ఈశాన్య సరిహద్దు రైల్వే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈశాన్య సరిహద్దు రైల్వే
Northeast Frontier Railway
3-ఈశాన్య సరిహద్దు రైల్వే
లొకేల్అసోం, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, సిక్కిం, మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ, మిజోరం , బీహార్
ఆపరేషన్ తేదీలు15 జనవరి 1958–ప్రస్తుతం
మునుపటిదిఈశాన్య రైల్వే
ప్రధానకార్యాలయంకామాఖ్య రైల్వే స్టేషను, మలిగావ్, గౌహతి
జాలగూడు (వెబ్సైట్)NFR official website

ఈశాన్య సరిహద్దు రైల్వే, సంక్షిప్తంగా ఎన్‌ఎఫ్ రైల్వేగా పిలబడే భారత దేశము లోని 17 రైల్వే మండలాలు వాటిలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం అసోం రాష్ట్రంలో గౌహతి డివిజనులో మలిగావ్, ఇది ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్ లోని కొన్ని భాగాలకు మొత్తం రైల్వే కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. ఈశాన్య సరిహద్దు రైల్వే 5 డివిజనులుగా విభజించబడింది:

  • అలీపూర్‌ద్వార్ రైల్వే డివిజను
  • కతిహార్ రైల్వే డివిజను
  • లుండింగ్ రైల్వే డివిజను
  • రంగియా రైల్వే డివిజను
  • టిన్‌సుకియా రైల్వే డివిజను

ఈ ప్రతి డివిజనుకు భారతదేశం ప్రభుత్వం యొక్క ఒక డివిజనల్ రైల్వే మేనేజర్, జాయింట్ సెక్రటరీ హోదాలో ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్ గ్రేడ్ అధికారి నేతృత్వం వహిస్తారు. ఈ జోను ప్రధాన కార్యాలయము స్థాయి, క్షేత్ర స్థాయి డివిజనల్ సహాయ సహకార అమరిక వివిధ శాఖల విభాగాలు జోనల్ రైల్వే జనరల్ మేనేజర్ నేత్రుత్వంలో పనిచేస్తుంది. వివిధ శాఖలు అయిన ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ & టెలికాం, కార్యకలాపాలు, వాణిజ్య, భద్రత, ఖాతాలు, క్షేమము, వ్యక్తిగత, వైద్య విభాగాలకు సీనియర్ అడ్మినిస్ట్రేటర్ గ్రేడ్ / హైయర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ అధికారి నేతృత్వంలో రైళ్ల రాకపోకలులో సాంకేతిక, కార్యాచరణ మద్దతును అందించడానికి పనిచేస్తారు.

చరిత్ర[మార్చు]

అలీపూర్‌ద్వార్ జంక్షన్ రైల్వే స్టేషను

1881 లో, అస్సాం రైల్వే అండ్ ట్రేడింగ్ కంపెనీ మీటర్ గేజ్ ట్రాక్ ఏర్పాటు చేసినప్పుడు రైల్వే మొదటి సారిగా ఈశాన్య సరిహద్దు అసోంలో లో ప్రవేశించింది. ఈ 65 కిలోమీటర్ల పొడవైన డిబ్రూఘర్ నుండి మార్ఘేరిటా వరకు మీటర్ గేజ్ రైలు మార్గము ప్రధానంగా టీ, బొగ్గు రవాణా కోసం నిర్మించారు. ఈ కంపెనీ వారు తరువాత డిబ్రూ సాడియా రైల్వే పేరుతో అస్సాంలో మొట్టమొదటి ప్రయాణీకుల రైలును ప్రారంభించారు.

నార్త్ ఈస్టర్న్ రైల్వే, రెండు రైల్వే వ్యవస్థలు అయిన అస్సాం రైల్వే, ఔధ్, తిర్హట్ రైల్వే విలీనం ద్వారా 1952 ఏప్రిల్ 14 సం.లో ఏర్పడినది. తరువాత, 1958 జనవరి 15 సం.లో, ఈశాన్య భారతదేశం రాష్ట్రాల యొక్క అవసరాలను మరింతగా తీర్చేందుకు ఉత్తర తూర్పు రైల్వే, ఈశాన్య సరిహద్దు రైల్వే అనే రెండు రైల్వే మండలాలుగా విభజించబడింది.[1] రైల్వే సేవ, త్రిపురలో 1964 సం.లో స్థాపించబడింది,[2] కానీ అది ధర్మనగర్, కైలాషహర్ వరకు పరిమితం చేయబడింది.

ఈశాన్య రాష్ట్ర రాజధాని 1853 సం.లో ఉపఖండంలో రైల్వేలు రావడంతో భారతదేశం యొక్క రైలు మాప్ లోనికి వచ్చింది, 119 కి.మీ. కుమార్‌ఘాట్ - అగర్తలా రైల్వే ప్రాజెక్టు పునాది రాయి మాజీ ప్రధాని హెచ్‌.డి. దేవెగౌడ 1996 సం.లో వేశారు. తరువాత చివరకు కొద్దిగా కంటే ఎక్కువ ఒక దశాబ్దం తర్వాత, రైల్వేలో త్రిపుర రాజధాని అగర్తల నగరం ప్రవేశించింది. అంతేకాకుండా, ప్రయాణికులు ప్రాంతంగా ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది రైల్వే రాష్ట్రంలో ఒక విజయం గుర్తుగా ఉంది. అగర్తల నుండి రాబోయే దశాబ్దంలో ఒక మంచి, వేగవంతమైన రైళ్లు ఆశించారు.

అగర్తాల రైల్వే స్టేషను

ఆపరేషనల్ ప్రాంతం[మార్చు]

ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ రైల్వే లైన్లు మ్యాప్
దిబ్రూగఢ్ రైల్వే స్టేషను

ఈశాన్య సరిహద్దు రైల్వే కార్యకలాపాల ప్రాంతంలో అసాధారణమైన అందం కలిగి ఉంది, అదే విధంగా కొన్ని ప్రాంతాలు అత్యంత కఠినమైనవి. ఈ కఠినమైన భూభాగాలపై రైలు నెట్వర్క్ విస్తరణ పరిమితం, ఒక మంచి రైలు నెట్‌వర్క్‌తో ఉన్నరాష్ట్రం అసోం మాత్రమే. అనేక ప్రాంతాల్లో రైలు మార్గములు బ్రాడ్ గేజ్ కాదు, కొన్ని రైలు మార్గములు పురాతనంగా ఉన్నాయి. అందువలన, కొన్ని విభాగాలు వద్ద వేగం 30 కిలోమీటర్ల గరిష్ఠ పరిమితం అయ్యింది. సరైఘాట్ వంతెనను నిర్మించక ముందు, బ్రహ్మపుత్రా నది యొక్క ఒక వైపున ఉన్న అమీన్‌గావ్ వద్ద ప్రయాణికులు క్రిందికి దిగవలసి వచ్చింది, పాండు జంక్షన్ వరకు పడవలో వెళ్ళి తదుపరి వారు వారి ప్రయాణం ఎక్కడకు వెళ్ళాలో కొనసాగించే వారు.

అత్యధిక భాగం రైలు మార్గములు బ్రాడ్ గేజ్‌గా మార్చారు, విద్యుదీకరణ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కతిహార్ నుండి గౌహతి వరకు విద్యుదీకరణ పనులు ప్రారంభమయ్యాయి.

ముఖ్య విభాగాలు[మార్చు]

ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ కింద కొన్ని ముఖ్య విభాగాలు ఉన్నాయి:

డార్జిలింగ్ హిమాలయ రైల్వే[మార్చు]

డార్జిలింగ్ - ఘూం వారసత్వ నారో గేజ్ రైలు

డార్జిలింగ్ హిమాలయ రైల్వే (డిహెచ్‌ఆర్) న్యూ జల్పైగురి (సిలిగురి) నుండి 6.850 అడుగులు (2,090 మీ) వద్ద చేరుకుంటారు; అధిరోహణ, సుక్నా వద్ద ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణం ఘుమ్ కు నిరంతరాయంగా కొనసాగుతుంది (7,407 అడుగులు లేదా 2,258 మీ), తుది 5 మైళ్ళు (8.0 కిమీ) డార్జిలింగ్ వద్ద దిగుతుంది. స్వాతంత్ర్యం తరువాత, భారతదేశం యొక్క విభజన ఫలితంగా ఈశాన్య ప్రాంతం విడిగా ఉంది. తత్ఫలితము, డార్జిలింగ్ హిమాలయ రైల్వే (డిహెచ్‌ఆర్) అస్సాం రైల్వేలో విలీనమైంది, అస్సాం - బెంగాల్ లింక్ (లైన్) రైలు మార్గము నిర్మాణం కోసం డార్జిలింగ్ హిమాలయ రైల్వే మూసివేయడమైనది, దాని పొడిగింపు రైలు మార్గములలో ఒకటి అయిన కిషన్‌గంజ్ ను మీటర్ గేజ్ కు మార్చారు. డార్జిలింగ్ హిమాలయ రైల్వే యొక్క ఇతర పొడిగింపు రైలు మార్గము అయిన కాలింపాంగ్ వరదల కారణంగా మొత్తం కొట్టుకు పోయింది. పునః ప్రారంభమున, డార్జిలింగ్ హిమాలయ రైల్వే 1952 సం.లో ఉత్తర తూర్పు రైల్వే లో తరువాత 1958 సం.లో ఈశాన్య సరిహద్దు రైల్వే లోకి విలీనం చేయబడింది.

కీర్తి శిఖరాలు[మార్చు]

డార్జిలింగ్ హిమాలయ రైల్వే అనేక కారణాల వల్ల ప్రపంచ వ్యాప్త కీర్తి సాధించింది. అవి:

  • హిమాలయాలకు ఒక గేట్‌వే.
  • 19 వ శతాబ్దం యొక్క చిన్న నాలుగు చక్రాల ఆవిరి లోకోమోటివ్ లు.
  • రైలు రోడ్డు మార్గములో వక్రతల వంపులు (కర్వులు), ఉచ్చులు (లూపులు), "జడ్"లు, నిట్రమైన తరగతులు (స్టీప్ గ్రేడ్స్) రోడ్డు కలిగినది.

డార్జిలింగ్ హిమాలయ రైల్వేలో అన్ని సమస్యలతో పాటు ఒక ఆసక్తికర విషయం మాత్రం, ఇది చాలా భారీ నష్టాలు కలిగి నిలబడి, నడుపుతూ కొనసాగిస్తున్నటు వంటి రైల్వే మాత్రం కాదు అని ధ్రువీకరించింది. ఆవిరి లోకోమోటివ్ ఈ రైల్వే యొక్క ఒక చిహ్నం. తిన్ధరియా వర్క్ షాప్ లో 13 (లోకోమోటివ్‌లు) వాహనములు ఇప్పటికీ శేష జీవిగా జీవించి నిలుపుకుంది, వీటిలో కొన్ని 100 సంవత్సరాల పైబడినవి, అతి చిన్న వయస్సు కల వాటికి 70 సంవత్సరాలు ఉంటాయి.

డార్జిలింగ్ హిమాలయ రైల్వే కాలక్రమం[మార్చు]

  • 1948 జనవరి 20: భారతదేశం యొక్క ప్రభుత్వం కొనుగోలు
  • 1948 జనవరి 26: అస్సాం రైల్ లింక్ బదిలీ
  • 1950 జనవరి 26: అస్సాం రైల్వే బదిలీ
  • 1952 జనవరి 14: నార్త్ ఈస్టర్న్ రైల్వే బదిలీ
  • 1958 జనవరి 15: ఈశాన్య సరిహద్దు రైల్వే బదిలీ

గుర్తించదగిన రైళ్లు[మార్చు]

జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
కజిరంగా ఎక్స్‌ప్రెస్
మహానందా ఎక్స్‌ప్రెస్

ఈ కింది సూచించి బడినవి ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్‌చే నిర్వహించబడుతున్న గుర్తించదగిన రైళ్ల జాబితా:

ఇవి కూడా చూడండి[మార్చు]

గౌహతి రైల్వే స్టేషను

మూలాలు[మార్చు]

  1. Rao, M.A. (1988). Indian Railways, New Delhi: National Book Trust, pp.42-4
  2. "Agartala now on India's rail map". iGovernment › Infrastructure. igovernment.in. Archived from the original on 15 జూన్ 2013. Retrieved 12 April 2013.

బయటి లింకులు[మార్చు]