మేఘేశ్వర ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాత పట్టణం, భువనేశ్వర్ లోని మేఘేశ్వర ఆలయం

మేఘేశ్వర ఆలయం 12 వ శతాబ్దపు శివాలయం.[1] ఇది భారతదేశంలోని భువనేశ్వర్ నగరం లోని టాంకాపాని రహదారి ప్రాంతంలో ఉన్న ఒక సజీవ ఆలయం. దీన్ని సప్తరథ వాస్తు శైలిలో నిర్మించారు. దేవాలయంపై నర్తకిలు, జంతువులు, పక్షులు, పువుల బొమ్మలను చెక్కారు. టంకాపానీ రోడ్డులో ఉన్న పాండవ్ నగర్ లో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో భాస్కరేశ్వర్, బ్రహ్మేశ్వర్ అనే మరో రెండు దేవాలయాలు ఉన్నాయి. ప్రాంగంణంలో ఉన్న ఒక శిలాఫలకాన్ని బట్టి, ఈ ఆలయాన్నీ, దానికి సమీపంలో ఉన్న చెరువునూ గాంగ వంశపు రాజైన రాజరాజు బావమరిది స్వప్నేశ్వరుడు నిర్మించినట్లు తెలుస్తోంది.[2] రాజరాజు తన అవసాన దశలో తన తమ్ముడు అనియకభీముడికి పట్టాభిషేకం చేసినట్లు కూడా ఈ శాసనంలో ఉంది. అంటే ఈ ఆలయాన్ని ఆ కాలంలో (సా.శ. 1192-95) నిర్మించి ఉండవచ్చు.[3] ప్రస్తుతం ఈ శిలాఫలకాన్ని అనంత వాసుదేవాలయం గోడకు అమరచారు.[4]

ఈ ఆలయం లోని శివలింగం 2.74 మీటర్ల ఎత్తు ఉంటుంది.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Barik, Bibhuti (29 August 2011). "Water threat to historic temple". The Telegraph. Retrieved 11 January 2016.
  2. "Megheswar Temple". Times of India Travel. Archived from the original on 2020-08-13. Retrieved 2020-08-13.
  3. 3.0 3.1 Mishra, Banshipani. "TEMPLE BHASKARESWAR AND MEGHESWAR | Pratisruti Plus". ప్రతిస్తుతి ప్లస్ (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-08-13. Retrieved 2020-08-13.
  4. "Megheswar Temple – Leap in the Odhisan Temple Architecture – Indian History and Architecture". పురాతత్వ.ఇన్ (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-08-13. Retrieved 2020-08-13.