విజయవాడ-చెన్నై రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయవాడ-చెన్నై రైలు మార్గము
విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ విజయవాడ-చెన్నై విభాగంలో ఒక ముఖ్యమైన రైలు
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు
చివరిస్థానంవిజయవాడ
చెన్నై సెంట్రల్
ఆపరేషన్
ప్రారంభోత్సవం1899
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే జోన్
సాంకేతికం
ట్రాక్ పొడవు455 km (283 mi)
ట్రాకుల సంఖ్య2
ట్రాక్ గేజ్1676 బ్రాడ్‌గేజ్
ఆపరేటింగ్ వేగం160 km/h (99 mph) వరకు

విజయవాడ-చెన్నై విభాగం (విజయవాడ-చెన్నై మార్గము కూడా ) భారతదేశము, ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలోని విజయవాడ, తమిళనాడు రాష్ట్రములో చెన్నై సెంట్రల్ కలుపుతున్న రైల్వే (లైన్) మార్గము. ఈ ప్రధాన లైన్ హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఇతర ట్రంక్ రూట్ల లోని భాగం.

భౌగోళికం

విజయవాడ-చెన్నై లైన్ కోరమాండల్ తీరంతో పాటు,తూర్పు కనుమలు బంగాళాఖాతం మధ్య నుండి నడుస్తుంది. దీని ప్రధాన లైన్ విజయవాడ నుండి నిష్క్రమణ తర్వాత వెంటనే కృష్ణ దాటుతుంది..[1][2]

రైల్వే జోన్ అధికార పరిధి

విజయవాడ-గూడూరు మార్గము, దక్షిణ మధ్య రైల్వే పరిపాలనా పరిధిలోని ఉంది. మిగిలిన ప్రధాన లైన్ గూడూరు దక్షిణం నుండి దక్షిణ రైల్వే పరిపాలనా పరిధిలోని ఉంది.[3] గూడూరు-రేణిగుంట-ఆర్కోణం బ్రాంచి లైన్ రేణిగుంట వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోను, మిగిలినది దక్షిణ రైల్వే పరిధిలోని ఉంది.[4] రేణిగుంట-కాట్పాడి బ్రాంచి లైన్ బొమ్మసముద్రం వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోను, కాట్పాడి మాత్రమే దక్షిణ రైల్వే పరిధిలోని ఉంది.[5]

చెన్నై సబర్బన్ సేవలు

చెన్నై సబర్బన్ రైల్వే, చెన్నై సెంట్రల్, సూళ్ళూరుపేట మధ్య ఈఎంయు (ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్) రైళ్లు 20 మధ్యంతర స్టేషన్ల ద్వారా నడుపుతుంది. ఈఎంయు రైళ్లు 2 గంటల షెడ్యూల్ సమయంలో 82 కి.మీ. (51 మైళ్ళు) దూరం ప్రయాణం చేస్తాయి.[6] 2005 నాటికి, 100,000 మంది ప్రయాణికులు రోజూ ఈ రంగంలో ఈఎంయు సేవలు ఉపయోగిస్తారు.[7] ఈఎంయు రైళ్లు కూడా చెన్నై సబర్బన్ (పశ్చిమ మార్గము) ద్వారా చెన్నై సెంట్రల్, ఆర్కోణం మధ్య నిర్వహించ (నడప) బడుతున్నాయి. (జతచేసిన చార్ట్‌లో చూపబడవు). ఇవి 1 గంట 50 నిమిషాలు ఒక షెడ్యూల్ సమయంలో 27 హాల్ట్‌లతో 68 కిలోమీటర్ల (42 మైళ్ళు) దూరం ప్రయాణం చేస్తాయి.[8] 2005 నాటికి, 200,000 మంది ప్రయాణికులు రోజూ ఈ రంగంలో ఈఎంయు సేవలు ఉపయోగించారు.[7] ఒక మెమో రైలు చెన్నై సెంట్రల్ నుండి తిరుపతి వరకు ప్రధాన మార్గం మధ్య వయా పశ్చిమ ఉత్తర మార్గము ద్వారా నిర్వహించబడుతున్నది. ఇది 4 గంట 25 నిమిషాలు వ్యవధిలో ఒక షెడ్యూల్ సమయంలో 13 హాల్టులతొ 160 కి.మీ. (99 మైళ్ళు) దూరంలో ప్రయాణిస్తుంది.[9]

చరిత్ర

చెన్నై లోని రోయపురం / వ్యాసర్పాడి నుండిఆర్కాట్ సమీపంలోని వలఝా రోడ్ (వలఝాపేట్) వరకు 100 కి.మీ. (62 మైళ్ళు) పరిధిలోమద్రాస్ రైల్వే కంపెనీ ద్వారా నిర్వహించబడుతున్న రైలు 1856 జూలై 1 సం.న దక్షిణ భారతదేశంలో మొదటి సేవలు ఉండేవి. 1861 సం.లో, ట్రంక్ రూట్ బెయ్పోర్ / కడలుండి (కాలికట్ దగ్గర)కు విస్తరించారు. భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే 1861-62 సం.లో నాగపట్నం, తిరుచునాపల్లి మధ్య 125 కి.మీ. (78 మైళ్ళు) పొడవైన మార్గాన్నిపూర్తి చేసింది. 1864-1868 సమయంలో, మద్రాస్ రైల్వే బెంగుళూర్ కంటోన్మెంట్ జోలార్పేటైతో జత (లింక్) చేసి. విడిగా సేలం వరకు దాని మార్గాలను విస్తరించింది.[10] 1890 సం.లో దక్షిణ మరాఠా రైల్వే కంపెనీ గోవాతో గుంతకల్ ఒక మీటర్ గేజ్ మార్గము (లైన్)తో పాటుగా, విజయవాడతో మార్మగోవా జత (లింక్ ) చేసింది.[11] 1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,287 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము, అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది,[12][13] ఇంతేకాక విజయవాడ-చెన్నై లింక్ నిర్మాణం భారతదేశం యొక్క తూర్పు తీరం ప్రాంతంలో 1899 సం.లో సరాసరి (ఎకాఎకీ) నడుపుటకు ప్రారంభించబడింది.[11] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[14]

రైల్వే పునర్వ్యవస్థీకరణ

1950 సం.ప్రారంభంలో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదించడం జరిగింది. 1951 సం. ఏప్రిల్ 14 న మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే, దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ, మైసూర్ స్టేట్ రైల్వే లను దక్షిణ రైల్వే జోన్ నిర్మించటానికి గాను, విలీనం చెయ్యబడ్డాయి. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు,, (2) దక్షిణ రైల్వే లో విలీనం చేయబడ్డ మద్రాసు రైల్వే, దక్షిణ మరాఠా రైల్వే లోని కొన్ని భాగాలను వేరుచేసి దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో దక్షిణ రైల్వే లోని గుంతకల్లు రైల్వే డివిజను దక్షిణ మధ్య రైల్వేకు, సోలాపూర్ రైల్వే డివిజను మధ్య రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల రైల్వే జోన్ అనేదాన్ని దక్షిణ రైల్వే నుండి వేరుచేసి ఆగ్నేయ రైల్వే/ (సౌత్ వెస్ట్రన్ రైల్వే)గా ఏర్పాటు చేశారు.[15]

విద్యుధ్ధీకరణ

హౌరా-చెన్నై మెయిల్ దక్షిణ తూర్పు రైల్వే లో 1965 సం.లో ఒక డీజిల్ ఇంజిన్ (డబ్ల్యుడిఎం-1) చే నడపబడిన మొదటి రైలుగా ఉంది. [16] విజయవాడ-చెన్నై విభాగం 1980 సం.లో పూర్తిగా విద్యుద్దీకరణ జరిగింది.[17] ఈ క్రింది విభాగాల విద్యుదీకరణ పని పూర్తి చేయడం ఈవిధంగా ఉంది:

  • 1979-80; విజయవాడ-చీరాల
  • 1980-81; చీరాల-ఒంగోలు, ఒంగోలు-ఉలవపాడు, ఉలవపాడు-బిట్రగుంట, బిట్రగుంట-పడుగుపాడు, పడుగుపాడు-గూడూరు
  • 1983-85; గూడూరు-వేంకటగిరి, వేంకటగిరి-రేణిగుంట, రేణిగుంట-తిరుపతి
  • 1982-85; ఆర్కోణం-రేణిగుంట
  • 1987-89; కృష్ణ కెనాల్-గుంటూరు, గుంటూరు-తెనాలి [18]

వేగ పరిమితులు

విజయవాడ-చెన్నై రైలు మార్గము లోని భాగమైన చెన్నై సెంట్రల్ నుండి న్యూఢిల్లీ వరకు ఉన్న రైలు మార్గము (గ్రాండ్ ట్రంక్ మార్గంగా), 160 కి.మీ/గంటకు వేగాన్ని అందుకోవచ్చును. ఇది ఒక "గ్రూప్ ఏ" మార్గముగా వర్గీకరించారు. బ్రాంచి మార్గముల వేగ పరిమితి 100 కి.మీ/గంటకు వరకు ఉంది.[19]

ప్రయాణీకుల సేవలు

ప్రధాన మార్గములో ఉన్న చెన్నై, విజయవాడ, నెల్లూరు స్టేషన్లు, బ్రాంచి మార్గములో ఉన్నటువంటి తిరుపతి, కాట్పాడి స్టేషన్లు భారతీయ రైల్వేలు లోని ప్రధాన 100 బుకింగ్ స్టేషన్ల పరిధిలో ఉన్నాయి.[20]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Coastal Plains of India". Country facts – the world at your finger tips. Archived from the original on 2013-05-30. Retrieved 2013-01-17.
  2. "The Coastal Plains of India". Zahie.com. Archived from the original on 2019-09-18. Retrieved 2013-01-17.
  3. "Vijayawada Chennai Jan Shatabdi". India Rail Info. Retrieved 2013-02-10.
  4. "Arakkonam Cudappah Passenge". India Rail Info. Retrieved 2013-02-10.
  5. "Tirupati Katpadi Passenger". India Rail Info. Retrieved 2013-02-10.
  6. "Sullurupeta Chennai EMU local". India Rail Info. Retrieved 2013-02-10.
  7. 7.0 7.1 "Public transport in Chennai and its suburbs". The Hindu, 15 March 2005. Archived from the original on 2007-02-17. Retrieved 2013-02-10.
  8. "Arakkonam Chennai EMU". India Rail Info. Retrieved 2013-02-10.
  9. "Tirupati- Chennai Central Passenger (MEMU)". India Rail Info. Retrieved 2013-02-10.
  10. "IR History – Early days". 1832-1869. IRFCA. Retrieved 2013-01-19.
  11. 11.0 11.1 "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-01-19.
  12. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-02.
  13. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 2012-10-11. Retrieved 2013-01-02.
  14. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  15. "Geography – Railway Zones". IRFCA. Retrieved 2013-01-23.
  16. "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
  17. "IR History Part VII (2000-present)". IRFCA. Retrieved 17 March 2014.
  18. "History of Electrification". IRFCA. Retrieved 2012-11-10.
  19. "Chapter II – The Maintenance of Permanent Way". Retrieved 2013-01-02.
  20. "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 2014-05-10. Retrieved 2012-12-30.

బయటి లింకులు