Coordinates: 13°40′59″N 79°20′49″E / 13.68306°N 79.34694°E / 13.68306; 79.34694

తిరుమల ప్రధానాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం
భౌగోళికాంశాలు :13°40′59″N 79°20′49″E / 13.68306°N 79.34694°E / 13.68306; 79.34694
పేరు
ప్రధాన పేరు :తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:చిత్తూరు
స్థానికం:తిరుపతి
ఎత్తు:853 మీటర్లు[convert: unknown unit]
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వెంకటేశ్వర స్వామి
కవులు:అన్నమయ్య
ముఖ్య_ఉత్సవాలు:బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రావిడ నిర్మాణం
దేవాలయాలు మొత్తం సంఖ్య:2
శిలాశాసనం:ద్రావిడ భాష
ఇతిహాసం
నిర్మాణ తేదీ:తొట్టతొలి రికార్డులు క్రీస్తు పూర్వం 300 (బహుశా)
ఆలయ మండలి:తిరుమల తిరుపతి దేవస్థానములు
వెబ్ సైట్:tirumala.org

తిరుమల ప్రధానాలయం అయిన గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ విగ్రహంతో పాటు 4 విగ్రహాలుగా దర్శనమిచ్చే నలుగురు మూర్తులున్నారు. వీరినే చతుర్బేరాలు అంటారు. బేర మంటే విగ్రహం అని అర్ధం.

1.కౌతుక బేరం[మార్చు]

ఇక్కడ నిత్య సేవలన్నీ కౌతుక బేరానికి నిర్వహిస్తారు.

ఈయన భోగ శ్రీనివాసుడు.

7వ శతాబ్దంలో పల్లవ యువరాణి సమవాయి ఈ విగ్రహాన్ని బహుకరించారు.

రోజువారి అభిషేకాలు, దీపారాధన నైవేద్యాలన్ని భోగ శ్రీనివాసునికే జరపడం ఆచారంగా వస్తుంది.

2.బలి బేరం[మార్చు]

సొమ్ము అప్పగింతలు, కొలువు బలి బేరానికి జరుగుతాయి.

గర్భగుడిలో ఉండే శ్రీవారి చిన్న విగ్రహం. ఈయన కొలువు శ్రీనివాసుడు.

మూల విరాట్ కు తోమాలసేవ తరువాత కొలువు శ్రీనివాసుని ఆలయ మండపానికి తీసుకువచ్చి రోజువారి పంచాంగ శ్రవణం జరిపిస్తారు.

3.స్నపన బేరం[మార్చు]

స్నపన బేరం ఈ మూర్తిని 11వ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా పూజించారు.

ఈయనే ఉగ్ర శ్రీనివాసుడు. శ్రీదేవి భూదేవి సహిత శ్రీవారీయన.

4.ఉత్సవ బేరం[మార్చు]

ఉత్సవ కార్యక్రమాలన్ని ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత మలయప్పస్వామికి నిర్వహిస్తున్నారు.

మలయప్పస్వామి వారు ఉత్సవాలతో వైభోగం వెలిగిస్తారు. ఉత్సవాలలో ఉత్సవ బేరాన్ని ఊరేగిస్తున్నారు. ఉత్సవ బేరమంటే మలయప్పస్వామి.

బ్రహ్మోత్సవాలలో బ్రహ్మా వెలిగించే స్వామి ఈయనే. భక్త కోటికి దర్శనమిస్తూ సాగిపోతుంటారు.

ఈయనకు ఇరువైపులా 24 అంగుళాల ఎత్తున శ్రీదేవి భూదేవి కొలువైయున్నారు.

ధృవ బేరం[మార్చు]

స్వామి వారి ప్రతిమను ధ్రువ బేరం అంటారు. నిశ్చల, ధీర, గంభీర మూర్తి శ్రీవారు.

ధ్రువమూర్తినే దేవదేవుడు ఈయనకు నిత్య సేవలు అందుతున్నాయి. భక్తుల కోర్కెలు తీర్చే భారం మాత్రం ఈ మూర్తులలో ధ్రువ మూర్తిది. అంటే ప్రధాన మూర్తి శ్రీ వెంకటేశ్వరునిదే.

గర్భాలయంలో దర్పంగా చిద్విలాసం చిందించే స్వామియే బ్రహ్మాండ నాయకుడు మూల విరాట్. ఆగమ పరిభాషలో ఈ మూల విరాటునే ధ్రువ బేరం అని పిలుస్తున్నారు.

దేవ దేవుని విగ్రహం ఎత్తు తొమిదిన్నర అడుగులు. ప్రతి రోజు అనేక రకాల పూలతోను బంగారు నగలతోను ఈ ధ్రువ బేరాన్ని అలంకరిస్తారు. గర్భగుడిలో అలంకరించే విరిదండలు మరింత శోభను తెస్తాయి.

ఇక్కడ శ్రీనివాసునికి ఇరువైపులా ఇష్ట సకులుండరు. వీరిరువురు స్వామి వారి వక్ష స్థలం మీద దర్శన మిస్తుంటారు.

ఆనంద నిలయ విమానం[మార్చు]

గర్భాలయం మీద మనకు బంగారు పూత పూసిన గోపురం కనిపిస్తుంది. దీనిని ఆగమ భాషలో విమానం అంటారు. శ్రీవారి దేవాలయం మీద ఉన్న విమానానికి ఆనంద నిలయ విమానమని పేరు. ఇది త్రిదళ విమానం. ఈది మూడు అంతస్తులుగా ఏర్పాటు చేయబడింది.

ప్రధాన విగ్రహంతో పాటు ఈ నలుగురు మూర్తులు శ్రీవారి ఆలయంలో కొలువై భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు.

తొలి దర్శనం[మార్చు]

శ్రీ వారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవ సమయంలో అర్చకుల చే తెరువబడుతాయి. ఆ సమయంలో బంగారు వాకిలి లోపలికి అర్చకులు, జీయంగారు స్వామి, ఏకాంగితో పాటుగా 'సన్నిధి గొల్ల' అనబడే ఒక యాదవుడూ మాత్రమే ప్రవేశిస్తారు.

భక్తులకు దర్శనం[మార్చు]