గూడవల్లి (చెరుకుపల్లి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 147: పంక్తి 147:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===పాఠశాలలు===
===పాఠశాలలు===
#ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (1-5 తరగతులు):- గూడవల్లి గ్రామములో సుమారు 3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. గూడవల్లి మండేవారిపాలెంలో నూతనంగా నిర్మించిన పాఠశాల, అంతర్గత రహదారులు 2013,డిసెంబరు-11న ప్రారంభించారు. [2]
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (1-5 తరగతులు):- గూడవల్లి గ్రామములో సుమారు 3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. గూడవల్లి మండేవారిపాలెంలో నూతనంగా నిర్మించిన పాఠశాల, అంతర్గత రహదారులు 2013,డిసెంబరు-11న ప్రారంభించారు. [2]

#మునిసామి నాయుడు స్మారక ఉన్నత పాఠశాల (6-10 తరగతులు):- దీనిని 1944 లో ప్రారంభించారు. దీనిని ప్రారంభించినప్పుడు సుమరుగా 2000 మంది దీనిలో విద్యనభ్యసించేవారు. ఈ పాఠశాల 71వ వార్షికోత్సవం, 2015,మార్చి-14వ తేదీ శనివారం నాడు, ఘనంగా నిర్వహించారు. [4]
మునిసామి నాయుడు స్మారక (ఎం.ఎన్.ఎం) ఉన్నత పాఠశాల (6-10 తరగతులు):- దీనిని 1944 లో ప్రారంభించారు. దీనిని ప్రారంభించినప్పుడు సుమరుగా 2000 మంది దీనిలో విద్యనభ్యసించేవారు. ఈ పాఠశాల 71వ వార్షికోత్సవం, 2015,మార్చి-14వ తేదీ శనివారం నాడు, ఘనంగా నిర్వహించారు. [4]


వనజా చంద్ర విద్యాలయము (యెల్.కె.జీ-10 తరగతులు):- ఇది అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారిచే 1992 జూన్ 14 లో ప్రారంభించబడింది. ఇది ప్రారంభించినపుడు తెలుగు మాధ్యమములో విద్యాబోధన జరిగేది.ఇప్పుడు ఆంగ్ల మాధ్యమములో విద్యాబోధన జరుగుచున్నది.ఈ పాఠశాలలో ప్రయోగశాల (టాటా వారు సుమారు 14 లక్షలు ఇచ్చారు), ఆట స్థలము, కంప్యూటర్ శిక్షణాకేంద్రము (సుమారు 25 కంప్యూటర్లు ఉన్నాయి), బస్సు సౌకర్యం, మినరల్ వాటర్ సౌకర్యం ఉంది.
వనజా చంద్ర విద్యాలయము (యెల్.కె.జీ-10 తరగతులు):- ఇది అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారిచే 1992 జూన్ 14 లో ప్రారంభించబడింది. ఇది ప్రారంభించినపుడు తెలుగు మాధ్యమములో విద్యాబోధన జరిగేది.ఇప్పుడు ఆంగ్ల మాధ్యమములో విద్యాబోధన జరుగుచున్నది.ఈ పాఠశాలలో ప్రయోగశాల (టాటా వారు సుమారు 14 లక్షలు ఇచ్చారు), ఆట స్థలము, కంప్యూటర్ శిక్షణాకేంద్రము (సుమారు 25 కంప్యూటర్లు ఉన్నాయి), బస్సు సౌకర్యం, మినరల్ వాటర్ సౌకర్యం ఉంది.

06:16, 12 మార్చి 2017 నాటి కూర్పు

గూడవల్లి (చెరుకుపల్లి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,022
 - పురుషుల సంఖ్య 1,939
 - స్త్రీల సంఖ్య 2,083
 - గృహాల సంఖ్య 1,186
పిన్ కోడ్ 522 259
ఎస్.టి.డి కోడ్ 08648
  ?గూడవల్లి
ఆంధ్రప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
సమీప నగరం తెనాలి, రేపల్లె, పొన్నూరు
జిల్లా (లు) గుంటూరు జిల్లా జిల్లా
జనాభా 4,353
సర్పంచి
ఉపసర్పంచి
లోక్‌సభ నియోజకవర్గం బాపట్ల
శాసనసభ నియోజకవర్గం రేపల్లె
మండలం చెరుకుపల్లి (గుంటూరు జిల్లా)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 522259
• +08648


గూడవల్లి, గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 259., ఎస్.టి.డి.కోడ్ = 08648.

గ్రామ చరిత్ర

ఈ గూడవల్లి ప్రాచీన శాసనాలలో కుముదవల్లిగా, కుముదపల్లిగా, కుముద వెల్లిగా పేర్కొనటం జరిగింది. పూర్వము ఈ గ్రామము పులివర్రు తాలూకాలో ఉండేది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

ఇది రేపల్లె, తెనాలి మార్గంలో ఉంది. ఈ గ్రామం అక్షాంశ పరిధి - 80°42'38" తూర్పు అక్షాంశము మరియు రేఖాంశ పరిధి16°3'59" ఉత్తర రేఖాంశము. పొన్నపల్లి, నడింపల్లి, గూడవల్లి గ్రామాలు కలిసిపోయి వుంటాయి. ఈ గ్రామము గుంటూరు నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో,రేపల్లె నుంచి సుమారు 26 కిలోమీటర్ల దూరంలో, తెనాలి నుంచి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో, పొన్నూరు నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గ్రామ సరిహద్దులు

తూర్పు - కనగాల
పడమర - నడింపల్లి
ఉత్తరం - పాంచాలవరం
దక్షిణం - రాజవోలు (చెరుకుపల్లి)

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో పొన్నపల్లి,కనగాల,రాజవోలు,పెద్దవరం,ఆళ్ళవారిపాలెం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గూడవల్లి గ్రామము చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉంది. ప్రధానంగా రేపల్లె-గుంటూరు, తెనాలి-నగరం, రేపల్లె-చీరాల మార్గంలో వెళ్ళు బస్సులు గూడవల్లి గ్రామము గుండా వెళ్ళతాయి. గూడవల్లి గ్రామము గుండా ఎన్‌హెచ్-214ఎ జాతీయ రోడ్డు వెళ్ళతుంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

పాఠశాలలు

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (1-5 తరగతులు):- గూడవల్లి గ్రామములో సుమారు 3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. గూడవల్లి మండేవారిపాలెంలో నూతనంగా నిర్మించిన పాఠశాల, అంతర్గత రహదారులు 2013,డిసెంబరు-11న ప్రారంభించారు. [2]

మునిసామి నాయుడు స్మారక (ఎం.ఎన్.ఎం) ఉన్నత పాఠశాల (6-10 తరగతులు):- దీనిని 1944 లో ప్రారంభించారు. దీనిని ప్రారంభించినప్పుడు సుమరుగా 2000 మంది దీనిలో విద్యనభ్యసించేవారు. ఈ పాఠశాల 71వ వార్షికోత్సవం, 2015,మార్చి-14వ తేదీ శనివారం నాడు, ఘనంగా నిర్వహించారు. [4]

వనజా చంద్ర విద్యాలయము (యెల్.కె.జీ-10 తరగతులు):- ఇది అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారిచే 1992 జూన్ 14 లో ప్రారంభించబడింది. ఇది ప్రారంభించినపుడు తెలుగు మాధ్యమములో విద్యాబోధన జరిగేది.ఇప్పుడు ఆంగ్ల మాధ్యమములో విద్యాబోధన జరుగుచున్నది.ఈ పాఠశాలలో ప్రయోగశాల (టాటా వారు సుమారు 14 లక్షలు ఇచ్చారు), ఆట స్థలము, కంప్యూటర్ శిక్షణాకేంద్రము (సుమారు 25 కంప్యూటర్లు ఉన్నాయి), బస్సు సౌకర్యం, మినరల్ వాటర్ సౌకర్యం ఉంది.

కళాశాలలు :

  1. శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి ఐ.టి.ఐ.

గ్రంధాలయo

శ్రీమతి గద్దె లలితాదేవి స్మారక గ్రంథాలయం.

గ్రామములో మౌలిక వసతులు

ఆసుపత్రులు

  1. కంటి ఆసుపత్రి :- హైదరాబాదులోని ఎల్.వి.ప్రసాదు కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో, ఈ గ్రామములో, దీనిని 2011 లో ప్రారంభించారు.
  2. పశువైద్యశాల.

బ్యాంకులు

భారతీయ స్టేట్ బ్యాంక్. ఫోన్ నం. 08648/258655.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

  1. ప్రకాశం బ్యారేజి కాలువలు:- పెద్ద కాలువ (రేపల్లె మురుగు కాలువ), ఛిన్నకాలువ (దేశం కాలువ).
  2. చెరువులు -రాయగుంట చెరువు
  3. భూగర్బ జలాలు.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి ఆలపాటి వెంకటలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. []

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

  1. ఇక్కడ పూర్వము నాగేశ్వరస్వామి దేవాలయము, మల్లిఖార్జునస్వామి, గణపేశ్వరుల దేవాలయములు వృద్ధిగా ఉండటం తెలుసుకున్న కుళోత్తుంగ చోళ మహారాజు స్వాముల మహిమ గురించి తెలుసుకుని ఆ దేవులకు నిత్యనైవేద్య ధూపదీపారాధనలకు, మహోత్సవములు జరుగుటకు, శాలివాహన శకం 1050 లో (క్రీ.శ 1172 లో) కుముద వెల్లిలో దానము ఇచ్ఛి శిలాశాసనములు వ్రాయించి ఆలయమునకు మండప ప్రాకారాదులు నిర్మాణము చేయించారు. పూర్వము ఈ గ్రామమునకు నడింపల్లివారు, ముక్కామల వారు కరణాలుగా పనిచేసారు. శాలివాహన శకం 1067 (క్రీ.శ 1139 లో) గణపతిదేవ చక్రవర్తి కాలములో ఈ గ్రామాన్ని గోపరాజు రామన్నగారు దానముగా స్వీకరించారు. ఆ రోజులలో ఆగిరిపలిల శోభనాద్రి స్వామివారి అర్చకుడు, వైఖానస సూత్రీకుడు ఉత్తర తాళ్ళపాక అన్నమయ్యగారు తిరుమల వెళ్ళుచూ ఈ గ్రామానికి వచ్చి గ్రామానికి తూర్పుగా ఉన్న కృష్ణపాయలో (కరకట్టలు ఏర్పడటానికి పూర్వము ఇప్పట్టి గంగోలు కాలువ) స్నానము చేసి అనుష్టానము చేసుకొనుచూ గట్టున కూర్చున్నారు. ఆ సమయములో జాలరులు వలలు వేసి దానిలో ఇరుక్కున్న లక్ష్మీనృశింహస్వామివారి విగ్రహన్ని (5 అడుగుల ఎత్తు) తీసి బయట పడవేసినారు (దీనితో పాటు స్తంభోద్భవ నారసింహము సుమారు 8.6 అడుగుల ఎత్తుగల స్తంభము దొరికింది). తాళ్ళపాక సుబ్బయ్య గారు ఆ విగ్రహన్ని చూసి ఆశ్చర్యపడి అంతటి విగ్రహన్ని స్వామి యొక్క అనుగ్రహ బలముతో ఒక్కరే తీసుకువచ్చి గ్రామములో తూర్పుభాగమునకు వచ్చారు. అచ్చట నుంచి ఆ విగ్రహము ఒక్క అడుగు కూడా కదలలేదు. ఆ స్వామివారిని అచ్చటనే ప్రతిష్ఠ చేసి సుబ్బయ్య గారు తమకు బంధువైన బృందావనం వారు అనే వైఖానసలైన వారిని అర్చకత్వములో నియోగించారు. కుళోత్తుంగ చోళ మహారాజు చేసిన దానశాసనము నృశింహస్వామివారి గుడి గోడపైననూ, ఘంటావారి బజారులో ఉన్న తిరుగుట నంది ఉన్న స్తంభముపైననూ కనిపిస్తాయి. పూర్వము ఈ తిరుగుడు నందిని త్రిప్పితే గర్బవతులు తేలికగా ప్రసవించే వారని పెద్దలనే వారు. ఆ నంది కాలక్రమేణ కాలగర్బములో కలసిపోయిన నాగేశ్వరస్వామివారి దేవాలయ ధ్వజస్తంభమని అంటారు. ప్రస్తుతము శ్రీ లక్ష్మీనృశింహస్వామివారి ఆలయము ఒక్కటే మంచి స్థితిలో వుంది. మిగిలిన ఆలయాలన్నీ లక్ష్మీనృశింహస్వామివారి ఆలయానికి వాయువ్య మూల భూమిలో పూడిపోయివున్నవి.
  2. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం : ఇది చాలా పురాతనమైన దేవాలయము. పూర్వము ఈ ఆలయమందు శ్రీ జ్వాలానారసింహ సాలగ్రామము గలదు. ఈ స్వామి చాలా శక్తిగలవారు. ఈ స్వామికి ఎదురుగా గ్రామస్థులు గడ్డివాములు, ఇండ్లు మొదలైనవి వేసిన ఆ స్వామి జ్వాలకు అవి అన్నియు మండిపోయెడివి.అందువలన గ్రామస్తులందరు స్వామి దృష్టి తప్పించి నిర్మంచుకొనేవారు. ఈ గ్రామమునకు దక్షిణమున అనగా శ్రీ నరసింహ స్వామి వారికి యెదురుగా నిర్మంచినవి తగలబడిపోవుటచే శ్రీ స్వామి వారి దృష్టికి ఎదురుగా ఒక వీధి వదలి గ్రామము నిర్మంచినారని ప్రతీతి. కొంతకాలము జరిగిన పిదప గూడవల్లికి పడమటి దిక్కున పదునాల్గుమైళ్ళ దూరంలో పొన్నూరు గ్రామము ఉంది. ఆ గ్రామములో శ్రీ భావనారాయణ స్వామివారి ప్రతిష్ఠ జరుగు సమయమున ఈ జ్వాలానారసింహ సాలగ్రామము, స్వామివద్ద వుంచిన చాలా ప్రతిభ వచ్చునని అప్పుడు సాలగ్రామము ఎవరికి తెలియకుండా దొంగిలించి తీసుకుపోయిరి. అట్లు తీసుకుపోవునప్పుడు వారి వళ్ళు అంతా బొబ్బలెక్కి మంటలతో బాధపడలేక భావనారాయణస్వామి వారికి ఎదురుగా ఉన్న కోనేరులో పడవేసిన ఆ కోనేటిలోని నీరు తుక తుకా ఉడికి ఇంకిపోయినదట. ఆ సమయమున కృష్ణానది ఒడ్డున కోటిపల్లె అనే గ్రామములో శివాలయ ప్రతిష్ఠ జరుగుతోంది. ఈ జ్వాలానారసింహ సాలగ్రామము లింగము క్రింద వుంచి ప్రతిష్ఠచేసిన శివునికి గొప్ప మహత్యం వస్తుందని పొన్నూరు కోనేరులో గల సాలగ్రామమును అనేక బాధలకు ఓర్చి తీసుకువెళ్ళి లింగం క్రింద వుంచి ప్రతిష్ఠ జరుప ప్రయత్నించిరి. ఆ సమయమున ప్రజలందరు చూస్తుండగా పెద్ద ధ్వనితో లింగము బ్రదలై కంటినలుసు లంతగా పగిలిపోయి దేదీప్యమనమైన తేజస్సు తాళ్ళ వృక్షము ఎత్తున వెలుగుతూ ఐదు ఘడియల కాలము నిలచి అంతర్థానమయిపోయిందట! ఈ ఆలయము సుమారు 37 సం"ల నుండి దేవాదాయశాఖ వారి స్వాధీనంలో వుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం నృసింహ జయంతి కార్యక్రమం కన్నులపండువగా నిర్వ్షించెదరు.
  3. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మరియు శ్రీ గోకర్ణేశ్వరస్వామివారి ఆలయం:- ఈ శివకేశవుల దేవస్థానములను మహయోగిని శ్రీ సూరమ్మగారు 1961 సం" మే 7,8 తేదీలలో నిర్మాణం గావించారు. ఈ ఆలయాలలో జీవ, ధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మార్చ్-9వ తేదీ, సోమావారం నాడు, వైఖానస, శైవాగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శాంతికళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాల నుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారలను కొలిచేటందుకు పోటీ పడినారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొని, స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. [3]
  4. శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం.
  5. శ్రీ రామాలయము
  6. గ్రామ దేవత - దేశమ్మ,నాంచారమ్మ.
  7. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-15వతేదీ బుధవారంనాడు, నవగ్రహాల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించినారు. బుధవారం ఉదయం స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ఆలయ ఆవరణలో నిర్మించిన ప్రత్యేక మండపంలో నవగ్రహాల విగ్రహ ప్రతిష్ఠను ఋత్విక్కులు వైభవం నిర్వహించినారు. నాగేంద్రస్వామి వల్మీకాల వద్ద 11 జంట నాగుల విగ్రహాలను ప్రతిష్ఠించినారు. శాంతిహోమం ఏర్పాటుచేసినారు. అనంతరం నాలుగు వేలమందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి, 16 రోజులైన సందర్భంగా, 2017,మార్చ్-4వతేదీ శనివారంనాడు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించినారు. నాగేంద్రస్వామివారి పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించినారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు.[8]&[9]
  8. శ్రీ సత్యసాయి ధ్యాన పాదుకా మందిరం.

గ్రామములోని ప్రధాన పంటలు

వరి, మినుము,మొక్కజొన్న

గ్రామములోని ప్రధాన వృత్తులు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

  • షేక్ మస్తాన్ వలీ లింకా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్ విజేత.

గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన వీరు ఇంటరు వరకు, విద్యనభ్యసించి, ఆర్థికభారంతో, కుటుంబ భారాన్ని మోయాలనే ఉద్దేశంతో, 18 సంవత్సరాల వయసులోనే, 1986లో ఆర్మీలో చేరి, మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ లో బాధ్యతలు తీసికొన్నారు. ఈయనకు తొలిసారిగా 1996లో అంటార్కిటికా ఖండంలో పరిశోధనలకు వెళ్ళుచున్న శాస్త్రవేత్తల బృందానికి, "లాజిస్టిక్స్ సపోర్టరు"గా వెళ్ళే అవకాశం కలిగింది. రెండు శాతం కొండలు, 98 శాతం మఛుతో కప్పబడిన, జనసంచారం లేని మంచు ఎడారి అది. భారత ప్రభుత్వం వారు అక్కడ దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అను మూడు ఇండియన్ అంటార్కిటికా సైంటిఫిక్ స్టేషనులను ఏర్పాటుచేసారు. పరిశోధనలలో ఆ శాస్త్రఙులకు కావలసిన సదుపాయాల కల్పనను చూడటం మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ వారి కర్తవ్యం. బుల్ డోజర్, క్రేన్, ఎస్కలేటర్ డ్రైవర్ గా అనుభవం ఉన్న మస్తాన్, ఆ ప్రతికూల వాతావరణంలో, శాస్త్రఙులు ఎక్కడ టవర్లు నిర్మించాలన్నా, అక్కడ అనుకున్న కాలానికి చేసిపెట్టేవారు. ఈ మంచుఖండంలో ఈయన 1996, 2008, 2010,2013 సంవత్సరాలలో, అత్యధికంగా మొత్తం 1990 రోజులు విధి నిర్వహణ చేసి, "లింకా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్"లో స్థానం సంపాదించుకున్నారు. [5]

  • కోటపాటి మురహరిరావు స్వాతంత్ర సమరయోధులు, హేతువాది.
  • [ఎంఏఎల్ నరసింహారావు చీమకుర్తి కళ్ళ డాక్టరు.తొలిసారి కంటిలోని నల్లగుడ్డును మార్చిన వైద్యులు.

గ్రామ విశేషాలు

ఈ గ్రామం నుండి సుమారు 5౦౦ మంది, అమెరికాలో స్థిరపడిన వారు ఉండటం ఈ గ్రామ విశిష్టత.

నరసింహస్వామి దేవాలయము
గద్దె లలితా దేవీ స్మారక గ్రంథాలయం

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3785.[1] ఇందులో పురుషుల సంఖ్య 1847, స్త్రీల సంఖ్య 1938,గ్రామంలో నివాసగృహాలు 1153 ఉన్నాయి.

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

బయటి లింకులు

[2]

[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మార్చి-10; 1వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మార్చి-16; 2వపేజీ. [5] [6] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మే-26; 11వపేజీ. [7] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,సెప్టెంబరు-6; 2వపేజీ. [8] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2017,ఫిబ్రవరి-16; 2వపేజీ. [9] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2017,మార్చి-5; 1వపేజీ.

మూస:చెరుకుపల్లి (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు