మానసవీణ మధుగీతం (పాట)

వికీపీడియా నుండి
(మానసవీణ మధుగీతం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మానసవీణ మధుగీతం ఒకానొక హృద్యమైన ప్రేమగీతం. దీనిని పంతులమ్మ (1978) సినిమా కోసం వేటూరి సుందరరామమూర్తి రచించారు. దీనిని ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల కలిసి గానం చేయగా రాజన్-నాగేంద్ర సంగీతాన్ని స్వరపరిచారు.

మానసవీణ మధుగీతం పాటలోని దృశ్యం.

పాటలోని సాహిత్యం[మార్చు]

పల్లవి :
మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం
సాగరమధనం, అమృత మధురం, సంగమ సరిగమ స్వర పారిజాతం || మానసవీణ మధుగీతం ||

చరణం :
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయపరాగం
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయపరాగం
ఎద లోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం

శతవసంతాన దశదిశాంతాన సుమ సుగంధాల
భ్రమర నాదాల కుసుమించు నీ అందమే
విరిసింది అరవిందమై కురిసింది మకరందమే || మానసవీణ మధుగీతం ||


జాబిలి కన్న నా చెలి మిన్న పులకింతలకే పూచిన పొన్నా
కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేనవ్వగలను

పాల కడలిలా వెన్నెల పొంగింది
పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చేరగలను
మనసున మమతై కడతేరగలను || మానసవీణ మధుగీతం ||


కురిసేదాక అనుకోలేదు శ్రావణ మేఘమని
తడిసేదాక అనుకోలేదు తీరని దాహమని
కలిసేదాక అనుకోలెదు తీయని స్నేహమని

పెదవి నీవుగా పదము నేనుగా ఎదలు కలపగా

అవార్డులు[మార్చు]

  • ఈ పాటలోని ఉన్నత విలువలున్న సాహిత్యానికి వేటూరి సుందరరామమూర్తి గారికి ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం లభించింది.

బయటి లింకులు[మార్చు]