పశ్చిమ బెంగాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 82 interwiki links, now provided by Wikidata on d:q1356 (translate me)
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1356 (translate me)
పంక్తి 116: పంక్తి 116:


{{Link FA|en}}
{{Link FA|en}}

[[la:Bengala Occidentalis]]

02:01, 6 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

పశ్చిమ బెంగాల్
Map of India with the location of పశ్చిమ బెంగాల్ highlighted.
Map of India with the location of పశ్చిమ బెంగాల్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
కోల్‌కతా
 - 22°49′N 88°12′E / 22.82°N 88.2°E / 22.82; 88.2
పెద్ద నగరం కోల్‌కతా (Calcutta)
జనాభా (2001)
 - జనసాంద్రత
80,221,171 (4వ స్థానం)
 - 904/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
88,752 చ.కి.మీ (13వ స్థానం)
 - 19
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[పశ్చిమ బెంగాల్ |గవర్నరు
 - [[పశ్చిమ బెంగాల్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1960-05-01
 - ఎం.కె.నారాయణన్
 - మమతా బెనర్జీ
 - ఒకే సభ (295)
అధికార బాష (లు) బెంగాలీ
పొడిపదం (ISO) IN-WB
వెబ్‌సైటు: www.wbgov.com

పశ్చిమ బెంగాల్ (West Bengal, পশ্চিম বঙ্গ, Pôščim Bôngô) భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన నేపాల్, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్ , ఈశాన్యాన అస్సాం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. దక్షిణాన బంగాళాఖాతం సముద్రమూ, వాయువ్యాన ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి.

చరిత్ర

క్రీ.శ. 750 నుండి 1161 వరకు బెంగాల్ ను పాలవంశపు రాజులు పాలించారు. తరువాత 1095 నుండి 1260 వరకు సేనవంశపురాజుల పాలన సాగింది. 13వ శతాబ్దమునుండి మహమ్మదీయుల పాలన ఆరంభమైంది. అప్పటినుండి, ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యం కాలంలో బెంగాల్ ప్రముఖమైన, సంపన్నకరమైన వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 15వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రూపంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అక్కడినుండి క్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం అంతా విస్తరించింది.

1757లో ప్లాసీ యుద్ధంలో గెలిచిన తరువాత బ్రిటీష్ ఈష్టిండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్.

1947 లో స్వాతంత్ర్యం లభించినపుడు బెంగాల్ విభజింపబడింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు బెంగాల్ పాకిస్తాన్ లో ఒక భాగమై తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడింది. తరువాత ఇదే భాగం 1971లో పాకిస్తాన్‌నుండి విడివడి స్వతంత్ర బంగ్లాదేశ్‌గా అవతరించింది.

ఇక పశ్చిమ బెంగాల్ 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రమయ్యింది. ఫ్రెంచివారి పాలనలో ఉన్న చందానగర్ 1950లో భారతదేశంలో విలీనమైంది. 1955 అక్టోబరు 2 నుండి అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భాగమైనది.

రాష్ట్రం

బెంగాల్ పులి

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి కొలకత్తా నగరం రాజధాని. ఇక్కడ బంగ్లా భాష ప్రధానమైన భాష.. 1977 నుండి ఈ రాష్ట్రంలో వామపక్షపార్టీలు ఎన్నికలలో నిరంతరాయంగా గెలుస్తూ అధికారాన్ని నిలుపుకొంటూ వస్తున్నాయి.

విభాగాలు

పశ్చిమ బెంగాల్ లో 18 జిల్లాలు ఉన్నాయి. భారతదేశ జిల్లాల జాబితా/పశ్చిమ బెంగాల్

వాతావరణం

డార్జిలింగ్ హిమాలయ పర్వత ప్రాంతములో తీస్తా నది తీరము వెంటా, కాలింపోంగ్ వద్ద మెలికలు తిరుగుతూ సాగుతున్న భారత జాతీయ రహదారి 31A

పశ్చిమ బెంగాల్ వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం వాతావరణం. భూభాగం ఎక్కువగా మైదానప్రాతం. ఉత్తరాన హిమాలయ పర్వతసానువుల్లోని డార్జిలింగ్ ప్రాంతం మంచి నాణ్యమైన తేయాకుకు ప్రసిద్ధము. దక్షిణాన గంగానది ముఖద్వారాన్న సుందర్ బన్స్ డెల్టా ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతము. ఇది పశ్చిమ బెంగాల్ లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉన్నది. ప్రసిద్ధమైన బెంగాల్ టైగర్ కు ఈ ప్రాంతంలోని అడవులు నివాస స్థానము.

సంస్కృతి

పశ్చిమ మిడ్నాపూర్‌లో ఒక గ్రామీణ దృశ్యం. రాష్ట్రములోని 72% జనాభా గ్రామాలలో నివసిస్తారు.
కలకత్తాలో ఒక వామపక్ష రాజకీయ ప్రదర్శన
అప్పుడే మొలకెత్తుతున్న వరి నారు. వెనుక దృశ్యములో జనపనార కట్టలు

భారతదేశపు సాంస్కృతికవేదికలో బెంగాల్ కు విశిష్టమైన స్థానం ఉన్నది. "నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన" అని ఒక నానుడి ఉన్నది. ఎందరో కవులకు, రచయితలకు, సంస్కర్తలకు, జాతీయవాదులకు, తాత్వికులకు బెంగాల్ పుట్టినిల్లు. వారిలో చాలామంది భారతదేశపు సాంస్కృతిక ప్రస్థానానికి మార్గదర్శకులైనారు.

ప్రసిద్ధులైన వారు

జనవిస్తరణ

దస్త్రం:IIT KGP Main Building.JPG
ఐ.ఐ.టి ఖరగ్‌పూర్

పశ్చిమ బెంగాల్ లో బెంగాలీ ప్రధానమైన భాష. బీహారీలు కూడా రాష్ట్రమంతా నివసిస్తున్నారు. సిక్కిం సరిహద్దు ప్రాంతంలో షెర్పాలు, టిబెటన్ జాతివారు ముఖ్యమైన తెగ. డార్జిలింగ్ ప్రాతంలోని నేపాలీ భాష మాట్లాడేవారు ప్రత్యేకరాష్ట్రం కోసం చాలాకాలం ఉద్యమం సాగించారు. వారికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే స్వతంత్రప్రతిపత్తి ఇవ్వబడింది.

బయటి లంకెలు

మూస:Link FA