Jump to content

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంరాజధాని ఎక్స్‌ప్రెస్
స్థానికతకర్ణాటక, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ & ఢిల్లీ
తొలి సేవ01 నవంబరు 1992
ప్రస్తుతం నడిపేవారునైరుతి రైల్వే జోన్
మార్గం
మొదలుబెంగుళూరు
ఆగే స్టేషనులు10
గమ్యంహజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్
ప్రయాణ దూరం2,365 కి.మీ. (1,470 మై.)
సగటు ప్రయాణ సమయం33 గంటల 30 నిమిషాలు
రైలు నడిచే విధంప్రతిరోజూ
రైలు సంఖ్య(లు)22691 / 22692 (Mon, Wed, Thu, Sun) & 22693 / 22694 (Tue, Fri, Sat)
సదుపాయాలు
శ్రేణులుఏ.సి 1,2,3
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీకార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుLHB rakes No of rakes = 4
బ్యాగేజీ సదుపాయాలుAvailable
సాంకేతికత
పట్టాల గేజ్Broad Gauge
వేగం72 km/h (45 mph) average with halts; 130 km/h (81 mph) max

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు, కొత్త డిల్లీ మధ్య నడిచే రాజధాని రైలు.

నేపధ్యము

[మార్చు]

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు, కొత్త డిల్లీ మధ్య నడిచే అత్యంత వేగంగా నడిచే రైళ్ళలో రెండవ వేగవంతమయిన రైలు.ఈ రైలు ప్రతి రోజు రాత్రి 08గంటలకు 22691 నెంబరుతో బయలుదేరి మూడవ రోజు ఉదయం 5గంటల 55నిమిషాలకు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరుతుంది.తిరుగుప్రయాణంలో 22692 నెంబరుతో ప్రాయాణిస్తుంది.

చరిత్ర

[మార్చు]

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను నవంబర్ 1 1992 లో ఒక వారంతపు రైలుసర్వీసుగా ప్రారంభించారు.తరువాత దీనిని వారానికి రెండుమార్లు, తరువాత మూడుమార్లు, నాలుగుమార్లకు పొడిగించడం జరిగింది.జూలై 1 2017 నుండి బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను రోజువారి సర్వీసుగా మార్చడం జరిగింది.

ప్రయాణ సమయం

[మార్చు]

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు, కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని అధిగమింఛడానికి 33గంటల 55నిమిషాల సమయం తీసుకుంటుంది.

సగటు వేగం

[మార్చు]

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు, కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని 70కిలో మీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తుంది.

కోచ్ల అమరిక

[మార్చు]

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ఎ.సి మొదటి తరగతి భోగి ఒకటి, రెండవ తరగతి భోగీలు 5, మూడవ తరగతి ఎ.సి భోగీలు 11,1 పాంట్రీకార్,2జనరేటర్ల భోగీలు కలిగివుంటుంది.

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
EOG H1 A5 A4 A3 A2 A1 PC B11 B10 B9 B8 B7 B6 B5 B4 B3 B2 B1 EOG

ట్రాక్షన్

[మార్చు]

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభంలో ఖాజీపేట లోకోషెడ్ అధారిత WDM-3A డీజిల్ ఇంజన్ ను సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను వరకు, అక్కడినుండి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు ఘజియాబాద్ లోకోషెడ్ అధారిత WAP-1 లేదా WAP-4 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2010 సంవత్సరం నుండి కృష్ణరాజపురం లోకోషెడ్ అధారత WDM-3A డీజిల్ ఇంజన్ ను, సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను వరకు ఉపయోగించేవారు.తరువాత 2013వ సంవత్సరం నుండి WDM-4 డీజిల్ ఇంజన్ ను, సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను వరకు ఉపయోగించేవారు.అక్కడినుండి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు తుగ్లకబాద్ లేదా లాల్ గుడా అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2017 జూన్ 30గుంతకల్లు -బెంగళూరు రైలుమార్గం పూర్తిస్థాయిలో విద్యుతీకరణ జరిగిన తరువాత ఘజియాబాద్ లేదా లాల్ గుడా లేదా తుగ్లకబాద్ అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.

చిత్రమాలిక

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]