దువ్వాడ-విజయవాడ రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దువ్వాడ-విజయవాడ రైలు మార్గము
విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
చివరిస్థానందువ్వాడ
విజయవాడ జంక్షన్
ఆపరేషన్
ప్రారంభోత్సవం1897
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే, తూర్పు తీర రైల్వే
సాంకేతికం
ట్రాక్ పొడవు350 km (217 mi)
ట్రాకుల సంఖ్య2
ట్రాక్ గేజ్1676 బ్రాడ్‌గేజ్
ఆపరేటింగ్ వేగం130 km/h (81 mph) వరకు

మూస:దువ్వాడ-విజయవాడ మార్గం దువ్వాడ విజయవాడ విభాగం అనేది భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల విజయవాడ, దువ్వాడ మధ్యన ఉన్న ఒక రైలు మార్గము. ఈ మార్గము హౌరా - చెన్నై ప్రధాన మార్గంలోని ఒక భాగం. దువ్వాడ నుండి తాడి వరకు ఉన్న రైల్వే మార్గం తూర్పు తీర రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఇక అనకాపల్లి నుండి విజయవాడ జంక్షన్ వరకు ఉన్న మార్గం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉంది.

భౌగోళికం[మార్చు]

దువ్వాడ-విజయవాడ మార్గం తూర్పు కనుమలు, బంగాళాఖాతం మధ్యన ఉన్న తూర్పు తీర మైదానాలలో ఉంది. ఈ లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల గుండా వెళుతుంది. ఈ లైన్ అప్పుడప్పుడూ తుఫానుల‌, ఋతుపవనాల కాలంలోని భారీ వర్షాలు, గాలుల ప్రభావానికి గురవుతుంది. ఆ సమయాలలో రైలు ప్రయాణానికి తీవ్ర అంతరాయం, రైల్వే ఆస్తులకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది, [1][2] ఈ ప్రాంతంలో ఋతుపవనాల కాలంలో వర్షపాతం 55 అంగుళాల (1,400 మి.మీ.) వరకు ఉంటుంది.[3][4][5][6]

నౌకాశ్రయము (పోర్ట్) అభివృద్ధి[మార్చు]

  • విశాఖపట్నం పోర్ట్ మొదట మేఘాద్రిగడ్డ ముఖద్వారం వద్ద 1933 సం.లో ప్రారంభించబడింది. ఇది మొట్టమొదటగా బెంగాల్ - నాగపూర్ రైల్వే ద్వారా అభివృద్ధి చేయబడింది. పోర్ట్‌కు అంతర్గత నౌకాశ్రయం, ఒక ఔటర్ హార్బర్ ఉంది. విశాఖపట్నం ఓడరేవు 2010-11 సం.లో 68,04 మిలియన్ టన్నుల సరుకు ఎగుమతి, దిగుమతి పనులను నిర్వహించింది. ఇది భారతదేశంలోని కాండ్ల రేవు తర్వాత రెండవ అత్యధిక రవాణా నిర్వహణ. విశాఖపట్నం పోర్ట్ 200,000 డిడబ్ల్యుటి నౌకలు వరకు నిర్వహించడానికి తగిన సామర్ధ్యముతో ఆధునీకరణ చేపట్టబడి ఉంది.[7][8]
  • గంగవరం పోర్ట్ 2008 సం.లో ముందుకు వచ్చింది. ఇది 200,000 డిడబ్ల్యుటి నౌకలు వరకు నిర్వహించ గలుగుతుంది, ఇది భారతదేశం లోనే లోతైన ఓడరేవుగా నిలుస్తోంది.[9] ఒక చిన్న పోర్ట్ భీమునిపట్నం వద్ద గోస్తని నది ముఖద్వారం దగ్గర అభివృద్ధికి ప్రతిపాదించారు.[10] కాకినాడ పోర్ట్‌ లోని ఒక భాగంగా 1997 సం.లో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ప్రారంబించారు.[11] పోర్ట్ 50,000 డిడబ్ల్యుటి వరకు నౌకలను నిర్వహించగలుగుతుంది. పోర్ట్ 2010-2011 సం.లో 10.81 మిలియన్ టన్నుల సరుకు పనులను నిర్వహించింది.[12] మచిలీపట్నం వద్ద పోర్ట్ అభివృద్ధికి ప్రతిపాదించారు.[13]

===

ఇతర అభివృద్ధి పనులు === విశాఖపట్నం చమురు శుద్ధి కర్మాగారం షిప్‌యార్డు నుండి స్టీల్ ప్లాంట్ వరకు, అనేక మరిన్ని పరిశ్రమలుతో, విస్తరిస్తున్న పారిశ్రామిక నగరం. సింధియా షిప్‌యార్డు పేరుతో 1941 సం.లో స్థాపించి, సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్ నకు షిప్‌యార్డు ఒక భాగంగా నిర్మించబడి, అది హిందూస్థాన్ షిప్‌యార్డు గా 1961 లో మారింది.[14] విశాఖపట్నం రిఫైనరీ, తూర్పు తీరంలోని మొదటి నూనె శుద్ధి కర్మాగారం, అది 1957 లో, కాల్టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ లిమిటెడ్‌చే స్థాపించబడింది. తరువాత 1976 లో భారతదేశం యొక్క ప్రభుత్వం స్వాధీనం చేసుకుని హిందూస్తాన్ పెట్రోలియంలో 1978 లో విలీనం చేశారు.[15] విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, భారతదేశంలో మొట్ట మొదటి తీరం ఆధారిత స్టీల్ ప్లాంట్ 1992 సం.లో ప్రారంబించారు.[16]

చరిత్ర[మార్చు]

కొన్ని సంవత్సరాల ముందు రైల్వేలు ప్రయాణీకుల కోసం పనిచేయటం ఆరంభించింది. భారతదేశం రైల్వే లైన్లులో నిర్మాణ సామాగ్రి వాటిపై తరలించబడ్డాయి. వీటితో పాటు రూర్కీ 1830 సం.లో సమీపంలో గంగా కాలువ మీద సొలానీ కాలువ నిర్మాణం కోసం, రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో చెన్నై సమీపంలో కాలువ నిర్మాణం కోసం, గోదావరి ఆనకట్ట నిర్మాణం రైల్వే 1845 సం. ప్రాంతములో రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి కావల్సిన సామాగ్రి రవాణా చేయడానికి ఒక లైన్ ఉపయోగించారు. ఈ ప్రాజెక్ట్ 1852 సం.లో పూర్తయ్యింది, ఆ తదుపరి ఈ రైల్వే మూసివేశారు.[17] చెన్నై సమీపంలో రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో గ్రానైట్ రవాణా కొరకు ఉపయోగించారు. ఇది భారతదేశంలో పనిచేస్తున్న మొదటి రైల్వే వంటిది అని అనేక మంది భావిస్తారు. అంతకుముందు స్థాపించబడిన మద్రాస్ రైల్వే 1853 సం.లో విలీనం చేయబడి, భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే గా 1858 సం.లో ఏర్పాటైంది.[18] భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే 1872 సం.లో కర్నాటిక్ రైల్వే లో విలీనం చేయబడి, 1874 సం.లో దక్షిణ భారతీయ రైల్వే గా పేరు మార్చబడింది. దక్షిణ మరాఠా రైల్వే యొక్క ప్రధాన తూర్పువైపు మార్గం విజయవాడ (అప్పుడు బెజవాడగా పిలుచేవారు) వరకు ఇతర మార్గాలతోను 1888 సం. వరకు అనుసంధానం చేయబడింది. 1889 సం.లో నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే యొక్క ప్రధాన మార్గం విజయవాడ వరకు పొడిగించారు.[19] 1893 నుండి 1896 వరకు ఉన్న మధ్య కాలంలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,287 కి.మీ. (800 మైళ్ళు) విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించబడింది. ఆ తదుపరి ట్రాఫిక్ కొరకు ప్రారంభిచారు.[20][21] ఓల్డ్ గోదావరి బ్రిడ్జ్ 1897 సం.లో నిర్మాణం జరిగింది.[19], [22] 1899 సం.లో విజయవాడ-మద్రాసు లింక్ లైను నిర్మాణం జరిగి, రైళ్లు ఎకాఎకీ ఈ మార్గము గుండా నడిచేందుకు ప్రారంభించారు.[19] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు ) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[23]

రైల్వే పునర్వ్యవస్థీకరణ[మార్చు]

ప్రారంభ 1950 సం.లో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదింఛడము జరిగింది. 1951 సం. ఏప్రిల్ 14 న మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే, దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ, మైసూర్ స్టేట్ రైల్వే దక్షిణ రైల్వే జోన్ నిర్మించటానికి గాను, విలీనం చెయ్యబడ్డాయి. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు,, (2) దక్షిణ రైల్వే లో విలీనం చేయబడ్డ మద్రాసు రైల్వే, దక్షిణ మరాఠా రైల్వే లోని కొన్ని భాగాలను వేరుచేసి దక్షిణ మధ్య రైల్వే జోన్ (సౌత్ సెంట్రల్ రైల్వే) ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో, దక్షిణ రైల్వే లోని గుంతకల్లు డివిజన్ దక్షిణ మధ్య రైల్వేకు, సోలాపూర్ డివిజన్ సెంట్రల్ రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల రైల్వే జోన్ (సౌత్ వెస్ట్రన్ రైల్వే) అనేది దక్షిణ రైల్వే నుండి. వేరుచేసి ఏర్పాటు చేశారు.[24]

విద్యుద్దీకరణం(ఎలక్ట్రిఫికేషన్)[మార్చు]

1965 సంవత్సరములో చెన్నై మెయిల్, భారత లోకోమోటివ్ తరగతి ( డబ్ల్యుడిఎమ్ - 1 ) / (డబ్ల్యుడిఎమ్- 2 ) అనే ఒక డీజిల్ ఇంజన్‌తో దక్షిణ తూర్పు రైల్వే జోన్ పరిధిలో హౌరా - చెన్నై మార్గములో నడిచిన మొట్ట మొదటి రైలు.[25] ఈ విశాఖపట్నం-విజయవాడ మార్గము అనునది 1997వ సంవత్సరములో సంపూర్ణముగా విద్యుద్దీకరణ (ఎలక్ట్రిఫికేషన్) చేయబడింది. అదేవిధముగా, హౌరా-చెన్నైమార్గము కూడా 2005 వ సంవత్సరములో సంపూర్ణముగా విద్యుద్దీకరణ జరిగింది.[26]

వేగ పరిమితులు[మార్చు]

ఖరగ్‌పూర్-విశాఖపట్నం-విజయవాడ ప్రధాన రైలు మార్గాన్ని " గ్రూప్ బి "గా వర్గీకరించారు, ఈ మార్గంలో రైళ్ళు గరిష్ఠంగా గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. ఈ మార్గంలోని బ్రాంచి లైన్లలో మాత్రం గరిష్ఠంగా గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు.[27]

విశాఖపట్నం-విజయవాడ మార్గంలో రైళ్ళ చిత్రాలు[మార్చు]

ప్రయాణీకుల ప్రయాణాలు[మార్చు]

భారతీయ రైల్వేలలో ఉన్న ప్రధాన వంద బుకింగ్ స్టేషన్లలో ఈ మార్గంలోని విశాఖపట్నం జంక్షన్, రాజమండ్రి, విజయవాడ జంక్షన్లు ఉన్నాయి .[28]

మూలాలు[మార్చు]

  1. "Coastal Plains of India". Country facts – the world at your finger tips. Archived from the original on 2013-05-30. Retrieved 2013-01-17.
  2. "The Coastal Plains of India". Zahie.com. Archived from the original on 2019-09-18. Retrieved 2013-01-17.
  3. Rao, A. Srinivasa. "24 dead in Cyclone Nilam, Andhra Govt blames Met department for not predicting monsoon". India Today, 5 November 2012. Retrieved 2013-01-19.
  4. "Andhra Pradesh: Torrential rain in north coastal area, one dead". The Hindu, 5 October 2004. Archived from the original on 2006-05-31. Retrieved 2013-01-19.
  5. "Andhra Pradesh". Encyclopaedia Brittanica. Retrieved 2013-01-19.
  6. "Cyclone 'Laila' weakening: to cross Andhra Coast Thursday afternoon". Netindian. Retrieved 2013-01-19.
  7. "Port of Visakhapatnam". History. Vizagport. Archived from the original on 2012-11-11. Retrieved 2013-01-24.
  8. "Vizag port feels the heat of competition from Gangavaram". The Hindu Business Line, 19 April 2011. Access My Library. Archived from the original on 22 మే 2015. Retrieved 2013-01-24.
  9. "Welcome to Gangavaram Port". Port Gangavaram. Archived from the original on 2012-11-03. Retrieved 2013-01-24.
  10. "Bheemunipatnam Port". Department of Ports, Government of Andhra Pradesh. Archived from the original on 2013-03-10. Retrieved 2013-01-24.
  11. "Kakinada Seaports Ltd". Archived from the original on 2012-07-02. Retrieved 2013-01-24.
  12. "Kakinada Deep Water Port". Department of Ports, Government of Andhra Pradesh. Archived from the original on 2013-01-26. Retrieved 2013-01-25.
  13. "Machilipatnam Port". Department of Ports, Govt. of Andhra Pradesh. Archived from the original on 2013-01-23. Retrieved 2013-01-24.
  14. "Hindustan Shipyard: Making Waves". India Today. 2009-10-09. Retrieved 2013-01-25.
  15. "Hindustan Petroleum Corporation Ltd". Archived from the original on 2011-11-22. Retrieved 2013-01-24.
  16. "Rashtriya Ispat Nigam Ltd". ICVL. Archived from the original on 2016-03-04. Retrieved 2013-01-24.
  17. Darvill, Simon. "India's first railways". Godavari Dam Construction Railway. IRFCA. Retrieved 2013-01-19.
  18. "IR History – Early days". 1832-1869. IRFCA. Retrieved 2013-01-19.
  19. 19.0 19.1 19.2 "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-01-19.
  20. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-02.
  21. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 2012-10-11. Retrieved 2013-01-02.
  22. Address Resolution Protocol  Earthling . "Godavari River". En.academic.ru. Retrieved 2012-07-30.{{cite web}}: CS1 maint: extra punctuation (link)
  23. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  24. "Geography – Railway Zones". IRFCA. Retrieved 2013-01-23.
  25. "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
  26. "IR History Part VII (2000-present)". IRFCA. Retrieved 2013-01-23.
  27. "Chapter II – The Maintenance of Permanent Way". Retrieved 2013-01-02.
  28. "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 2014-05-10. Retrieved 2012-12-30.

బయటి లింకులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూసలు , వర్గాలు[మార్చు]