టంగుటూరి అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
Jainaprasad (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 20: | పంక్తి 20: | ||
'''టంగుటూరి అంజయ్య''' ([[ఆగష్టు 16]], [[1919]] - [[అక్టోబరు 19]], [[1986]]), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర 8వ [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ముఖ్యమంత్రి]]. ఈయన [[1980]] అక్టోబరు నుండి [[1982]] ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. |
'''టంగుటూరి అంజయ్య''' ([[ఆగష్టు 16]], [[1919]] - [[అక్టోబరు 19]], [[1986]]), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర 8వ [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ముఖ్యమంత్రి]]. ఈయన [[1980]] అక్టోబరు నుండి [[1982]] ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. |
||
అంజయ్య 1919, [[ఆగష్టు 16]] న [[హైదరాబాదు]] లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది [[మెదక్ జిల్లా]], [[భానూర్]] గ్రామం. అయితే వారి కుటుంబం [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] లో స్థిరపడింది. అంజయ్య [[సుల్తాన్ బజార్]] ఉన్నత పాఠశాలలో [[మెట్రిక్యులేషన్]] వరకూ చదువుకున్నాడు. [[హైదరాబాదు ఆల్విన్]] పరిశ్రమలో ''ఆరణాల కూలీ''గా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు<ref name=anj3>[http://www.hindu.com/2006/08/14/stories/2006081417680500.htm లుంబినీ పార్కు వద్ద అంజయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భముగా హిందూ పత్రికలో వ్యాసం]</ref>. [[కాంగ్రెసు పార్టీ]] కి చెందిన అంజయ్య [[మెదక్]] జిల్లా [[రామాయంపేట]] నియోజకవర్గము నుండి రాష్ట్ర [[శాసన సభ]] కు ఎన్నికైనాడు. |
|||
==ముఖ్యమంత్రిగా== |
==ముఖ్యమంత్రిగా== |
16:21, 17 ఆగస్టు 2020 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
టంగుటూరి అంజయ్య | |||
టంగుటూరి అంజయ్య
| |||
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 1980 అక్టోబరు - 1982 ఫిబ్రవరి | |||
ముందు | డా.మర్రి చెన్నారెడ్డి | ||
---|---|---|---|
తరువాత | భవనం వెంకట్రామ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆగష్టు 16 , 1919 | ||
మరణం | అక్టోబరు 19 , 1986 | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | టంగుటూరి మణెమ్మ | ||
మతం | హిందూ |
టంగుటూరి అంజయ్య (ఆగష్టు 16, 1919 - అక్టోబరు 19, 1986), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. ఈయన 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
అంజయ్య 1919, ఆగష్టు 16 న హైదరాబాదు లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది మెదక్ జిల్లా, భానూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాదు లో స్థిరపడింది. అంజయ్య సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నాడు. హైదరాబాదు ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల కూలీగా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు[1]. కాంగ్రెసు పార్టీ కి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గము నుండి రాష్ట్ర శాసన సభ కు ఎన్నికైనాడు.
ముఖ్యమంత్రిగా
1980 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడముతో కాంగ్రెసు పార్టీ అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో ఇందిరా గాంధీ మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రి గా నియమించింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య వివిధ వర్గాల వారికి మంత్రివర్గములో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. 61 మంది మంత్రులతో, అంజయ్య భారీ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా జంబో మంత్రివర్గమని పిలిచేవారు[2]. మంత్రుల సభ్యులను తగ్గించాలని అధిష్టానవర్గం ఒత్తిడి తేగా, తొలగించినవారికి పదవులిచ్చి సంతృప్తి పరచడానికి అనేక నిరుపయోగమైన కార్పోరేషన్లు సృష్టించాడు. అసమ్మతిదారుల విలాసాల కోసము హెలికాప్టర్లు, కార్లు వంటి వాటి మీద ఖర్చుచేశాడు[3]. అంజయ్య ప్రభుత్వములో కూడా 1982 కల్లా అసమ్మతి వర్గము పెరిగిపోయినందున, ఈయన అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది.
అంజయ్య ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో పంచాయితీ రాజ్ సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి.[4]
1984 పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా రాజీవ్ గాంధీ మంత్రివర్గములో పనిచేశాడు. ఈయన తర్వాత ఈయన సతీమణి టంగుటూరి మణెమ్మ కూడా సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికైనది. సెప్టెంబరు 9 2018 న మణెమ్మ హైదరాబాదు లో చనిపోయారు.
విశేషాలు
- అసలు పేరు తాళ్ళ అంజయ్య కానీ తన పేరు టంగుటూరి కృష్ణారెడ్డి అని, తాను రెడ్డినే అని అంజయ్య ముఖ్యమంత్రి అయిన తరువాత చెప్పాడు.
- హిందీ, ఉర్దూ మాట్లాడటం, అంజయ్యకు కలిసివచ్చాయి. ముఖ్యమంత్రిగా ఆయన జంబో జెట్ మంత్రివర్గాన్ని 61మందితో ఏర్పరచి ఏమంత్రికి ఎవరి సిఫారసు ఉన్నదో బయట పెట్టాడు. కాదనలేక జాబితా పెంచుతూ పోయాడు.
- అంజయ్య మాట్లాడేదే అసలైన తెలుగని దాశరథి వ్యాఖ్యానించాడు. సముద్రంలో తేల్ పడిందంట లాంటి తెలుగు ఉర్దూ కలిపిన పదాలు ఆయన ఎన్నో వాడుతుండేవారు.
మూలాలు
- ↑ లుంబినీ పార్కు వద్ద అంజయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భముగా హిందూ పత్రికలో వ్యాసం
- ↑ Parties, Elections, and Mobilisation - K. Ramachandra Murty పేజీ.41
- ↑ Plotting, Squatting, Public Purpose, and Politics: Land Market Development, Low Income Housing and Public intervention in India - Robert-Jan Baken పేజీ.41
- ↑ The Indian Journal of Political Science By Indian political science association Vol. 35, no. 4 (Oct.-Dec. 1974) పేజీ.542 [1]
ఇంతకు ముందు ఉన్నవారు: డా.మర్రి చెన్నారెడ్డి |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 11/10/1980—24/02/1982 |
తరువాత వచ్చినవారు: భవనం వెంకట్రామ్ |
- విస్తరించవలసిన వ్యాసాలు
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు
- 1919 జననాలు
- 1986 మరణాలు
- 8వ లోక్సభ సభ్యులు
- హైదరాబాదు జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- హైదరాబాదు జిల్లా రాజకీయ నాయకులు
- హైదరాబాదు జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు
- హైదరాబాదు జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు
- హైదరాబాదు జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) కు చెందిన కేంద్ర మంత్రులు
- హైదరాబాదు జిల్లా కార్మిక నాయకులు