నాగానందిని రాగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగానందిని scale with shadjam at C

నాగానందిని రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 30 వ మేళకర్త రాగము. దీనిని కర్ణాటక సంగీత ముత్తుస్వామి దీక్షితుల పాఠశాలలో నాగాభరణం అని పిలుస్తారు.[1][2][3]

రాగ లక్షణాలు[మార్చు]

S R2 G3 M1 P D3 N3 S
S N3 D3 P M1 G3 R2 S

ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, షట్‍శృతి ధైవతం, "కాకలి నిషాదం". ఈ సంపూర్ణ రాగంలో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 66 వ మేళకర్త రాగమైన చిత్రాంబరి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.

ఉదాహరణలు[మార్చు]

ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.

  • సత్తలేనిదినము - ఆది - త్యాగరాజు
  • నాగాభరణం- ఆది - ముత్తుస్వామి దీక్షితులు
  • సంచారి - మఠ్య - సుబ్బరాయ దీక్షితులు
  • దాక్షాయణి రక్షమాం - మంగళంపల్లి బాలమురళీకృష్ణ

మూలాలు[మార్చు]

  1. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  2. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
  3. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras