విశ్వంభరి రాగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశ్వంభరి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలలో ఇది 54వ మేళకర్త రాగము.[1][2] కర్ణాటక సంగీత విద్వాంసుడు ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "వంశావతి" అంటారు.

రాగ లక్షణాలు[మార్చు]

"విశ్వంభరి" scale with Shadjam at C
ఆరోహణ: స రి గ మ ప ధ ని స 
   (S R1 G3 M2 P D3 N3 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
   (S N3 D3 P M2 G3 R1 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, షట్‍శృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 18వ మేళకర్త రాగమైన హటకాంబరి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు[మార్చు]

  • వంశవతీ శివయువతీ - ముత్తుస్వామి దీక్షితులు
  • భక్తవత్సలం - ముత్తుస్వామి దీక్షితులు
  • పరమానంద - కోటేశ్వర అయ్యరు

సంబంధిత రాగాలు[మార్చు]

విశ్వభరి నోట్లు గ్రహ భేదం ఉపయోగించి మార్చబడినప్పుడు, శ్యామలాంగి, గణమూర్తి అనే 2 ఇతర చిన్న మేళకర్త రాగాలను ఇస్తుంది. సాపేక్ష నోట్ పౌనః పున్యాలను ఒకే విధంగా ఉంచడానికి తీసుకున్న చర్య గ్రహ భేదం, షడ్జమాన్ని రాగంలోని తదుపరి నోట్‌కు మార్చడం.

మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai