మగధ ఎక్స్ప్రెస్
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్ప్రెస్ | ||||
స్థానికత | బీహార్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ | ||||
తొలి సేవ | 1980 | ||||
ప్రస్తుతం నడిపేవారు | ఉత్తర మధ్య రైల్వే మండలం | ||||
ప్రయాణికుల దినసరి సంఖ్య | భారతీయ రైల్వేలు | ||||
మార్గం | |||||
మొదలు | ఇస్లాంపూర్ | ||||
ఆగే స్టేషనులు | 25 | ||||
గమ్యం | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ | ||||
ప్రయాణ దూరం | 1,064 కి.మీ. (661 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 19గంటల 35నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | రోజూ | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎ.సి మొదటి తరగతి,ఎ.సి రెండవ తరగతి,ఎ.సి మూడవ తరగతి,స్లీపర్ క్లాస్,జనరల్ | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు | ||||
పడుకునేందుకు సదుపాయాలు | కలదు | ||||
ఆహార సదుపాయాలు | లేదు | ||||
చూడదగ్గ సదుపాయాలు | Large Windows | ||||
బ్యాగేజీ సదుపాయాలు | Available | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 54 km/h (34 mph) average with halts | ||||
|
మగధ ఎక్స్ప్రెస్ న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ ఇస్లాంపూర్ మద్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.మొదతిగా ఈ రైలును ప్రారంభించినప్పుడు సోన్బధ్ర ఎక్స్ప్రెస్ అనేపేరుతో పాట్నా, న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ ల మద్య నడిచేది.విక్రమశీల ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన తరువాత ఈ రైలు పేరును మగధ ఎక్స్ప్రెస్ గా మార్చారు.ఈ రైలును మొదటగా తూర్పు రైల్వే మండలం ద్వారా నడిపినసప్పటికీ ప్రస్తుతం ఉత్తర మధ్య రైల్వే దీనిని నిర్వహిస్తుంది.
చరిత్ర
[మార్చు]మగధ ఎక్స్ప్రెస్ ను 1980వ సంవత్సరంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్-పాట్నా ల మద్య సోన్బధ్ర ఎక్స్ప్రెస్ అను పేరుతో ప్రారంభించారు.పాట్నా నుండి భగల్పూర్ వరకు విక్రమశీల ఎక్స్ప్రెస్ పేరుతో నడిచేది.ఈ రైలు 998కిలో మీటర్ల దూరాన్నీ 15గంటల 5నిమిషాల వ్యవధిలోనే పూర్తిచేసేది.తవాత ఈ రైలు ఆగు స్టేషన్ల సంఖ్య పెరగడం కొత్త సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ళు, సంపర్క్ క్రాంతి రైళ్ళు ప్రవేశపెట్టడంతో ఈ రైలు ప్రాధాన్యత తగ్గింది.
రైలు నెంబర్
[మార్చు]మగధ ఎక్స్ప్రెస్ ను 1980వ సంవత్సరంలో 2391/92 నెంబరుతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్-పాట్నా ల మద్య నడిచేది.అక్కడినుండి భగల్పూర్ వరకు 3467/68 నెంబరుతో పేరుతో నడిచేది.ప్రస్తుతం ఈ రైలు 12401/ 12402 నెంబరుతో నడుస్తుంది.
ప్రయాణ మార్గం
[మార్చు]మగధ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సాయంత్రం 04గంటల 10నిమిషాలకు ఇస్లాంపూర్లో బయలుదేరి పాట్నా, బక్సార్, జామనియ, మొఘల్ సరై, అలహాబాద్, కాన్పూర్, అలీఘర్ ల మీదుగా ప్రయాణిస్తూ మరునాడు ఉదయం 11గంటల 50నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.
ట్రాక్షన్
[మార్చు]12401/02 మగధ ఎక్స్ప్రెస్ కు ఇస్లాంపూర్ నుండి పాట్నా వరకు సమస్తిపూర్ లోకోషెడ్ ఆధారిత WDM-3A/మొఘల్ సరై లోకోషేడ్ ఆధారిత WDM-3A డీజిల్ లోకోను ఉపయోగిస్తారు.అక్కడి నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు కాన్పూర్ లోకోషెడ్ ఆధారిత WAP-4 విద్యుత్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.
కోచ్ల అమరిక
[మార్చు]12401/02 మగధ ఎక్స్ప్రెస్ లో 1మొదటి తరగతి ఎ.సి భోగీ,1 రెండవ తరగతి ఎ.సి భోగీ,4మూడవ తరగతి ఎ.సి భోగీ,10స్లీపర్ క్లాస్ భోగీలు,6జనరల్ భోగీలతో కలిపి మొత్తం 24భోగీలుంటాయి.
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | జనరల్ | జనరల్ | జనరల్ | ఎస్10 | ఎస్9 | ఎస్8 | ఎస్7 | ఎస్6 | ఎస్5 | ఎస్4 | ఎస్3 | ఎస్2 | ఎస్1 | హెచ్.ఎ1 | ఎ1 | బి4 | బి3 | బి2 | బి1 | జనరల్ | జనరల్ | జనరల్ | SLR | ![]() |
ఇతర సంఘటనలు
[మార్చు]- 2010 జనవరి 2న పొగమంచు కారణంగా మగధ ఎక్స్ప్రెస్ లిచ్చవి ఎక్స్ప్రెస్ను ఈటవా నగర సమీపంలో ఢీ కొంది.ఈ ప్రమాదంలో లోకోపైలెట్ తో సహా పదిమంది గాయపడ్డారు.