మహోత్తరి | 18.161 | 22.046 | 2,0 | 23.900 |
భగ్లంగ్ | భగ్లంగ్ | - | 20.852 | 3,2 | 23.700 |
భీమేశ్వర్ | డోలఖ | - | 21.916 | 1,3 | 23.100 |
ఖడ్బరి | సంకువసభ | - | 21.789 | 1,5 | 23.100 |
ధనుకుట | ధనుకుట | 17.155 | 20.668 | 1,9 | 22.300 |
బీదుర్ | నువాకోట్ | 18.862 | 21.193 | 1,3 | 22.300 |
వలింగ్ | స్యంజ | - | 20.414 | 2,0 | 22.100 |
నారాయణ్ | దైలేఖ్ | - | 19.446 | 2,1 | 21.100 |
మలంగ్వ | సర్లహి | 13.666 | 18.484 | 2,7 | 20.600 |
భధ్రపూర్ | జప | 15.123 | 18.145 | 1,8 | 19.500 |
అమరగడి | దడేల్ధుర | - | 18.390 | 1,1 | 19.200 |
దశరథచండ్ | భైతడ్ | - | 18.345 | 0,2 | 18.500 |
ఇలాం | ఇలాం | 13.150 | 16.237 | 2,1 | 17.600 |
బనేప | కభ్రేపలంచోక్ | 12.622 | 15.822 | 2,3 | 17.300 |
ధులికేల్ | కభ్రేప్లంచోక్ | 9.664 | 11.521 | 1,6 | 12.300 |
మొత్తం పట్టణ జనాభా | 1.742.359 | 3.197.834 | 3,5 | 3.545.500 | |
increase 91-01 for first 36 mun. | 1.742.359 | 2.528.218 |
1 1991 నాటికి కేవలం 36 మున్సిపాలిటీలు మాత్రమే ఏర్పాటు చేయబడినాయి
సెలవు దినములు
నేపాల్కు నాలుగు పంచాంగాలు ఉన్నాయి. ప్రభుత్వపు సౌర మాన పంచాంగము, చంద్రమాన పంచాంగము, నేపాలి సాంప్రదాయ పంచాంగము మరియు పాశ్చాత్య పంచాంగము. నేపాల్ మతపరమైన సెలవు దినాలన్నీ చాంద్రమాన పంచాంగము ప్రకారము ఉంటాయి. అందువల్ల నేపాలీలకు సెలవు దినాల కోసమై ఒక స్థిరమైన తేదీలు అంటూ ఉండవు. సాధారణంగా రెండు ముఖ్యమైన సెలవు దినములు దషైన్, తిహార్లు, అక్టోబర్, నవంబర్ మాసాలలో వస్తాయి.
బయటి లింకులు
- నేపాలి రాజ్య అంతర్జాలం
- CIA World Factbook సి.ఏ.ఐ> వెబ్ సైటులో నేపాల్ (2000)
- నేపాలి జనాభా నివేదిక (2002)
- నేపాలి వార్తలు
- నేపాలి టైమ్స్
- Newslook Magazine
- Newa Post
- NepalOnline.com
- Free Expression in Nepal
- Kantipur Online
- City Times
- United We Blog!
- International Nepal Solidarity Network
- Samudaya
- FreeNepal.org
- myfreenepal
మరిన్ని విషయాలకు ఈక్రింద ఉన్న రచనలు చూడండి
- Barbara Crossette. 1995. So Close to Heaven: The Vanishing Buddhist Kingdoms of the Himalayas. New York: Vintage. (ISBN 0679743634)
- Bista, Dor Bahadur. The Peoples of Nepal
- Peter Matthiessen.1993, "The Snow Leopard".(ISBN 0-00-272025-6)
- Joe Simpson. 1997. "Storms of Silence"
- Samrat Upadhyay. 2001. "Arresting God in Kathmandu"
- Joseph R. Pietri.2001. "The King of Nepal"
- Maurice Herzog.1951. "Annapurna"
- Dervla Murphy.1967. "The Waiting Land"
- Jon Kraukauer.1997. "Into Thin Air"
- Indra Majupuria.1996. "Nepalese Women". (ISBN 974-89675-6-5)
- Dor Bahadur Bista.1996. "People of Nepal". Kathmandu.
- Eva Kipp.1995. "Bending Bamboo Changing Winds". (ISBN 81-7303-037-5)
- Broughton Coburn.1982/1991. "Nepali Ama". (ISBN 0-918373-74-3)