ఋష్యశృంగుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి అక్షరదోషాల సవరణ (పేర్లలో తప్ప )
పంక్తి 24: పంక్తి 24:
రోమపాదుడు తన కూతురైన శాంతను ఋషిశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు
రోమపాదుడు తన కూతురైన శాంతను ఋషిశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు


==కిగ్గా లొ ఋషిశృంగ మహర్షి గుడి==
==కిగ్గా లో ఋషిశృంగ మహర్షి గుడి==
ఋషిశృంగుడి దేవాలయము ఇప్పటి [[శృంగేరి]]కి 10 మైళ్ల దూరములో [[కిగ్గా]] అనే గ్రామములో ఉంది. శృంగేరికి ఆ పేరు ఋషిశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు.
ఋషిశృంగుడి దేవాలయము ఇప్పటి [[శృంగేరి]]కి 10 మైళ్ల దూరములో [[కిగ్గా]] అనే గ్రామములో ఉంది. శృంగేరికి ఆ పేరు ఋషిశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు.


{{రామాయణం}}
{{రామాయణం}}

==బయటి లింకులు==
==బయటి లింకులు==



09:58, 28 జూన్ 2007 నాటి కూర్పు

ఋషిశృంగ మహర్షి గురించి రామాయణములోని బాల కాండములో వివరించబడింది. దశరథ మహారాజు మంత్రి అయిన సుమంతుడు ఋషిశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు. సుమంతుడు తాను సనత్కుమారుడు ఋషులకు చెప్పుచుండగా విన్నట్లు దశరథ మహారాజు అశ్వమేథ యాగము , పుత్రకామేష్టి యాగము చేస్తాడని విన్నాడు.

ఋషిశృంగుడి జననము - విద్యాబుద్ధులు

విభండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యవార్చుకొనుచుండగా ఆయనకు ఆకాశమార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తుంది. ఆ ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని ఒక జింక త్రాగుతుంది. ఆ జింక గర్భం ధరించి జింక కొమ్ము కల బాలకుడికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించినాడు కావున ఆ బాలకునకు ఋషిశృంగుడు అని పేరు పెడతాడు. ఋషి శృంగుడికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞాలు, యాగాది క్రతువులు తానే గురువై విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋషిశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు.

ఋషిశృంగుడు ఎటువంటి విధంగా పెరుగుతాడంటే లోకములో పురుషులు - స్త్రీలు అనే తారతమ్యములు అతనికి తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋషిశృంగుడిని చూస్తే జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.

అంగరాజ్యములో క్షామము

ఇలా ఉండగా అంగరాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలన చేస్తు ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో వర్షాలు పడడం మానేసి అనావృష్టితో క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా వారు ఋషిశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములోకి ప్రవేశపెట్ట మంటాడు.

వేశ్యల ఉపాయము

వేశ్యల చేత ఆకర్షితుడైన ఋషిశృంగుడు
వేశ్యల చేత ఆకర్షితుడైన ఋషిశృంగుడు

అప్పుడు రోమపాదుని మంత్రులు అది దుర్భేద్యమైన కార్యమని, ఋషిశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, ఆయనకు విషయ సుఖాలంటే తెలియవని, ఆయనను రాజ్యంలోకి రప్పించడం కష్టమని, దానికి తరుణోపాయము వేశ్యలని విభండక మహర్షి ఆశ్రమములో లేని సమయములో పంపమని చెబుతారు.

మహారాజు అందుకు అంగీకరించి వేశ్యలని ఋషిశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ గీతాలు పాడతారు, నాట్యాలు ఆడతారు. ఆ శబ్దాలకు ఋషిశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋషిశృంగుడిని చూసి విభండక మహర్షి ఆశ్రమములో లేరని తెలుసుకొని ఋషిశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని , స్త్రీపురుష భేదము తెలియని ఋషిశృంగుడు వారికి(వేశ్యలకు) ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి ఋషిశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋషిశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చే సమయం అయిందని భావించి వెళ్ళి పోతూ వెళ్ళి పోతూ ఋషిశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు.

వారు కౌగిలించుకొన్న తరువాత విషయ వాంఛలు లేని ఋషిశృంగుడికి కూడా వారిని చూడాలి అనే కోరిక పుడుతుంది, వారికి వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋషిశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋషిశృంగుడు అంగీకరించి వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.

ఋషిశృంగుడు - శాంతల వివాహము

కపటనాటకము ద్వారా ఋషిశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రైన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు.

రోమపాదుడు తన కూతురైన శాంతను ఋషిశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు

కిగ్గా లో ఋషిశృంగ మహర్షి గుడి

ఋషిశృంగుడి దేవాలయము ఇప్పటి శృంగేరికి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో ఉంది. శృంగేరికి ఆ పేరు ఋషిశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు.


బయటి లింకులు