వాగధీశ్వరి రాగం
| కర్ణాటక సంగీతం-రాగాలు |
|---|
| రాగం = వాగధీశ్వరి రాగం |
| మేళకర్త సంఖ్య = 34 |
| ఆరోహణ = స రి గ మ ప ధ ని స |
| అవరోహణ = స ని ధ ప మ గ రి స |
| వాగ్గేయకారులు = త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, బాలమురళీకృష్ణ |

వాగధీశ్వరీ రాగము కర్ణాటక సంగీతం (దక్షిణ భారత శాస్త్రీయ సంగీతం)లో 34 వ మేళకర్త రాగము.[1] దీనిని వాగధీశ్వరి అని ఉచ్ఛరిస్తారు. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 34వ మేళకర్త రాగం (మాతృ స్థాయి). దీనిని ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత విధానంలో (స్కూలు) భోగచ్ఛాయనాట అని పిలుస్తారు.[2][3]
రాగ లక్షణాలు
[మార్చు]ఇది 6వ చక్ర రుతువులో 4వ రాగం. జ్ఞాపకార్థం (mnemonic) దీని పేరు రుతు-భూ. జ్ఞాపకార్థ పదబంధం స రి గ మ ప ధ ని.[1] దీని ఆరోహణ-అవరోహణ క్రమం (ఆరోహణ, అవరోహణల స్కేల్) ఈ క్రింద చూడవచ్చు.
| ఆరోహణ | స రి గ మ ప ధ ని స | S R3 G3 M1 P D2 N2 S |
|---|---|---|
| అవరోహణ | స ని ధ ప మ గ రి స | S N2 D2 P M1 G3 R3 S |
ఈ రాగంలోని స్వరాలు: షట్శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి ధైవతం, "కైశికి నిషాదం". ఈ సంపూర్ణ రాగంలో ఏడు స్వరాలు ఉంటాయి. వాగధీశ్వరి మేళకర్త రాగం కాబట్టి, దాని నిర్వచనం ప్రకారం ఇది సంపూర్ణ రాగం (అంటే ఆరోహణ, అవరోహణ లలో మొత్తం ఏడు స్వరాలు ఉన్నాయి). ఇది 70 వ మేళకర్త రాగమైన నాసికాభూషిణి రాగమునకు శుద్ధ మధ్యమ సమానం.
జన్య రాగాలు
[మార్చు]వాగధీశ్వరికి సంబంధించిన కొన్ని జన్య రాగాలు (ఉత్పన్నమైనవి ) ఉన్నాయి, వీటిలో మాగధి, మోహనాంగి వంటివి అప్పుడప్పుడు వినబడతాయి. వాగధీశ్వరికి సంబంధించిన పూర్తి రాగాల వివరాలు ఈ పట్టికలో ఉన్నాయి.
| రాగం | ఆరోహణం | అవరోహణం |
| వాగదీశ్వరి (34వ మేళకర్త) రాగం | S R3 G3 M1 P D2 N2 S | S N2 D2 P M1 G3 R3 S |
| భోగచ్ఛాయనాట | S R3 G3 R3 G3 M1 P N2 N2 S | S N2 D2 N2 P S N2 P M1 M1 R3 S |
| భానుమంజరి | S R3 G3 M1 P N2 S | S N2 P M1 R3 G3 R3 S |
| చ్ఛాయనాట | S R3 G3 M1 P M1 P S | S N2 D2 N2 P M1 R3 S |
| మాగధి | S R3 M1 P D2 N2 S | S N2 D2 P M1 R3 S |
| మోహనాంగి | S R3 G3 P D2 S | S D2 P G3 P D2 P G3 R3 S |
| మురళి | S R3 G3 M1 D2 N2 S | S N2 D2 M1 G3 R3 S |
| శారదాభరణ | S M1 G3 M1 P M1 D2 N2 S | S N2 D2 M1 P M1 R3 S |
| విఖావతి | S R3 G3 P D2 S | S D2 P G3 R3 S |
రచనలు, స్వర రచనలు
[మార్చు]ఈ వాగధీశ్వరి రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.
- వర్ణం సుధేయులు: శ్రీ సి హొన్నప్ప భాగవతార్, కన్నడ రంగస్థల కళాకారుడు, సినీ నటుడు, నిర్మాత, స్వరకర్త, గాయకుడు.
- నల్లాన్ చక్రవర్తి మూర్తి రచించిన వర్ణం వరవీణాపాణి
- కనకదాసు రచించిన నన్నిందా నానే జనిసి
- త్యాగరాజు - పరమాత్ముడు
- ముత్తుస్వామి దీక్షితార్ రచించిన భోగచ్ఛాయ నాటకప్రియే
- మైసూర్ చిక్కా రామారావు రచించిన వాణీ వాగధీశ్వరి
- మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచించిన ప్రణమామ్యహం
- టి.శ్రీనిధి రచించిన వాగధీశ్వరి శారధే
- కమల నయన జగదీశ్వర - స్వాతి తిరునాళ్ రామవర్మ రచన, స్వరకల్పన డా. ఎం. బాలమురళీకృష్ణ - దీనికి వాగధీశ్వరి రాగంలో స్వరం చేసారు
- నాదను సంతాన - కోటీశ్వర అయ్యర్ కూర్పు
- జయచామరాజేంద్ర వడియార్ రచించిన వామదేవ భావయేహం
- నరుమాన మలార్గలిన్ అనే గీతాన్ని ఎం.జి. వల్లభన్, ఉరంగథ నినైవుగల్ అనే తమిళ సినిమాకు రచించారు. ఇళయరాజా స్వరపరచగా ఎస్. జానకి పాడారు
సంబంధించిన రాగాలు
[మార్చు]వాగధీశ్వరి స్వరాలను గ్రహభేదం ఉపయోగించి మార్చినప్పుడు, 2 ఇతర చిన్న మేళకర్త రాగములు, నాగనందిని, భవప్రియ ఏర్పడతాయి. గ్రహభేదం అంటే రాగంలోని షడ్జమమును తదుపరి స్వరానికి మారుస్తూ, రిలేటివ్ నోట్ ఫ్రీక్వెన్సీలను ఒకే విధంగా ఉంచడం అనే దశ. చ్ఛాయనాట వాగధీశ్వరికి జన్య రాగం. మరిన్ని వివరాలు దృష్టాంతం కోసం నాగనందినిపై గ్రహభేదం ఈ పట్టికలో చూడవచ్చు. నాగనందిని రాగానికి - గ్రహ భేదం ఉత్పన్నాలు భవప్రియ, వాగధీశ్వరి.
| రాగం | Mela # | C | D | E | F | G | A | B | C | D | E | F | G | ||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| నాగనందిని | 30 | S | R2 | G3 | M1 | P | D3 | N3 | S' | R2' | G3' | M1' | P' | ||||||||
| భావప్రియ | 44 | S | R1 | G2 | M2 | P | D1 | N2 | S' | ||||||||||||
| వాగధీశ్వరి | 34 | S | R3 | G3 | M1 | P | D2 | N2 | S' |