పశ్చిమ బెంగాల్: కూర్పుల మధ్య తేడాలు
చి యంత్రము కలుపుతున్నది: new:पश्चिम बंगाल |
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: sa:पश्चिमबङ्गालम् |
||
పంక్తి 176: | పంక్తి 176: | ||
[[ro:Bengalul de Vest]] |
[[ro:Bengalul de Vest]] |
||
[[ru:Западная Бенгалия]] |
[[ru:Западная Бенгалия]] |
||
[[sa:पश्चिमबङ्गालम्]] |
|||
[[sa:पश्चिमबङ्गाल]] |
|||
[[sh:Zapadni Bengal]] |
[[sh:Zapadni Bengal]] |
||
[[simple:West Bengal]] |
[[simple:West Bengal]] |
13:22, 31 డిసెంబరు 2011 నాటి కూర్పు
పశ్చిమ బెంగాల్ | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
కోల్కతా - 22°49′N 88°12′E / 22.82°N 88.2°E |
పెద్ద నగరం | కోల్కతా (Calcutta) |
జనాభా (2001) - జనసాంద్రత |
80,221,171 (4వ స్థానం) - 904/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
88,752 చ.కి.మీ (13వ స్థానం) - 19 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[పశ్చిమ బెంగాల్ |గవర్నరు - [[పశ్చిమ బెంగాల్ |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1960-05-01 - ఎం.కె.నారాయణన్ - మమతా బెనర్జీ - ఒకే సభ (295) |
అధికార బాష (లు) | బెంగాలీ |
పొడిపదం (ISO) | IN-WB |
వెబ్సైటు: www.wbgov.com |
పశ్చిమ బెంగాల్ (West Bengal, পশ্চিম বঙ্গ, Pôščim Bôngô) భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన నేపాల్, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్ , ఈశాన్యాన అస్సాం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. దక్షిణాన బంగాళాఖాతం సముద్రమూ, వాయువ్యాన ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి.
చరిత్ర
క్రీ.శ. 750 నుండి 1161 వరకు బెంగాల్ ను పాలవంశపు రాజులు పాలించారు. తరువాత 1095 నుండి 1260 వరకు సేనవంశపురాజుల పాలన సాగింది. 13వ శతాబ్దమునుండి మహమ్మదీయుల పాలన ఆరంభమైంది. అప్పటినుండి, ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యం కాలంలో బెంగాల్ ప్రముఖమైన, సంపన్నకరమైన వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 15వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రూపంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అక్కడినుండి క్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం అంతా విస్తరించింది.
1947 లో స్వాతంత్ర్యం లభించినపుడు బెంగాల్ విభజింపబడింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు బెంగాల్ పాకిస్తాన్ లో ఒక భాగమై తూర్పు పాకిస్తాన్గా పిలువబడింది. తరువాత ఇదే భాగం 1971లో పాకిస్తాన్నుండి విడివడి స్వతంత్ర బంగ్లాదేశ్గా అవతరించింది.
ఇక పశ్చిమ బెంగాల్ 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రమయ్యింది. ఫ్రెంచివారి పాలనలో ఉన్న చందానగర్ 1950లో భారతదేశంలో విలీనమైంది. 1955 అక్టోబరు 2 నుండి అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భాగమైనది.
రాష్ట్రం
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి కొలకత్తా నగరం రాజధాని. ఇక్కడ బంగ్లా భాష ప్రధానమైన భాష.. 1977 నుండి ఈ రాష్ట్రంలో వామపక్షపార్టీలు ఎన్నికలలో నిరంతరాయంగా గెలుస్తూ అధికారాన్ని నిలుపుకొంటూ వస్తున్నాయి.
విభాగాలు
పశ్చిమ బెంగాల్ లో 18 జిల్లాలు ఉన్నాయి. భారతదేశ జిల్లాల జాబితా/పశ్చిమ బెంగాల్
వాతావరణం
పశ్చిమ బెంగాల్ వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం వాతావరణం. భూభాగం ఎక్కువగా మైదానప్రాతం. ఉత్తరాన హిమాలయ పర్వతసానువుల్లోని డార్జిలింగ్ ప్రాంతం మంచి నాణ్యమైన తేయాకుకు ప్రసిద్ధము. దక్షిణాన గంగానది ముఖద్వారాన్న సుందర్ బన్స్ డెల్టా ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతము. ఇది పశ్చిమ బెంగాల్ లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉన్నది. ప్రసిద్ధమైన బెంగాల్ టైగర్ కు ఈ ప్రాంతంలోని అడవులు నివాస స్థానము.
సంస్కృతి
భారతదేశపు సాంస్కృతికవేదికలో బెంగాల్ కు విశిష్టమైన స్థానం ఉన్నది. "నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన" అని ఒక నానుడి ఉన్నది. ఎందరో కవులకు, రచయితలకు, సంస్కర్తలకు, జాతీయవాదులకు, తాత్వికులకు బెంగాల్ పుట్టినిల్లు. వారిలో చాలామంది భారతదేశపు సాంస్కృతిక ప్రస్థానానికి మార్గదర్శకులైనారు.
ప్రసిద్ధులైన వారు
- సాహితీ వేత్తలు
- రొబీంద్రనాధ టాగూరు: భారత దేశానికీ, బంగ్లాదేశ్ కూ జాతీయగీత రచయిత. కవి, చిత్రకారుడు, సంగీతజ్ఙుడు, తత్వవేత్త. 1913 లో నోబెల్ బహుమతి గ్రహీత.
- కాజీ నజ్రుల్ ఇస్లామ్
- మైకేల్ మధుసూదన దత్తు
- శరత్చంద్ర ఛటర్జీ
- బంకించంద్ర ఛటర్జీ
- బిభూతి భూషణ బందోపాధ్యాయ్
- సంగీతకారులు
- విజ్ఙాన వేత్తలు
- జగదీశ్చంద్ర బోస్
- సత్యేంద్రనాధ బోస్: బోస్-అయిన్ స్టయిన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భాగస్వామి, బోసాన్ సూక్ష్మకణాలు ఈయన పేరుమీద నామకరణం చేయబడినాయి.
- బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు
- అమర్త్యసేన్ : 1988 లో నోబెల్ పురస్కారాన్ని అందుకొన్ని ఆర్ధిక శాస్త్రజ్ఙుడు
- జాతీయోద్యమ నాయకులు
- రాజకీయ నాయకులు
- విప్లవనాయకులు
- సంఘసంస్కర్తలు
- తాత్వికులు
- ఆధ్యాత్మిక గురువులు
- చైతన్య మహాప్రభు: 15 వ శతాబ్దిలో కృష్ణభక్తిని ప్రబోధించిన అవతారమూర్తి.
- రామకృష్ణ పరమహంస
- వివేకానంద
- భక్తివేదాంత ప్రభుపాద (అంతర్జాతీయ కృష్ణచైతన్యోద్యమ వ్యవస్థాపకులు)
- కళాకారులు
- సినిమా కళాకారులు
- క్రీడాకారులు
జనవిస్తరణ
పశ్చిమ బెంగాల్ లో బెంగాలీ ప్రధానమైన భాష. బీహారీలు కూడా రాష్ట్రమంతా నివసిస్తున్నారు. సిక్కిం సరిహద్దు ప్రాంతంలో షెర్పాలు, టిబెటన్ జాతివారు ముఖ్యమైన తెగ. డార్జిలింగ్ ప్రాతంలోని నేపాలీ భాష మాట్లాడేవారు ప్రత్యేకరాష్ట్రం కోసం చాలాకాలం ఉద్యమం సాగించారు. వారికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే స్వతంత్రప్రతిపత్తి ఇవ్వబడింది.