కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీ (ఇండియా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీ (ఇండియా)
స్థాపకులుజ్యోతిభూషణ్ భట్టాచార్య
స్థాపన తేదీ1976
ప్రధాన కార్యాలయంపశ్చిమ బెంగాల్

కమ్యూనిస్ట్ వర్కర్స్ పార్టీ అనేది పశ్చిమ బెంగాల్ లోని రాజకీయ పార్టీ. 1976లో వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా విడిపోయినప్పుడు జ్యోతిభూషణ్ భట్టాచార్య కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీని స్థాపించారు.[1] భట్టాచార్య కలకత్తా యూనివర్శిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్, 1967లో పశ్చిమ బెంగాల్‌లో మొదటి కాంగ్రేసేతర విద్యా మంత్రి అయ్యాడు. ఇది బెంగాలీ జర్నల్ గ్రామ్-నగర్, అజెండా అనే ఆంగ్ల మాసపత్రికను ప్రచురించేది. కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీ తన పేరును 1993లో వర్కర్స్ పార్టీగా మార్చుకుంది. ప్రొఫెసర్ జ్యోతి భట్టాచార్య 1998లో మరణించాడు. అతను ప్రముఖ పండితుడిగా, మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తగా ప్రసిద్ధి చెందాడు.

మూలాలు

[మార్చు]
  1. Asish Krishna Basu (2003). Marxism in an Indian State: An Analytical Study of West Bengal Leftism. Ratna Prakashan. p. 78. ISBN 978-81-85709-73-4.