హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
హైదరాబాదు మెట్రో రైలు | |||
---|---|---|---|
ముఖ్య వివరాలు | |||
స్థానిక ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | ||
ట్రాన్సిట్ రకం | మెట్రోరైలు | ||
లైన్ల సంఖ్య | 3 (Phase I) | ||
స్టేషన్ల సంఖ్య | 66 (Phase I) | ||
ముఖ్య కార్యనిర్వహణాధికారి | NVS Reddy, MD[1] | ||
ప్రధానకార్యాలయం | Metro Bhawan, సైఫాబాద్, హైదరాబాదు | ||
వెబ్ సైటు | |||
నిర్వహణ | |||
ప్రారంభమైన కార్యాచరణ | 29 November 2017 | ||
నిర్వహించేవారు | హైదరాబాద్ మెట్రో రైల్ లి. (HMRL) | ||
సాంకేతిక అంశాలు | |||
వ్యవస్థ పొడవు | 72.16 కి.మీ. (44.84 మై.) (Phase I)[2] 97 కి.మీ. (60 మై.) (Phase II) | ||
ట్రాక్ గేజ్ | 1,435 మిమీ (4 అడుగులు 8 1⁄2 అం) standard gauge | ||
విద్యుదీకరణ | 25kV, 50Hz AC overhead catenary | ||
సరాసరి వడి | 34 km/h (21 mph) | ||
అత్యధిక వడి | 80 km/h (50 mph) | ||
|
హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు నగరంలో ప్రయాణం వేగవంతం, సౌకర్యవంతం చేసే రైలు సేవలనందిస్తోంది. మెట్రోరైల్ మొదటి దశ నవంబర్ 2017 లో నాగోల్ - అమీర్పేట్- మియాపూర్ మార్గంతో ప్రారంభించబడింది. తరువాత ఎల్ బి నగర్ -అమీర్ పేట మార్గం అక్టోబర్ 2018 లో ప్రారంభించబడింది. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం మార్చి 2019 న ప్రారంభించారు. [3] జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం ఫిబ్రవరి 7 2020 నుండి అందుబటులోకి వచ్చినది . ఈ మార్గం ప్రారంభంతో మెట్రో మొదటి దశలో 72 కి.మీ.లకు గాను 69 కి.మీ. మార్గం అందుబాటులోకి వచ్చినట్లయింది. హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రో గా గుర్తింపుపొందింది.[4]
మెట్రో సేవలు - సమయాలు[మార్చు]
హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పుడు మియాపూర్ నుంచి LB నగర్ మీదుగా అమీర్ పేట, ఎంజీబీఎస్ మీదుగా రెడ్ లైన్ తన సర్వీసులను నిర్వహిస్తోంది. అలాగే నాకోల్ నుంచి రాయదుర్గ్ మీదుగా సికింద్రాబాద్, అమీర్ పేట్ మీదుగా బ్లూ లైన్ అమీర్ పేట రెడ్ లైన్, బ్లూ లైన్ కు ఇంటర్ చేంజ్ స్టేషన్, జేబీఎస్ఎం నుండి జీబీఎస్ మార్గం గ్రీన్ లైన్ కు తన సర్వీసులను నిర్వహిస్తోంది.
హైదరాబాద్ మెట్రో రైలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి వారపు రోజులు , వారాంతాల్లో 06:30 గంటల నుండి 22:00 గంటల వరకు నడుస్తుంది. ఇవి తాత్కాలిక సమయాలు కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా మార్చబడతాయి. చివరి రైలుకు 5 నిమిషాల ముందు ఆ స్టేషన్ టికెట్ కౌంటర్లు మూసివేస్తారు[5].
ప్రాజెక్టు ప్రత్యేకతలు[మార్చు]
- రోడ్డు రవాణాను భగ్నపరచకుండా, రోడ్డు మధ్యలో ఎత్తుగా స్తంభాలతో రెండు లైన్లలో రవాణా జరపబడుతుంది.
- ఈ రైలు అత్యధికంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సుమారుగా గంటకు 34 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ప్రతిపాదించారు - MRT వ్యవస్థలకు అంతర్జాతీయ ప్రమాణం ప్రకారం
- ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
- అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
- భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమారలు, స్టేషను లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు.
- తమంతట తామె తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు.
- ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
- రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు.
- రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలు ఒక రైలు నడపే సౌలబ్యం
- టికెట్ ధర ₹10 నుండి ₹60 వరకు.
- ప్రతి స్టేషను జంక్షనుకు బస్సుల ఏర్పాట్లు.
మెట్రో రైలు ప్రయోజనాలు[మార్చు]

- అతి సమర్థవంతంగా తక్కువ శక్తిని, స్థలమును వినియోగిస్తుందని నిరూపించబడింది.
- పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. శబ్ద కాలుష్యాన్ని కూడా తగిస్తుంది.
- రోడ్డు రవాణాతో పోలిస్తే ఒక ప్రయాణీకుడికి 50% తక్కువ శక్తిని వినియోగిస్తుంది.
- ఎక్కువ సామర్థ్యంగల రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది.
- 50-75% ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
- ఎల్.బి.నగర్ నుండి మియాపూరు వరకు 29 కిలో మీటర్లు దూరం. మొత్తం స్టేషన్లు 27. ప్రయాసమయము 45 నిముషాలు.
- జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా వరకు 15 కిలోమీటర్ల దూరం . మొత్తం స్టేషన్లు 16. ప్రయాణ సమయం 22 నిముషాలు.
- నాగోలు నుండి శిల్పారామం వరకు దూరము 28 కిలో మీటర్లు. మొత్తం స్టేషన్లు 23. ప్రయాణ సమయము 30 నిముషాలు.
- మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉద్యోగవకాశాలు.
- సురక్షిత ప్రయాణం.
ప్రాజెక్టు వివరాలు[మార్చు]
చాలా ట్రాఫిక్, రవాణా అధ్యయనాల ఆధారంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో మూడు కారిడార్లను ఆమోదించింది. ఢిల్లీ మెట్రో రైలు కార్పరేషన్ వారు ఈ అధ్యయన పత్రాలు తయారుచేసారు.[4]
కారిడార్ | దూరం | స్టేషన్లు | ప్రయాణ సమయం | ప్రస్థుత స్థితి |
---|---|---|---|---|
ఎల్.బి.నగర్ నుండి మియాపూరు | 29 కి.మీ. | 27 | 45 ని. | పూర్తి |
జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా | 15 కి.మీ. | 16 | 22 ని. | పాక్షికం |
నాగోలు నుండి రాయదుర్గ్ | 28 కి.మీ. | 23 | 45 ని. | పూర్తి |
- విద్యుత్ సరఫరా 25kV AC, 50 Hz ఓవర్ హెడ్ ట్రాక్షన్ వ్యవస్థ ద్వారా జరపబడుతుంది.
- ఈ వ్యవస్థ కారిడార్ 1, 3 లకు 50,000 PHPDT (Peak Hour Peak Direction Traffic), కారిడార్ 2 కు 35,000 PHPDT అవసరాలు తీర్చడానికి రూపొందించబడింది.
- ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
- అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
- భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమెరాలు, స్టేషను లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు.
- తమంతట తామే తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు.
- ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
- రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు. ఎంతగానీ కలిసి వచ్చే ప్రయాణ కాలము.
- రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలలి ఒక రైలు.
- అత్యంత సరసమైన టికెట్ ధర. 8 రూపాయల నుండి 19 రూపాయల వరకు .
- మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉధ్యోగావకాశాలు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వెలువరించబడిన "వివరాలు, ప్రమాణాల మాన్యువల్"లో పనితీరు వివరాలు, భద్రతా ప్రమాణముల గురించి క్లుప్తంగా ప్రచురించబడింది.
మియాపూర్ నాగోలు కారిడార్[మార్చు]
మెట్రో రైలు మొదటి దశ నాగోలు- మియాపూర్ మధ్య 27.6 కి.మీ. మెట్రో రైలు మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి ఈ మొదటి దశ 27.6 కిలోమీటర్ల లైనులో 18 రైళ్లను నడపాలని నిర్ణయించారు ఒక్కో రైలులో మూడు కోచ్లుంటాయి . ప్రతి పది నిముషాలకు ఒక రైలు నడపాలన్నది యోచన. మెట్రో రైళ్ల వ్యవస్థను పర్యవేక్షించే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఉప్పల్ డిపోలో ఏర్పాటు చేశారు.[3] మొత్తం 72 కిలోమీటర్ల పొడవున నడిచే రైళ్లను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఈ సెంటర్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్ వ్యవస్థ ఉంది.
స్టేషను ప్రణాళిక[మార్చు]
స్టేషను రూపకల్పన[మార్చు]
- స్టేషనును స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మిస్తున్నారు.
- ఫ్లాట్ఫారంకు, ఎస్కలేటరుకు మాత్రమే పైకప్పు నిర్మించబడుతుంది.
ప్రయాణికునికి సౌకర్యాలు[మార్చు]
- ప్రతి చోట టిక్కెట్టు అమ్మే మెషీన్లను అందిస్తున్నారు.
- స్టేషనులో అనుకూలవంతమైన ప్రదేశాలలో టెలిఫోన్లను ఏర్పాటు చేస్తున్నరు.
- ప్రయాణికులకు అనుకూలంగా స్టేషను మాస్టరు ఉండే చోటును నిర్మిస్తారు.
- సామాను పరిశీలనా పరికరాలు, ప్రాథమిక చికిత్సా పరికరాలను అందుబాటులో ఉంచుతారు.
మూలాలు[మార్చు]
- ↑ "Metro rail projects: Four new metromen and their challenges". The Times Of India. 18 December 2011.
- ↑ "L&T set to bag Rs 12,132-cr Hyderabad metro rail project". The Hindu. 14 July 2010. Retrieved 2010-05-17. CS1 maint: discouraged parameter (link)
- ↑ 3.0 3.1 "గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది". 2019-03-30. Archived from the original on 2019-08-15. Retrieved 2018-08-15. CS1 maint: discouraged parameter (link)
- ↑ 4.0 4.1 Geetanath, V. (2018-09-24). "Hyderabad Metro Rail is now second largest metro network in country". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2019-01-11.
- ↑ "Train Timings". Hyderabad Metro Rail (in ఇంగ్లీష్). Retrieved 2020-05-23.
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Hyderabad Metro Rail. |