Jump to content

వరాహమిహిరుడు

వికీపీడియా నుండి
वराहमिहिर
Varāhamihir
వరాహమిహిరుడు
జననం
మిహిరుడు

505 CE
మరణం587 CE
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లువరాహమిహిరుడు
వృత్తిభారత ఖగోళ శాస్త్రవేత్త
, భారతీయ గణిత శాస్త్రవేత్త,
హిందూ జ్యోతిష శాస్త్రవేత్త
Notable workపంచ సిద్ధాంతిక, బృహత్ సంహిత

దైవజ్ఞ వరాహమిహిర Daivajna Varāhamihira (సంస్కృతం : वराहमिहिर; 505587), లేదా వరాహమిహిరుడు, లేదా వరాహ, లేదా మిహిర. భారత ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రజ్ఞుడు,, జ్యోతిష్య శాస్త్రవేత్త. ఉజ్జయినిలో ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానములోని నవరత్నాలలో ఒకడు. బృహత్సంహిత, బృహజ్జాతకము ఈయన రచనల్లో ముఖ్యమైనవి.

వరాహమిహిరుడి గురించి క్షుప్తంగా..

[మార్చు]

ఉజ్జయిని నగరానికి సమీపంలో సా.శ. 4 వ శతాబ్దంలో ఆదిత్యదాసుడనే జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు పాట్నాలో నాటి సుప్రసిద్ధ గణీత శాస్త్రవేత్త ఆర్యభట్టును కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం జేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంథాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

శాస్త్రాలే గాక, పత్యేకించి గ్రీకు శాస్త్రాలు అధ్యయనం జేసినట్లు అక్కడకు వెళ్ళీ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో గణిత శాస్త్రజ్ఞుడైనా అనేక శాస్త్ర విషయాలను వివరించారు.

మిహిరుడు వరాహ మిహిరునిగా

[మార్చు]

అనతి కాలంలో ఉజ్జయిని గొప్ప విద్యా కేంద్రము, అక్కడ కళలు, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రము అనే అంశాలలో ప్రసిద్ధులైన ఎందరో పండితులు సుదూరాల నుంచి వచ్చేవారు. పరస్పర భావ వినిమయం వుండేది. అచ్చటి శాస్త్ర చర్చలలో మిగిరుని శాస్త్ర పటిమ తెలియ వచ్చిన రెండవ విక్రమాదిత్య చంద్ర గుప్తుడు తన ఆస్థాన మండలి నవరత్నములలో నొకనిగా ఆయనకు గౌరవించాడు. దీనికి సంబంధించిన ఒక సంఘటన చెప్తారు. విక్రమాదిత్యుని కుమారుడు వరాహము కారణంగా మరణిస్తాడని మిహిరుడు జ్యోతిషము చెప్పగా రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతో కట్టుదిట్టము చేసినా శాస్త్ర ప్రకారము చెప్పిన సమయానికి, చెప్పిన కారణముగానే రాకుమారుడు మరణిస్తే విక్రమాదిత్యుడు తన కుమారుని గతికి విలపించినా మిహిరుని ప్రతిభను శ్లాఘించి మగధ సామ్రాజ్య గౌరవ చిహ్నము వరహముద్రాంకితముతో సత్కరించాడు. నాటి నుంచి ఆ జ్యోతిః శాస్త్ర వేత్త వరాహమిహిరుడుగా పిలువబడ్డాడు. వేదాలన్నీ చదివి ఎంతో పండితుడైనా మానవాతీత శక్తులను గ్రుడ్డిగా నమ్మేవాడు కాడు. అతనొక అద్భుత శాస్త్రవేత్త!

రచనలు

[మార్చు]

సిద్ధాంత స్కందానికి చెందిన "పంఛా సిద్ధాంతిక" అనే గ్రంథంము దేశంలో అతి ప్రాచీన కాలము నుండి ప్రచారంలో ఉన్న పైతాహహ, వాశిష్ట, రోమిక, పౌలిశ, సౌర సిద్ధాంతాల సారాన్ని సంకలనము చేసిన రూపము. వీనిలో సౌర సిద్ధాంతము ఉన్నతమైనదని తెలిపాడు. వేధకు సరిపోయేటట్లు వున్న ప్రాచీన సూర్య సిద్ధాంతాన్ని వెయ్యికి పైబడిన సంవత్సరము అనంతరం చేయబడిన పరిశోధనలు, స్వకల్పనలతో మార్చి గ్రంథస్తము చేశాడు. దీనికి తప్ప మిగిలిన నాల్గు సిద్ధాంతాలకు మూల గ్రంథాలు లభింపక పోవుటచే వాటిని తన గ్రంథ రూపంలో అందించిన వరాహ మిహిరునికి ఎంతో ఋణపడి ఉన్నాము.

బృహ జ్ఞాతకము

[మార్చు]

జ్యోతిష ఫల విభాగానికి చెందిన బృహ జ్ఞాతకములో 26 అధ్యాయాలు, 417 శ్లోకాలు ఉన్నాయి. దీనినే హోరా శాస్త్రమని పిలిచాడు. ఇలాంటి రచనలకు సాధారణంగా వాడే ఛందస్సులు గాక వృత్తులలో విషయాలను అందంగా అందించాడు. దీనికి సహాయకారిగా సవాంశ గణీతం కూడా రచించాడు. ఈ రెండు గ్రంథాలు ఆధారంగా సరియైన జ్యోతిష ఫలితాలు వస్తాయని ప్రతీతి. నేటి వరకు గూడా ప్రచారంలో వున్నదీ శాస్త్రము

బృహత్సంహిత

[మార్చు]

బృహత్సంహితలో గ్రహాల సంచారము, వాటి వలన భూమి మీద ప్రాణులకు కలుగు ఫలాలు, నక్షత్ర మండల ఉదయాదుల వల్ల ఫలితాలు, మేఘాలు, గర్భధారణ, భూకంప ఉల్క పాతములు, ఇంద్ర ధనుస్సు, ప్రతి సూర్యుడు, పిడుగు పడటం వంటి అనేక సృష్టి వైచిత్రాలు, శకున ఫలములు, వాస్తు ప్రకరణము, భూమిలో రకాన్ని బట్టి ఎంత లోతున నీళ్ళు దొరుకుతుందనే విషయం, వృక్షాయర్వేదము, వజ్ర లెపనము, జంతువులు, మణుల పరీక్ష తిథి, గోచార ఫలితాలు వంటి అనేక విషయాలు విస్తారంగా తెలియ జేశాడు.

ఖగోళం

[మార్చు]

చంద్ర, సూర్య గ్రహణాలు రాహు, కేతువుల వల్ల కాదని భూమి మీద నీడ పడటం చేత చంద్ర గ్రహణం, చంద్రుని నీడ పడటం చేత సూర్య గ్రహణము కలుగుతున్నాయని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని వివరించాడు. తోకచుక్కలు వాని రకాలు గురించి తెలిపాడు.

అనేక సందర్భాలలో వరాహమిహిరుడు గర్గ, పరాశర, అసిత దేవతల, కశ్యప, బృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషుల మతము ప్రకారము అని విడి విడిగా ప్రస్తావించటం, అంతే కాక ఇంకా ఎంతో మందిని అనుసరించి (అన్యాన్ బహున్) అని చెప్పడం వలన ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయ సంపత్తి ద్యోతకమవుటయే కాక ఆ కాలములో అవన్నియు లభించి ఉండేవని తెలుస్తుంది.

"దకార్గాళాధ్యాయం"

[మార్చు]

"దకార్గాళాధ్యాయం"లో ఎలాంటి స్థలాలలో నీరు ఎంతెంత లోతుల్లో దొరుకుతుందో వివరించాడు. మనుష్యుని శరీరంలోని రక్త నాడులలో రక్యము ప్రవహించునటుల భూమిలో గల జల నాడులలో జల ప్రవాహములు గలవని వాటిని గుర్తించటానికి భూమిపై నున్న చెట్లు పుట్టలు ఉపయోగ పడతాయని నిరూపించాడు. అనంతర కాలంలో భారతీయ శాస్త్రవేత్తలు ఎవరు వీటి మీద పరిశోధన చేసి ప్రాచుర్యములోనికి తీసుకు రాలేదు. ఈ అధ్యాయములోని విషయాలు ఆధారముగా ప్రస్తుతం వేగంగా పరిశోధనలు చేయుట జరుగుతుంది. భూగర్భ లోహం కనుక్కునేందుకు వరాహమిహిరుని సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారు. చెట్లు, ఆకులు పరిశీలించి వీటి అంచనాయే గాక, ఖనిజ సంపత్తిని అంచనా వేసే క్రొత్త శాస్త్రము ఈ అధ్యాయం ఆధారంగా ఉధ్బవించింది.

ప్రాథమికంగా గణిత శాస్త్రవేత్త అయిన వరాహమిహిరుడు ఖగోళ, జ్యోతిష, ద్రవస్థితి, భూగర్బ, ఆయుర్వేద వంటి అనేక శాస్త్రాలలో తన ప్రతిభ కనబరిచాడు. జ్యోతిష శాస్త్ర చంద్రుణ్ణీ పైకి తీస్తానంటూనే తన గ్రంథము స్థానాంతరం చెందటం వలనగాని, అనేకుల నోళ్ళలో సంచరించటం వలన గానీ, వ్రాయటంలో గాని లేక తానే గాని తప్పులు చేసి ఉండవచ్చునని విద్వాంసులు దోషాన్ని పరిహరించి పరిగ్రహించమని కోరటంలో ఎంతో గౌరవం పొందాడు.

జ్యోతిష శాస్త్రంలో

[మార్చు]

ఆయన ఒక జ్యోతిష శాస్త్రవేత్త. ఆయన జ్యోతిష శాస్త్రంలో మూడు ముఖ్యమైన విభాగాలను వ్రాసారు.

  • బృహత్ జాతక - హిందూ ఖగోళ శాస్త్రం , జాతక గ్రంథంలో గల ఐదు ముఖ్య గ్రంథములలో ఒకటి.
  • లఘు జాతక - దీనిని స్వల్ప జాతక అనికూడా పిలుస్తారు.
  • సమస సంహిత - దీనిని "లఘు సంహిత" లేదా "స్వల్ప సంహిత" అని కూడా పిలుస్తారు.
  • బృహత్ యోగ యాత్ర - ఇది "మహా యాత్ర" లేదా " యక్షస్వమెధియ యాత్ర" అని పిలువబడుతుంది.
  • యోగ యాత్ర - ఇది "స్వల్ప యాత్ర"గా పిలువబడుతుంది.
  • టిక్కని యాత్ర
  • బృహత్ వివాహ పటాల్
  • లఘ వివాహ పటాల్ - ఇది స్వల్ప వివాహ పటాల్ గా పిలువబడుతోంది.'
  • లఘ్న వరాహి
  • కుతూహల మంజరి
  • వైవజ్ఞ వల్లభ

ఆయన కుమారుడు ప్రితుయాసాస్ కూడా ఖగోళ శాస్త్రంలో మంచి రచనలు చేశారు. ఆయన "హోర సార" అనే ప్రసిద్ధ రచన జ్యోతిష శాస్త్రం పై రాశాడు.

గణాంక శాస్త్రంలో

[మార్చు]

ఆయన చేసిన పరిశోధన మూలంగా ప్రాచుర్యం పొందిన ఈ క్రింది త్రికోణమితి సూత్రాలు కనిపెట్టబడ్డాయి.

అదేకాక ఆయన ఆర్యభట్టు కనిపెట్టిన సైన్ టేబుల్ యొక్క విలువలని మరింత నిరుష్టంగా చేసారు. అంక గణితం (Arithmetic) లో సున్నా, అభావిక సంఖ్యల (Negative Numbers) గుణాలని వివరించాడు.

భౌతిక శాస్త్రంలో

[మార్చు]

కాంతి కిరణాలు ప్రతిఫలనం చెందటం (Reflection), వక్రీకరణం (Refraction) చెందటం గురించి ఆయన రాసారు.

జ్యోతిషశాస్త్రం అనగానే మనకు వెంటనే స్ఫురించేది వరాహమిహిరుడు. ఉజ్జయినికి చెందిన ఈయన ఖగోళ శాస్తజ్ఞ్రుడు కూడా. 1500 ఏళ్ల క్రితమే అంతరిక్షానికి సంబంధించి ఆయన చెప్పిన విశేషాలు నేటి ఆధునిక శాస్తజ్ఞ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఖగోళ, జ్యోతిష పరిజ్ఞానం అత్యుత్తమ స్థాయిలో పరిఢవిల్లింది. మన ఋషులు చెప్పిన ఖగోళ, జ్యోతిష విషయాలు విశ్వవ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువదింపబడ్డాయి. ఇబున్ బతుతా, అల్ బరూనీ ప్రాచీన ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి భారత్‌ను సందర్శించిన అరబ్ పండితులు. ఖగోళ శాస్త్రానికి సంబంధించి వారు చేసిన అనువాదాలే భారతీయ ప్రాచీన విజ్ఞానాన్ని అధ్యయనం చేయడానికి జర్మనులకు ప్రేరణనిచ్చింది. వరాహమిహిరుడు క్రీ.శ.505లో ఉజ్జయిని సమీపంలోని కపిత్థ గ్రామంలో జన్మించాడు. అతడి తండ్రి ఆదిత్యదాస సూర్యోపాసకుడు. వరాహమిహిరుడు తండ్రి వద్దనే జ్యోతిషశాస్త్రం నేర్చుకున్నాడు. యుక్తవయస్సులో పాటలీపుత్రం వద్ద కుసుమపురం సందర్శించినపుడు మిహిరుడు ప్రఖ్యాత ఖగోళ, గణిత శాస్తజ్ఞ్రుడు ఆర్యభట్టును కలుసుకున్నాడు. అనంతరం ఖగోళ, జ్యోతిషశాస్త్రాలలో విశేష కృషి చేయడమే తన జీవిత ధ్యేయంగా వరాహిమహిరుడు భావించాడు. గుప్తుల పాలనలో సంస్కృతి, కళలు, విజ్ఞాన శాస్త్రాలకి నిలయమైన ఉజ్జయినికి వివిధ ప్రాంతాల నుండి ఎందరో పండితులు వచ్చి తమ జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకునేవారు. జ్యోతిష శాస్త్రంలో వరాహమిహిరుని ప్రజ్ఞను తెలుసుకున్న మాళ్వ వంశస్థుడైన రాజా యశోధర్మ విక్రమాదిత్యుడు అతడిని తన ఆస్థాన పండితునిగా నియమించి గౌరవించాడు. వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పటికీ, వైజ్ఞానిక దృక్పథం గల వరాహమిహిరుడు పాతకాలపు విశ్వాసాలను గుడ్డిగా నమ్మలేదు. ఆర్యభట్టులాగే తాను కూడా ‘్భమి గుండ్రంగా ఉంటుంద’ని చెప్పాడు. భూమ్యాకర్షణ శక్తి గురించి మొట్టమొదట చెప్పినది వరాహమిహిరుడే! మానవ శరీరాలను ఒక బలమైన శక్తి భూమిపై లాగి నిలిపి ఉంచుతోందని తెలిపాడు. చంద్రుడు, ఇతర గ్రహాలు కూడా స్వయం ప్రకాశాలు కావనీ, సూర్యకాంతి వల్లనే అవి ప్రకాశిస్తున్నాయని అన్నాడు. వరాహమిహిరుడు రచించిన గ్రంధాలలో ‘పంచ సిద్ధాంతిక’ ప్రముఖమైనది. ఇందులో ఆయన ప్రాచీన వాజ్మయంలో చెప్పబడిన ఐదు ప్రధాన ఖగోళ సిద్ధాంతాలను విశే్లషించాడు. ఖగోళశాస్తప్రరమైన గణిత సంబంధిత విషయాలు ఇందులో వివరించబడ్డాయి. సూర్యసిద్ధాంతం, రోమక సిద్ధాంతం, పౌలిస సిద్ధాంతం, వశిష్ట సిద్ధాంతం, పైతమ సిద్ధాంతాలను ఈ గ్రంధంలో చర్చించారు. ఆయన మరో గ్రంధం ‘బృహద్ సంహిత’. ఇందులో జ్యోతిషం, గ్రహాల కదలికలు, గ్రహణములు, మేఘాలు కమ్ముకోవడం, వర్షాలు పడడం, కుటుంబ సంబంధాలు, రత్నాలు, మణులు, ముత్యాలు, వివిధ కర్మకాండలు మొదలైనవాటి గురించి వివరాలున్నాయి. తోకచుక్కల గురించి కూడా విశేషమైన చర్చ చేశాడు. ఆ రోజుల్లో టెలిస్కోప్ వంటి పరికరాలే లేవు. వాటి గురించి ఆయన 60 శ్లోకాలలో వివరాలు చెప్పాడు. గర్గుడు, పరాశరుడు, అసితుడు, దేవలుడు వంటి మహర్షులు అంతకుముందే తోకచుక్కల గురించి ఎన్నో విశేషాలు చెప్పారని ఉటంకించాడు. జ్యోతిష శాస్త్రంలోని మూడు ప్రధాన విభాగాలకు ఎన్నో విషయాలు గ్రంధస్తం చేశాడు. ఆయన కుమారుడు ప్రీతుయశస్ జ్యోతిషశాస్త్రంపై ‘హోరశాస్త్ర’ గ్రంధాన్ని రచించాడు. గణిత శాస్త్రానికి సంబంధించిన త్రికోణమితి సూత్రాలను వరాహమిహిరుడు కనుగొన్నాడు. ఆ సూత్రాలకు లెక్కలు కట్టి పట్టికలు తయారుచేశాడు. సున్నా, ఋణాత్మక సంఖ్యలకు సంబంధించిన బీజ గణిత లక్షణాలను ఆయన నిర్వచించాడు. నేడు మనం ప్రముఖంగా వింటున్న ‘పాస్కల్ ట్రాంగిల్’ని మొదట రూపొందించింది వరాహమిహిరుడే! ద్విపద గుణకాన్ని (బినోమియల్ కోఎఫిషియంట్స్) ఎలా గణించాలో కూడా వివరించాడు. పర్యావరణం, భూగర్భ జలాల గురించి కూడా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు. భూగర్భ జలాలను ఎలా పసిగట్టాలో చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే! చెదలు ఎక్కువగా ఉన్న చోట భూమిలోపల జలాలున్నాయనడానికి సంకేతమని ఆయన చెప్పిన విషయంపై నేటి శాస్తవ్రేత్తలు దృష్టిపెడుతున్నారు. ఎటువంటి సాంకేతిక పరికరాలూ లేని ఆరోజుల్లోనే- ఏడాదిలో రాత్రి, పగలు సమానంగా ఉండే రోజుల గురించి చెప్పాడు. దీనికి సంబంధించి వరాహమిహిరుడు చెప్పిన ‘విలువ’ను నేటి జియోస్టేషనరీ శాటిలైట్లలో ఉపయోగిస్తున్నారు. సూర్య సిద్ధాంతం.. అంగారక గ్రహం

  • ‘పంచ సిద్ధాంతిక’ గ్రంధంలో సూర్య సిద్ధాంతం ఒకటి. ఇందులో కాంతి గమనం గురించి, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురువు, శని వంటి గ్ర హాల ‘వ్యాసాల’ గురించిన వివరాలున్నాయి. గ్రహాలు ఒక ప్రక్కకి ఒరిగి తూర్పు వైపుగా ఎలా తిరుగుతాయో వర్ణన ఉంది.

ఈ గ్రంధంలో వివిధ నక్షత్రాల స్థానాలూ, సూర్యగ్రహణాలకి సంబంధించిన లెక్కలు ఉన్నాయి.

కాలగణనకి సంబంధించిన వివరాలున్నాయి. దైవీ సంవత్సరాలు, అసురీ సంవత్సరాలు, బ్రహ్మ యొక్క పగలు, రాత్రి లెక్కలున్నాయి.

ఈ గ్రంధంలో అంగారక గ్రహం గురించి చాలా విశేషాలున్నాయి. అంగారక గ్రహం వ్యాసం, చుట్టుకొలత, దాని రంగు, దాని చుట్టూ తిరిగే ఉపగ్రహాల వివరాలున్నాయి. అంగారక గ్రహంపై నీరు, ఇనుప ఖనిజాలు లభ్యవౌతున్నాయని వరాహమిహిరుడు పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని నాసా, ఇస్రో పరిశోధనలు కూడా చెప్తున్నాయి.

సౌరమండలంలోని గ్రహాలు ఎలా ఆవిర్భవించాయో, సూర్యుని కేంద్రంగా చేసుకుని అవి ఎలా పరిభ్రమిస్తున్నాయో మొట్టమొదట వివరించింది వరాహమిహిరుడే! శ్రీ అరుణ్ ఉపాధ్యాయ రిటైర్డ్ ఐపిఎస్ అధికారి. నాసా మార్స్ మిషన్ ప్రయోగం సందర్భంలో వరాహమిహిరుడు చెప్పిన విషయాలపై అధ్యయనం చేశారు. అంగారక గ్రహం గురించి వరాహమిహిరుడు చెప్పిన విషయాలు, నాసా ప్రయోగంలో వెల్లడైన విషయాలు ఒకేలా ఉన్నాయని ఆయన అన్నారు. సూర్య సిద్ధాంతానికి సంబంధించిన పుస్తకం నేడు లభ్యం కావడం లేదు. కానీ అందులో కొన్ని విషయాలు కొందరి పండితుల వద్ద లభ్యవౌతున్నాయి. సూర్య సిద్ధాంతం మూల గ్రంధం విదేశీయులు తస్కరించి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో పర్వదినాల తిథులను, నక్షత్రాల వివరాల గురించి పంచాంగకర్తలు ఉపయోగించే సూర్యసిద్ధాంత గ్రంధము భాస్కరాచార్యుడు సంస్కరించినది. ఏది ఏమైనా అంత గొప్ప గ్రంధాన్ని రచించిన వరాహమిహిరుడు మాత్రం వినయపూర్వకంగా ఇలా అంటాడు.. ‘జ్యోతిష శాస్త్రం ఒక మహాసముద్రం. దానిని దాటడం ఎవరి తరమూ కాదు. నా గ్రంధం ఆ మహా సముద్రంపై విహరించేందుకు సహాయపడే ఒక నావ మాత్రమే.

రచన :ప్రముఖ జ్యోతిష్కులు డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ


బయటి లింకులు

[మార్చు]