ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
విషయ సూచిక |
[మార్చు] ఆంధ్ర రాష్ట్రం
ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950జనవరి 26 న భారత రాజ్యాంగం అమలౌలోకి వచ్చిన రోజున మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబర్ 1 న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు. మద్రాసు ప్రెసిడెన్సీ,మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా కొరకు తమిళనాడు ముఖ్యమంత్రులు చూడండి
| సంఖ్య | పేరు | ఆరంభము | అంతము |
| 1 | టంగుటూరి ప్రకాశం పంతులు | 1953 అక్టోబర్ 1 | 1954 నవంబర్ 15 |
| 2 | రాష్ట్రపతి పాలన | 1954 నవంబర్ 15 | 1955 మార్చి 28 |
| 3 | బెజవాడ గోపాలరెడ్డి | 1955 మార్చి 28 | 1956 నవంబర్ 1 |
[మార్చు] హైదరాబాదు రాష్ట్రం
ప్రస్తుత తెలంగాణ ప్రాంతం, కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఒకప్పుడు నిజాము సంస్థానంలో భాగంగా ఉండేది. స్వాతంత్ర్యం తరువాత, భారత ప్రభుత్వం నిజాము సంస్థానంపై జరిపిన పోలీసు చర్య తరువాత, ఈ ప్రాంతాలు హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడ్డాయి. 1956 నవంబర్ 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలాను విడదీసి, ఆంధ్ర రాష్ట్రం తో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు.
| సంఖ్య | పేరు | ఆరంభము | అంతము |
| 1 | జనరల్ జె ఎన్ చౌదరి | 1948 సెప్టెంబర్ 17 | 1950 జనవరి 26 |
| 2 | ఎం కె వెల్లోడి | 1950 జనవరి 26 | 1952 మార్చి 6 |
| 3 | బూర్గుల రామకృష్ణారావు | 1952 మార్చి 6 | 1956 అక్టోబర్ 31 |
[మార్చు] ఆంధ్ర ప్రదేశ్
[మార్చు] బయటి లింకులు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైటు

