తిరుమల శ్రీవారి పాదాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీవారి పాదాలు

శ్రీ వారి పాదాలు తిరుమల కొండలలో ఎత్తైన కొండపైన నెలకొని ఉన్నాయి. కాలి అందెల వరకు సుగంధభరితమైన వివిధ రంగుల పుష్పాలతో అలంకరించబడి ఉంటాయి.

విశేషాలు[మార్చు]

ఈ ప్రదేశానికి వెళ్ళడానికి సింగిల్ రోడ్ కలదు. దీనిని సందర్శించడానికి టాక్సీలో వెళ్లవచ్చు. దారిలో చక్రతీర్థం, శిలా తోరణం కూడా దర్శించ వచ్చు. శ్రీ వారి పాదాల మండపము నుండి తిరుమల లోయ బహు సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడి పైన్ వృక్షాలు అత్యంత మనోహరంగా ఫోటోలు తీసుకోవడానికి బాగుంటాయి.

శ్రీ స్వామివారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలతో తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలూ తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించవచ్చు. .

పురాణ కథనం[మార్చు]

మహావిష్ణువు వైకుంఠం నుండి వేంకటాద్రికి దిగి వచ్చేప్పుడు మెదటి పాదాన్ని ఇక్కడ పెట్టాడని, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టాడని, మూడవ పాదాన్ని నేడు ఆనందనిలయంలో స్వామి వున్న ప్రదేశంలో పెట్టాడనీ చెబుతారు.

కోనేటి రాయుడు తిరుమల వెంకన్నను భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. వేంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినపుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకుని శిరస్సు వంచి పాదపద్మాలకు నమస్కరిస్తారట.[1]

మూలాలు[మార్చు]

  1. ttdj. "బ్రహ్మేందాద్రి దేవతలు పూజించే శ్రీవారి పాదాలు...!". telugu.webdunia.com. Retrieved 2020-06-30.

బాహ్య లంకెలు[మార్చు]