మాండవ్య మహర్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాండవ్యుడు మహర్షి, అతడు ఒక ముని కుమారుడు. తపశ్శాలి,బ్రహ్మ విద్యాపరుడు బ్రహ్మర్షి,స్ధిరచిత్తుడు . మౌన వ్రతుడు,పుణ్యపురుషుడు,సత్యవ్రతుడు.అటువంటి మాండవ్యునిపై ఒక అపనింద పడింది.ఏమిటా అపనింద? దొంగలు కొందరు రాజభవనంలో ఖజాన దోచుకొని మాండవ్యుని ఆశ్రమాన పాతిపెట్టి పొదలమాటున పొంచి ఉన్నారు.రాజభటులు దొంగలను వెతుకుతూ వచ్చి వారు కనపడకపోగా సమీపాన ఉన్న మాండవ్యుని అడిగారు.మౌనవ్రత మందున్న మాండవ్యుడు సమాధానం చెప్పలేదు.భటులు ఆశ్రమమంతా వెతకి దొంగలు పాతిపెట్టిన ఖజాన బయటకు తీశారు.దొంగలను బంధించారు.ముక్కు మూసికొని తపస్సు చేసికొనే మాండవ్యుని కూడా దొంగేనని భావించి దొంగలతో పాటు బంధించి తీసికొని పోయారు.రాజు అందరికీ శిక్ష విధించి మాండవ్యునికి శూలం గుచ్చి పాతి వెళ్ళిమాయారు.మాండవ్యుడు దేహబాధను లక్ష్యపెట్టక తపస్సాధనలో ఉండిపోయాడు.

కూశికుని వృతాతం[మార్చు]

ఒకనాటి రాత్రి జరిగిన విషయము ప్రతిష్ఠాన మను ఒక పురమున కౌశికుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు.అతడు కుష్ఠురోగి.అతని భార్య పతివ్రత.భర్తయే సర్వస్వమనిభావించి శుశ్రూష చేయుచుండెను.అనాటి రాత్రి రాజమార్గమున ఒక వేశ్య పోవుచుండెను.అమెను చూచి కౌశికుడు ముగ్ధుడై భార్యను పిలిచి ఆమెవద్దకు తీసికొని పొమ్మనిప్రాధేయపడెను.అంత ఆమె భర్తను వీపుపై నెక్కించుకుని చీకటిలో వేశ్యాగృహమునకు తీసికొనపోవసాగినది.దారిలో శూలమునకు గుచ్చబడిన మాండవ్యునకు కౌశికుని శరీరము తగిలినది.అంత మాండవ్యుడు బాధపడుచూ ఇతడు సూర్యోదయమగుసరికి చనిపోవుగాక అని శపించెను.కాని కౌశికుని భార్యపతివ్రత అగుటచే అతనిని బ్రతికించుకొన గలిగినది.

మణ్డవ్యుని తపసు కొనసాగింపు[మార్చు]

మాండవ్యుడు శూలముపైనే ఉండి తపస్సును యథావిధిగా చేయుచుండెను.అతడు తపస్సునకు మెచ్చి మునులు పక్షులై రాత్రివేళ వచ్చి మాండవ్య మునీంద్రా మహాతపస్వినివైన నీకీ శిక్ష ఎవరూ విధించారు అని అడగగా మాండవ్యుడు మునులారా నేను అపరాధము చేయలేదు.నాకీ శిక్ష ఎందువలన సంభవించినదో తెలియదు అని మౌనము వహించెను.విని మునులు తమ తమ ఆశ్రమములకు వెళ్ళిపోయిరి.కొంతకాలమునకు రాజు,మాండవ్యుడు మహాబుషుని గ్రహించి క్షమించమని ప్రాధేయపడ్డాడు. అంత మాండవ్య మహర్షి రాజా ఇది నా పురాకృత ఖర్మము.నీ దోషమేమియు లేదు అని పలకగా రాజు సంతసించి శూలము నుండి అతనిని బయటకు తీయ ప్రయత్నించెను. ఆ శాలపీషము మేకువలె ముని కంఠమున నిలిచి పోయినది.ఎంత ప్రయత్నించినను అది రాలేదు.అనాటి నుండి మాండవ్యుడు అని మాండవ్యుడని పిలవబడెడివాడు.

యమధర్మరాజును శపించుట[మార్చు]

తెలిసిఏ పాపము చేయని తనకు ఇట్టి శిక్ష విధించిన యముడిని చేరి యమధర్మరాజా ఏ పాపము చేయని నాకు ఇంత శిక్ష ఎందుకు విధించితివి అనగావిని యముడు మునీంద్రా ఒక్క విషయం. నీకు బాల్యమున తూనీగలను బాధించావు.ఆ పాపమునకు ఈ శిక్ష అనుభవించావు అని పలుకగా మాండవ్యుడు యమధర్మరాజా అజ్ఞాన దశలో పన్నెండేళ్ళ లోపునే చేసిన పాపము ధర్మశాస్త్రరీత్యా నాకంటదు.ఈ వయసున ఏమియూ తెలియదు.తెలియని వయసున చేసిన పాపం నా కంటకట్టినన్నీ విధంగా శిక్షించావు.దీనికి ప్రతిఫలం అనుభవించు.నీకు భూలోకమున శూద్రుడవై జన్మింతువు గాక అని శపించాడు. మాండవ్యుని శాపంతో యముడు విదురుడై జన్మించాడు.

ధర్మరాజును కలుసుకొనుట[మార్చు]

మహర్షులు జనకమహారాజును దర్శించుచూ పోవుచుండెడివారు.ఒకనాడు మాండవ్యుడు జనకుని దర్శనార్ధం వెళ్ళాడు జనకుడు మహాజ్ఞాని.ఆకారణంచే జ్ఞానులను సత్కరించే వాడు.వారి వల్ల ధర్మసూక్ష్మములు గ్రహించేవాడు.మాండవ్యుడు రాగా ఈ మహర్షి వల్ల అనేక ధర్మ విషయాలు తెలిసికొన్నాడు.జనకుని వల్ల మాండవ్యుడు కూడ అనేక విషయాలు గ్రహించాడు. మరి కొన్నాళ్ళకు మాండవ్యుడు ధర్మరాజును దర్శించాడు.ధర్మరాజు మాండవ్యుని ఆదరించి గౌరవించి సత్కరించి పూజించాడు అంత మాండవ్యుడు సంతోషించి ధర్మరాజును అనేక విషయాలు తెలిపి శివమహిమ గురించి వివరించిచెప్పాడు. శివస్మరణ వల్ల దు:ఖములు నశించునని నిత్య శివస్మరణ చేయుమని ఉపదేశించాడు మాండవ్యుడు మునిగా జీవితం గడిపి కౌశికుడను వానిని శపించి,యమునకు శాపమిచ్చి ,జనక,ధర్మరాజాదులను జ్ఞానోపదేశం చేసి తన శక్తి సామర్ధ్యాలు ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తపశ్శాలి.

వెలుపలి లింకులు[మార్చు]