గౌరీమనోహరి రాగము
Jump to navigation
Jump to search

గౌరీమనోహరి రాగము కర్ణాటక సంగీతం లో 23 వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు[మార్చు]
- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
- S R2 G2 M1 P D2 N3 S
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
- S N3 D2 P M1 G2 R2 S
ఈ రాగంలోని స్వరాలు : షడ్జమం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి ధైవతం, కాకళి నిషాధం. ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 59 వ మేళకర్త రాగమైన ధర్మవతి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.
ఉదాహరణలు[మార్చు]
ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.
- గురిలేక ఎటువంటి - త్యాగరాజు కీర్తన
- వరలక్ష్మీ నమోస్తుతే - మైసూర్ వాసుదేవాచారి
- సరస సమ మృదు పాద - స్వాతి తిరునాళ్
జన్య రాగాలు[మార్చు]
గౌరీమనోహరి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
ఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |