శ్రీ కృష్ణదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
→సాహిత్య పోషణ: Correction of mistakes in Telugadela yanna poem and change the name of Satya vadhoo parinayam as Satya vadhoo preenanam ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
==సాహిత్య పోషణ== |
==సాహిత్య పోషణ== |
||
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి ''సాహితీ సమరాంగణ సార్వభౌముడు'' అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో ''[[జాంబవతీ కళ్యాణము]]'', ''మదాలసాచరితము'', '' |
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి ''సాహితీ సమరాంగణ సార్వభౌముడు'' అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో ''[[జాంబవతీ కళ్యాణము]]'', ''మదాలసాచరితము'', ''సత్య వధూప్రీణనము'', ''సకలకథాసారసంగ్రహము'', ''జ్ఞానచింతామణి'', ''రసమంజరి'' తదితర గ్రంథములు, తెలుగులో [[ఆముక్తమాల్యద]] లేక [[గోదాదేవి కథ]] అనే గ్రంథాన్ని రచించాడు.<ref>[http://books.google.com/books?id=DH0vmD8ghdMC&pg=PA210&lpg=PA210#v=onepage&q&f=false Hinduism: An Alphabetical Guide By Roshen Dalal]</ref> ''తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స'' అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి [[భువన విజయము]] అని పేరు. భువనవిజయంలో [[అల్లసాని పెద్దన]], [[నంది తిమ్మన]], [[ధూర్జటి]], [[మాదయ్యగారి మల్లన]] (కందుకూరి రుద్రకవి), [[అయ్యలరాజు రామభద్రుడు]], [[పింగళి సూరన]], [[రామరాజభూషణుడు]] (భట్టుమూర్తి), [[తెనాలి రామకృష్ణుడు]] అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు [[అష్టదిగ్గజములు]]గా ప్రఖ్యాతి పొందారు. |
||
==భక్తునిగా== |
==భక్తునిగా== |
10:38, 24 సెప్టెంబరు 2020 నాటి కూర్పు
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడుగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్, న్యూనిజ్ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు.[1] ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడచు[2]. 240 కోట్ల వార్షికాదాయము ఉంది. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించాడు.
సాహిత్య పోషణ
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్య వధూప్రీణనము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.[3] తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి పొందారు.
భక్తునిగా
కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించాడు. అంతేకాక ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు.[4][5] అనేక దాన ధర్మాలు చేసాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఏడు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.
నిర్మాణాలు
ఈయన చెన్నకేశవస్వామి వారి దేవాలయం కట్టించాడు.
కుటుంబము
కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ, కమల).[6] కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు.[7] పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతిని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవిని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు.[8] చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు.[6][9] కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం[10] ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524లో మరణించాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలును వారసునిగా చేసాడు.
మతము, కులము
శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంట్ అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి [11][12]. శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22-23-24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది [13][14][15][16][17][18][19][20][21].
సమకాలీన సంస్కృతిలో
శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం నేపథ్యంగా తెలుగులో అనేక సినిమాలు విడుదలైనవి. అందులో కొన్ని మల్లీశ్వరి, మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ, ఆదిత్య 369
ఇవి కూడా చూడండి
శ్రీ కృష్ణదేవ రాయల రాజ సేవకులు
మూలాలు
- ↑ Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258
- ↑ రాయలవారి వంశము: http://www.eenadu.net/opiniondisplay.asp?myqry=opini2%2Ehtm&opid=2&reccount=2 Archived 2008-12-05 at the Wayback Machine
- ↑ Hinduism: An Alphabetical Guide By Roshen Dalal
- ↑ Encyclopaedia of Indian Literature: devraj to jyoti, Volume 2 By Amaresh Datta
- ↑ The Encyclopaedia Of Indian Literature (Volume Five (Sasay To Zorgot), Volume 5 By Mohan Lal
- ↑ 6.0 6.1 Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature By William Joseph Jackson
- ↑ Krishnadeva Raya: the great poet-emperor of Vijayanagara - G. Surya Prakash Rao
- ↑ Encyclopaedia of Indian Literature: K to Navalram - Amaresh Datta, Sahitya Akademi
- ↑ Courts of Pre-Colonial South India By Jennifer Howes
- ↑ Readings in South Indian history - T. V. Mahalingam
- ↑ Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258
- ↑ History: UGC-NET/SET/JRF (Paper II and III), 1/e - By Amitava Chatterjee
- ↑ సర్దేశాయి తిరుమలరావు-ది హిందూ ఆంగ్ల దినపత్రిక
- ↑ యాదవాభ్యుదయ వాఖ్య - అప్పయ్య దీక్షిత
- ↑ నరసభూపాలియము - భట్టు మూర్తి
- ↑ అచ్యుతరాయాభ్యుదయము - రాజనాథ కవి
- ↑ వరదాంబిక పరిణయం - తిరుమలాంబ
- ↑ స్వరమేధకళానిధి - రామయామాత్య తొదరమల్ల
- ↑ బాలభాగవతం - కోనేరునాథ కవి
- ↑ వసుచరితము - భట్టు మూర్తి
- ↑ విజయనగర సామ్రాజ్య మూలములు - యస్. కృష్ణస్వామి అయ్యంగార్ - మద్రాసు విశ్వవిద్యాలయము, 1919
- లెటర్ టు ద ఎడిటర్, డా.సర్దేశాయి తిరుమలరావు, ద హిందూ ఆంగ్ల దినపత్రిక
- హంపి నుండి హరప్పా దాకా -ఆచార్య తిరుమల రామచంద్ర,2013, జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
- "శ్రీ కృష్ణదేవరాయలు"-గుత్తి చంద్రశేఖర్ రెడ్డి, బళ్ళారి తెలుగు సంఘము, తెలుగు మహాసభల సంచిక
ఇంతకు ముందు ఉన్నవారు: వీరనరసింహ రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1509 — 1529 |
తరువాత వచ్చినవారు: అచ్యుత దేవ రాయలు |
లంకెలు
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Commons category link is on Wikidata
- రాయల యుగం కవులు
- అష్టదిగ్గజములు
- రాయల యుగం
- టాంకు బండ పై విగ్రహాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- భారతదేశ చరిత్ర
- ఆంధ్రప్రదేశ్ చరిత్ర
- విజయ నగర రాజులు