గాయకప్రియ రాగము

వికీపీడియా నుండి
(గాయకప్రియం రాగం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గాయకప్రియ ఆరోహణం

గాయకప్రియ కర్ణాటక సంగీతంలో ఒక రాగం.[1] కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో ఇది 13వ రాగం. ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీత విధానంలో ఈ రాగాన్ని గేయహెజ్జాజ్జి అని పిలుస్తారు.[2][3]

కర్నాటక సంగీతంలో 13 వ మేళకర్త రాగము. ఈ రాగాన్ని గేయహెజ్జాజ్జి అని ముత్తుస్వామి దీక్షితులు వారి విధానమందు అంటారు.

లక్షణాలు[మార్చు]

ఈ రాగం మూడవ ఛక్రాగ్ని లోని మొదటి రాగం.

(S R1 G3 M1 P D1 N1 S)
(S N1 D1 P M1 G3 R1 S)

ఇందులోని స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, శుద్ధ నిషాధం.

ఇది ఏడు స్వరాలు కలిగిన ఒక సంపూర్ణమైన మేళకర్త రాగము. ఇది 49వ మేళకర్త రాగమైన ధవళాంబరి రాగానికి శుద్ధ మధ్యమ సమానమైనది.

ఉదాహరణలు[మార్చు]

ఇందులో కొన్ని ప్రముఖ రచనలున్నాయి.

  1. శ్రీ మహావిష్ణుం - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
  2. నడ నీలై- కోటేశ్వర అయ్యర్

మూలములు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
  3. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras