రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
నాయకుడునంద టి. కాంబ్లే
ప్రధాన కార్యాలయంమహారాష్ట్ర
భారతదేశంలోని వివిధ దళిత పార్టీలు ఉపయోగించే జెండా

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్) అనేది భారతదేశంలోని రాజకీయ పార్టీ.[1] పార్టీ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు టిఎం కాంబ్లే. టిఎం కాంబ్లే మరణం తరువాత, నంద టి. కాంబ్లే పార్టీ అధ్యక్షుడయ్యాడు.

ఈ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి చీలిపోయిన సమూహం. 2004 ఎన్నికల తర్వాత, ఇది లోక్‌సభలో స్వల్ప ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంది. పాలక యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లో ఒక భాగం. దీని ఉనికి మహారాష్ట్రకే పరిమితమైంది.

2011 మే 5న, ఈ పార్టీ బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ.తో పొత్తు పెట్టుకుంది. 2015లో, ఇది ప్రధానమంత్రి అభ్యర్థి -నరేంద్ర మోదీకి 26 రాజకీయ మిత్రులలో ఒకటిగా జాబితా చేయబడింది.[2]

2015 సెప్టెంబరు 28న ఆడిట్ చేయబడిన బ్యాలెన్స్ షీట్‌లు, ఐటి రిటర్న్ డాక్యుమెంట్‌లను సమర్పించనందుకు 2005 వరకు రిజిస్టర్ చేయబడిన మహారాష్ట్రలోని 16 పార్టీలలో ఈ పార్టీ ఒకటి. దీంతో వారు తమ అధికారిక ఎన్నికల చిహ్నాలను కోల్పోయారు.[3]

మూలాలు[మార్చు]

  1. "Republican Party of India (A)". www.republicanpartyofindia.org. Retrieved 2015-10-02.
  2. "Who are Modi's 26 allies in the NDA?". Retrieved 2015-10-02.
  3. "16 political parties lose election symbols in the absence of balance sheets". Times of India. Retrieved 7 October 2015.