Coordinates: 16°00′08″N 81°02′30″E / 16.002222°N 81.041667°E / 16.002222; 81.041667

కోడూరు (కృష్ణా)

వికీపీడియా నుండి
(కోడూరు, కృష్ణా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కోడూరు (కృష్ణా)
—  రెవెన్యూ గ్రామం  —
కోడూరు (కృష్ణా) is located in Andhra Pradesh
కోడూరు (కృష్ణా)
కోడూరు (కృష్ణా)
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°00′08″N 81°02′30″E / 16.002222°N 81.041667°E / 16.002222; 81.041667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి దాసరి విమల
జనాభా (2011)
 - మొత్తం 14,747
 - పురుషులు 7,423
 - స్త్రీలు 7,324
 - గృహాల సంఖ్య 4,438
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08671

కోడూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లా, కోడూరు మండలం లోని ఒక గ్రామం. ఇది సమీప పట్టణమైన రేపల్లె నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4438 ఇళ్లతో, 14747 జనాభాతో 2228 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7423, ఆడవారి సంఖ్య 7324. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1895 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 367. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589794.[1]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల చల్లపల్లిలో ఉంది. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్‌ రామచంద్రపురంలోను, మేనేజిమెంటు కళాశాల మచిలీపట్నంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చల్లపల్లిలోను, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

  • మారుతీ కళాశాల.
  • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల,నాయుడుపేట.
  • ప్రభుత్వ పాఠశాల:- కోడూరులోని వడ్డెర కాలనీలోని ఈ పాఠశాలలో, 6.6 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల విభాగాన్ని, 2015,నవంబరు-2వ తేదీనాడు ప్రారంభించారు.
  • రవితేజ పాఠశాల:- శ్రీ కోట రాఘవయ్య విద్యాసంస్థలకు అనుబంధంగా ఉన్న ఈ పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం, 2015,మార్చ్-20వ తేదీ నాడు నిర్వహించెదరు.
  • లయోలా పబ్లిక్ హైస్కూల్, శ్రీ వాణి నికేతన్, ఎస్.బాలభాను హైస్కూల్, కోడూరు

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కోడూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కోడూరులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

కోడూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 512 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1715 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1715 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కోడూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1715 హె

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ నామ వివరణ[మార్చు]

కోడూరు అనే గ్రామనామం కోడు అనే పూర్వపదం, ఊరు అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కోడు అనే పదం జలసూచి కాగా ఊరు అనే పదం జనపదసూచి. కోడుకు అర్థం చిన్న నది లేదా నదియొక్క శాఖ లేదా ఊరి దగ్గర నీటిపల్లం లేదా కొండాకోన.[2]

మౌలిక సదుపాయాలు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

  1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
  2. ది కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్.

టి.టి.డి.కళ్యాణమండపం[మార్చు]

గ్రామ పంచాయితీ[మార్చు]

2013లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో దాసరి విమల సర్పంచిగా ఎన్నికైంది. ఉప సర్పంచిగా జరుగు వెంకటేశ్వరరావు ఎన్నికైనాడు.[3] కోడూరు గ్రామ పంచాయతీ 2017,ఫిబ్రవరి-23న 65వ వార్షికోత్సవాన్ని జరుపుకొనుచున్నది.[4]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయం[మార్చు]

ఆలయంలో స్వామివారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు, 2014,జూన్-9, సోమవారం నుండి ప్రారంభమైనవి. ఈ ఉత్సవాల కొరకు ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దినారు. సోమవారం ఉదయం స్వామివారికి అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభమైనవి. సాయంత్రం 7 గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. ధ్వజారోహణ, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు. 10వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం నిర్వహించారు. రాత్రికి కోడూరు గ్రామంలోని వంతెన వద్ద ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద ఎదురుకోలు ఉత్సవం నిర్వహించారు. 11వ తేదీ బుధవారం ఉదయం కౌతుకోత్సవం, రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. 12వ తేదీ గురువారం ఉదయం ఆలయంలో గరుడ, శేషవాహనాలకు ప్రత్యేకపూజా కార్యక్రమాలను, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం, స్వామివారు అమ్మవార్లతో కలిసి, కోడూరులో తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 13వ తేదీ శుక్రవారం ఉదయం, వసంతోత్సవం (అవభృథస్నానం) కార్యక్రమాన్ని వేదపండితులు, శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి శేషవాహనంపై ఊరేగింపుగా యర్రారెడ్డిపాలెం, ఇస్మాయిల్ బేగ్ పేట, కృష్ణాపురం గ్రామాలలో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. 14వ తేదీ శనివారం నాడు, ఉదయం స్వామివారి శాంతికల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలు 15వ తేదీ ఆదివారం వరకు కొనసాగినవి. 16వ తేదీ సోమవారం పది వేల మందికి, అన్నసమారాధన నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, 16 రోజుల పండుగ సందర్భంగా, జూన్-26, గురువారం నాడు, స్వామివారి శాంతికల్యాణం, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

  • శ్రీ పార్వతీ సమేత స్వామివారి ఆలయం- ఈ అలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం, ఏడురోజులపాటు "అఖండ శివనామ సప్తాహం" భకిశ్రద్ధలతో నిర్వహించెదరు. 2014, అక్టోబరు-25, కార్తీకమాసం, విదియ, శనివారం నాడు, భక్తులు బృందాలుగా ఏర్పడి, ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, 2015,మే నెల-15వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభించారు. 16వ తేదె శనివారంనాడు రాత్రి 9 గంటలకు కళ్యాణం నిర్వహించెదరు.

శ్రీ గంగాభవానీ అమ్మవారి దేవాలయం[మార్చు]

  • కోడూరు గ్రామంలో వెలసిన శ్రీ గంగాభవానీ అమ్మవారి దేవాలయంలో, అమ్మవారి 39వ వార్షిక జాతర మహోత్సవాలు, 2014,మార్చ్-28, శుక్రవారం నుండి ప్రారంభమగును. శుక్రవారం ఉదయం, అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఊరేగింపును ప్రారంభించెదరు. ఈ ఊరేగింపు, కోడూరులో మొదలై, కోడూరు పరిసరప్రాంతాలలో తిరుగాడి, నరసింహాపురం, కృష్ణాపురం, ఇస్మాయిల్ బేగ్ పేట, యెర్రారెడ్డిపాలెం మీదుగా ఆలయానికి చేరుకోవడంతో, జాతర ఉత్సవాలు ముగియును. 2014,మార్చ్-31, ఉగాదిరోజున పశువుల మ్రొక్కుబడులు, పోతురాజు సంబరాన్నీ నిర్వహించెదరు. 2014,ఏప్రిల్-1 నాడు, ప్రధాన గుడి సంబరాన్ని నిర్వహించెదరు. [1]
  • ఈ ఆలయ తృతీయ పునః ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,ఫిబ్రవరి-26,27 తేదీలలో నిర్వహించారు. 26వ తేదీనాడు అమ్మవారి మూల విరాట్టుకు విశేష అభిషేకం, పూజాకార్యక్రమాలు, సాయంత్రం ఆరు గంటలకు దీపాలంకరణసేవ, పుష్పపూజ, చండీహోమానికి సంకల్పం, గణపతి పూజ, అఖండస్థాపన, మంటపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. 27వ తేదీ ఉదయం 8 గంటలకు మహాచండీ యాగం నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
  • ఈ ఆలయం పంచమ పునఃప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా, 2017,ఫిబ్రవరి-26వతేదీ శనివారం ఉదయం అమ్మవారి మూలవిరాట్టుకు విశేష అభిషేకాలు, కుంకుమ పూజలు, 27వతేదీ ఆదివారంనాడు మహాచండీ యాగం నిర్వహించెదరు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించెదరు.
  • శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం
  • శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం
  • శ్రీ దానాశక్తి ప్రార్థనా మందిరం
  • శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం

కోడూరులోని వీవర్స్ కాలనీలో నెలకొన్న ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా, ఆలయంలో, 2015,మే నెల-30వ తేదీ శనివారంనాడు, గణపతిపూజతో ఉత్సవాలు ప్రారంభించారు. ఆరోజు సాయంత్రం అఖండస్థాపన, దీక్షాధారణ, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. 31వ తేదీ ఆదివారంనాడు, స్వామివారికి అష్టోత్తర శతకలశములచే విశేష అభిషేకం, రాత్రికి మహా పడిపూజ నిర్వహించారు. జూన్-1వ తేదీ సోమవారంనాడు, ఉదయం 11-00 గంటలకు మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి, అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం వసంతోత్సవం, ధ్వజావరోహణ కార్యక్రమాలతో ఉత్సవాలను ముగించారు.

శ్రీ సీతారామస్వామివారి ఆలయం[మార్చు]

కోడూరు గ్రామములోని వడ్డెర కాలనీలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని, 2016,ఏప్రిల్-2వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం వేదపండితులు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నులపండివగా నిర్వహించారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

ప్రధాన వృత్తులు[మార్చు]

కోడూరు ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, మస్త్య్హ సాగు మీద అధారపడి జీవిస్తున్నారు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

లంకే వెంకటస్వామి భాగవతార్[మార్చు]

  • వీరు గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఓలేరు గ్రామంలో 1941లో జన్మించారు. వీరి తల్లిదండ్రుల కులవృత్తి చేపలవేట. వీరు 1983 నుండి కృష్ణా జిల్లా కోడూరు గ్రామం (కోడూరు మండలం) లో 1983 నుండి ఉంటున్నారు. వీరు తన 13వ ఏటనుండియే గాయకుడిగా స్టేజిపై పాటలు పాడటం మొదలుపెట్టినారు. 1958, నవంబరు-2న కృష్ణా జిల్లా కాజ గ్రామంలో తొలిసారిగా "మాభూమి" నాటకంలో కరణం పాత్రతో నాటకంరంగంలో ఆరంగేట్రం చేశారు. వీరు హరికథాపితామహుడిగా బాగా పేరుపొందినారు. ఐదు దశాబ్దాలుగా వీరు 1249 హరికథలు, 109 నాటకాలు, 4 సినిమాలలో నటించి, సాంఘిక నాటకాలకు దర్శకత్వం వహించి, కళాసేవ చేస్తున్నారు. వీరు 2001 నుండి వృద్ధకళాకారుడిగా, ప్రభుత్వం వారిచ్చే 500 రూపాయల పింఛనుతోనే కాలంగడుపుతున్నారు.
  • వీరిని ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా, 2015, మార్చ్-20వ తేదీనాడు, కోడూరులోని పంచాయతీ కార్యాలయంలో, సన్మానించారు. యర్రారెడ్డిపాలెం గ్రామానికి చెందిన శ్రీ బండే భూషయ్య కళాపీఠం వారి ఆధ్వర్యంలో, శ్రీ బండే శేషగిరిరావు, వీరిని ఘనంగా సన్మానించారు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 232. Retrieved 10 March 2015.
  3. ఈనాడు కృష్ణా ఆగష్టు 3, 2013. 3వ పేజీ
  4. ఈనాడు అమరావతి/అవనిగడ్డ;2017,ఫిబ్రవరి-23;2వపేజీ. 3వపేజీ

వెలుపలి లంకెలు[మార్చు]